వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతులు రూ.72,000 కోట్లు… గరిష్ఠ స్థాయికి చేరిక
భారత రికార్డు స్థాయి సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతుల్లో ఘనీభూత ఖాద్య చిన్నరొయ్యల వాటా రూ.47,973 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 8:04PM by PIB Hyderabad
భారత్ సముద్ర సంబంధి ఆహార ఉత్పాదనల ఎగుమతులు (సీఫూడ్ ఎక్స్పోర్ట్స్) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.72,325.82 కోట్లకు (8.28 బిలియన్ అమెరికా డాలర్ల)కు చేరి రికార్డును సృష్టించాయని ఎంపీఈడీఏ విడుదల చేసిన తాత్కాలిక సమాచారం వెల్లడించింది. సముద్ర సంబంధి ఆహారోత్పాదనల ఎగుమతులు 19.32 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నట్లు ఈ డేటా పేర్కొంది.
ఈ వృద్ధిలో ఘనీభూత ఖాద్య చిన్నరొయ్యలు (ఫ్రోజెన్ శ్రింప్) ప్రధాన పాత్రను పోషించాయి. ఇవి రూ.47,973.13 కోట్ల (5.51 బిలియన్ అమెరికా డాలర్ల) మేరకు ఉండి, మొత్తం ఎగుమతుల ఆదాయంలో మూడింట రెండు వంతులకు పైగా లెక్కకు వచ్చాయి. చిన్నరొయ్య ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 6.35 శాతం, పరిమాణం పరంగా చూసినప్పుడు 4.6 శాతం వృద్ధి చెంది, భారత సముద్ర సంబంధి ఉత్పాదనల ఎగుమతుల్లో తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాయి.
మరే ఇతర దేశం కన్న అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చోటుచేసుకున్నాయి. అక్కడికి దిగుమతి చేసిన సరకుల విలువ 2.32 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. ఏమైనా, అమెరికాకు పంపుతున్న సరకులో రాశి పరంగా 19.8 శాతం తగ్గుదల, విలువ పరంగా 14.5 శాతం తగ్గుదల నమోదయ్యాయి. ఇది రెండు దేశాలూ పరస్పరం అమలు చేస్తున్న సుంకాల ప్రభావాన్ని పట్టి చూపుతోంది.
చైనా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఆగ్నేయ ఆసియా దేశాల వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లలో వృద్ధి బలంగా ఉండడం ఈ క్షీణతను చాలా వరకూ భర్తీ చేసింది. చైనాకు ఎగుమతులు 22.7 శాతం మేర పెరిగి, ఆ దేశం రెండో అతి పెద్ద ఎగుమతిదారు దేశంగా నిలిచింది. చైనాకు ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 22.7 శాతం మేర, రాశి పరంగా చూసినప్పుడు 35.2 శాతం మేర పెరిగాయి. ఈయూ కూడా బలమైన వృద్ధిని చూపింది. ఈయూకు ఎగుమతులు 37.9 శాతం మేర, రాశి పరంగా 35.2 శాతం మేర పెరిగాయి. ఆగ్నేయ ఆసియాలో కూడా చెప్పుకోదగిన విస్తరణ చోటు చేసుకుంది. అక్కడ వృద్ధి విలువ పరంగా 36.1 శాతం, రాశి పరంగా 28.2 శాతం మేరకు ఉంది. జపాన్కు ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 6.55 శాతం అధికమయ్యాయి. పశ్చిమ ఆసియాలో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నెలకున్న అనిశ్చిత వల్ల ఆ ప్రాంత దేశాలకు ఎగుమతుల్లో 0.55 శాతం నామమాత్ర క్షీణత కనిపించింది.
అనేక మార్కెట్లలో వృద్ధి రెండు అంకెల స్థాయిలో నమోదైంది. ఇది సాంప్రదాయిక మార్కెట్ల సవాళ్ల నేపథ్యంలో కొత్త మార్కెట్లను చేరుకున్నట్లయింది.
ఉత్పాదనల విషయానికి వస్తే.. ఘనీభూత చేపలు, స్క్విడ్, కటిల్ఫిష్, ఎండబెట్టిన ఆహార పదార్థాలు, జీవిత ఉత్పాదనల ఎగుమతుల్లో సానుకూల వృద్ధి చోటుచేసుకుంది. మరోవైపు, చల్లని ఉత్పాదనలు మాత్రం క్షీణించాయి. సురిమీ, చేపల భోజనం, చేప నూనెల ఎగుమతులు మెరుగయ్యాయి. ఆధునిక రవాణా వ్యవస్థ పరంగా గమనించగా, అయిదు అగ్రగామి ఓడరేవులైన.. వైజాగ్, జేఎన్పీటీ, కోచి, కోల్కతా, చెన్నై నుంచి మొత్తం ఎగుమతుల విలువ దాదాపు 64 శాతంగా ఉంది. ఇది భారత సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతి ప్రధాన సరఫరాల వ్యవస్థలో ఆయా ఓడరేవుల నిరంతర ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2254493)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4