ప్రధాన మంత్రి కార్యాలయం
సామరస్యానికున్న శక్తిని, సామర్థ్యాన్ని తెలియజెప్పే సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
మన దేశ సంకల్పాన్ని చాటిచెప్పిన 1998 అణు పరీక్షలను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 10:44AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 1998 మేలో పోఖ్రాన్లో చరిత్రాత్మక రీతిలో భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ఈ రోజు గుర్తు చేసుకున్నారు. వాటిని దేశ సంకల్పాన్ని చాటిచెప్పిన ముఖ్యమైన ఘట్టంగా వర్ణించారు. ‘‘మే 11న జరిగిన పరీక్షల తర్వాత ప్రపంచమంతా భారత్పై ఒత్తిడి తీసుకొచ్చిననప్పటికీ, ఏ శక్తీ భారత్ను నియంత్రించలేదని నిరూపించాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం
‘‘ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా।
న శివేన వినా శక్తిర్న శక్త్యా వినా శివః। । ’’
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘మన దేశ సంకల్పం ఎంత దృఢమైనదో 1998లో ఇదే రోజు భారత్ నిర్వహించిన అణు పరీక్షలు ప్రపంచానికి చాటి చెప్పాయి. మే 11 నాటి పరీక్షల తర్వాత ప్రపంచమంతా దేశంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ, ఏ శక్తీ భారత్ను నియంత్రించలేదని మనం నిరూపించాం.
‘‘ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా।
న శివేన వినా శక్తిర్న శక్త్యా వినా శివః। । ’’
(రిలీజ్ ఐడి: 2260517)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam