భారత ఎన్నికల సంఘం
రాజ్యసభ, రాష్ట్ర శాసనమండలి ఎన్నికలు-2026 నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 3:43PM by PIB Hyderabad
1. 27 రాజ్యసభ స్థానాలకు, మూడు రాష్ట్రాల్లో శాసనమండలి స్థానాలకు (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక) రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలను, ఉపఎన్నికలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది.
2. వివరాలు దిగువన పేర్కొన్న విధంగా ఉన్నాయి.
|
శాసన వ్యవస్థ
|
ఎన్నికల విధానం
|
రాష్ట్రం(లు)
|
స్థానాలు
|
|
రాజ్యసభ
|
రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు
|
10 రాష్ట్రాలు*
|
24
|
|
రాజ్యసభ
|
ఉపఎన్నిక
|
మహారాష్ట్ర
|
1
|
|
రాజ్యసభ
|
ఉపఎన్నిక
|
తమిళనాడు
|
1
|
|
రాజ్యసభ
|
ఉపఎన్నిక
|
ఒడిశా
|
1
|
|
రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)
|
రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు
|
బీహార్
|
9
|
|
రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)
|
రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు
|
కర్ణాటక
|
7
|
|
రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)
|
ఉపఎన్నిక
|
బీహార్
|
1
|
*రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం
3. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసి, రిటర్నింగు అధికారులను, సహాయ రిటర్నింగు అధికారులను (ద్వైవార్షిక, ఉపఎన్నికలు- రెండింటి కోసం) ఎన్నికల సంఘం నియమించింది. నియామక వివరాలు గెజిట్ ఆఫ్ ఇండియా/రాష్ట్రాల గెజిట్లలో ఈ రోజు ప్రచురితమయ్యాయి.
4. దీంతో పైన పేర్కొన్న అన్ని ఎన్నికలకు ఈ రోజు అంటే 2026 జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల సమర్పణకు తుది గడువు 2026, జూన్ 8 మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుంది.
5. ప్రతి ఎన్నికకూ దాఖలైన నామినేషన్ల పరిశీలనను సంబంధిత రిటర్నింగు అధికారులు 2026, జూన్ 9న చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 2026, జూన్ 11ను చివరి తేదీగా నిర్ణయించారు.
6. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. 2026 జూన్ 18 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2267603)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15