రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నౌకాదళం 27వ ప్రధానాధికారిగా


అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతల స్వీకారం

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2026 4:01PM by PIB Hyderabad

భారత నౌకాదళం 27వ  ప్రధానాధికారి (చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్పీవీఎస్ఎంఏవీఎస్ఎంవీఎస్ఎం బాధ్యతలు స్వీకరించారు. 41 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ చేసిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠిపీవీఎస్ఎంఏవీఎస్ఎంఎన్ఎం స్థానంలో ఆయన నియమితులయ్యారు.

అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 1987 జూలై ఒకటిన భారత నౌకాదళంలో చేరారుకమ్యూనికేషన్ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాల్లో నిపుణుడైన ఆయనదాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిర్వహణసిబ్బంది వ్యవహారాలుశిక్షణ సంబంధిత విస్తృతమైన బాధ్యతలను నిర్వహించారుసముద్రంలో వివిధ యుద్ధ నౌకలకు కమాండర్‌గా అడ్మిరల్ స్వామినాథన్ సేవలందించారుఆయన నాయకత్వం వహించిన నౌకల్లో గైడెడ్ మిస్సైల్ నౌకలుఐఎన్ఎస్ విద్యుత్,  ఐఎన్ఎస్ వినాష్గైడెడ్ మిస్సైల్ కార్వెట్ ఐఎన్ఎస్ కులిష్గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉన్నాయి.

రియర్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాతఆయన కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (శిక్షణగా బాధ్యతలు నిర్వహించారుఅనంతరం ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్ (ఎఫ్ఓఎస్టీగా నియమితులయ్యారుతరువాత భారత నౌకాదళానికి స్వోర్డ్ ఆర్మ్ గా పేరొందిన వెస్ట్రన్ ఫ్లీట్ కు కమాండర్‌గా వ్యవహరించారుఆ తర్వాతఆయన తీర ప్రాంత రక్షణ సలహా బృందం ఫ్లాగ్ ఆఫీసర్ గాభారత ప్రభుత్వానికి తీరప్రాంత రక్షణభద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు.

వైస్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాతఆయన వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గానౌకాదళ ప్రధాన కార్యాలయంలో కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్చీఫ్ ఆఫ్ పర్సనల్వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ వంటి అత్యున్నత బాధ్యతలను నిర్వహించారుచీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందుఅడ్మిరల్ స్వామినాథన్ ప్రతిష్టాత్మకమైన వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా వ్యవహరించారు.

ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీబ్రిటన్ లోని శ్రీవెన్‌హామ్ జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్,  కరంజాలోని నావల్ వార్‌ఫేర్ కాలేజ్అమెరికాలోని రోడ్ ఐలాండ్న్యూపోర్ట్‌లో గల యునైటెడ్ స్టేట్స్ నావల్ వార్ కాలేజ్ లో ఆయన చదువుకున్నారున్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీకొచ్చిలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి టెలికమ్యూనికేషన్స్‌లో ఎమ్మెస్సీలండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుండి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏముంబయి విశ్వవిద్యాలయం నుంచి స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఫిల్ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పట్టాలను పొందారు.

విశిష్ట సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎంఅతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎం), విశిష్ట సేవా పతకం(వీఎస్ఎంపురస్కారాలను ఆయన అందుకున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2267346) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam