ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో రూ.18,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రజల అనుసంధానతను, జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో ఈ కార్యక్రమాల తోడ‌్పాటు: పీఎం


నేడు దేశవ్యాప్తంగా సాగుతున్న రైల్వేల ఆధునీకరణ.. పశ్చిమబెంగాల్ వెనకబడకూడదన్నదే మా సంకల్పం... పశ్చిమబెంగాల్‌లోనూ రైల్వే మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం: పీఎం


తూర్పు భారదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా కొనసాగుతున్న కోల్‌కతా, హల్దియా నౌకాశ్రయాలు.. హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న యాంత్రీకరణ... ఓడరేవు సామర్థ్యం పెంపుదలతో పాటు సరకు రవాణా కార్యకలాపాలు వేగవంతం, వాణిజ్యం కోసం అందుబాటులోకి మరిన్ని వసతులు: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAR 2026 3:48PM by PIB Hyderabad

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.18,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేశారుఈ సందర్భంగా ప్రసంగిస్తూ "ఈ రోజు కోల్‌కతా నుంచి పశ్చిమబెంగాల్తూర్పు భారతదేశ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలవుతోంది" అన్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు రూ.18,000 కోట్లకుపైగా విలువైన రహదారులురైల్వేలుఓడరేవుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిజాతికి అంకితమిచ్చినట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారుఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్తూర్పు భారతదేశానికి నూతనోత్తేజాన్ని కలిగిస్తాయని, వాణిజ్యంపరిశ్రమలను ప్రోత్సహిస్తాయని అన్నారులక్షలాది మంది ప్రజలకు కొత్త అవకాశాలను కల్పించటం ద్వారా వారి జీవితాలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారుకొన్ని కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. ఖరగ్‌పూర్-మోర్గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని ప్రధామంత్రి చెప్పారుదుబ్రాజ్‌పూర్ బైపాస్కంగ్సాబతిశిలాబతి నదులపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనల గురించి వివరిస్తూ.. వాటిద్వారా రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందన్నారు. "ఈ పరివర్తనాత్మక ప్రాజెక్టుల సందర్భంగా పశ్చిమబెంగాల్తూర్పు భారత ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నానుఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

భారత రైల్వేల ఆధునీకరణకు దేశవ్యాప్తంగా ముమ్మర ప్రచారం కొనసాగుతోందనిఈ మిషన్‌లో పశ్చిమబెంగాల్ వెనుకబడకూడదన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పమని ప్రధానమంత్రి వెల్లడించారుపశ్చిమబెంగాల్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోందని ఆయన స్పష్టం చేశారుఈ సందర్భంగా కలైకుండ-కనిమొలి విభాగంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను జాతికి అంకితమిచ్చారు. "ఈ కార్యక్రమాలు రద్దీగా ఉండే రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచుతాయిసురక్షితమైన ప్రయాణాలు జరుగుతాయివేగంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయిఅని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి ప్రారంభించిన ఆరు రైల్వే స్టేషన్లు.. కామాఖ్యగురిఅనారతమ్లుక్హల్దియాబారాభుంసియూరిను అమృత్ భారత్ స్టేషన్లుగా ప్రకటించారుఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గొప్ప సంస్కృతి ఇప్పుడు ఈ స్టేషన్లలో మరింతగా వెలుగొందుతుందనిమరికొన్ని స్టేషన్లు పునరాభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారుపురులియా-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ఆయన ప్రారంభించారు. "ఈ రైలు సర్వీస్ ద్వారా పశ్చిమబెంగాల్ ప్రజలకు మాత్రమే కాక.. జార్ఖండ్బీహార్ఉత్తరప్రదేశ్ఢిల్లీ రాష్ట్రాల ప్రజలకూ ఎంతో ప్రయోజనకరంఅని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఆర్థిక పురోగతిని వేగవంతం చేయటంలో రహదారి, రైలు మార్గాలతో పాటు ఓడరేవులుజలరవాణా అంతే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారుదశాబ్దాలుగా తూర్పు భారత్‌లోని ఈ సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశారనినేడు జలమార్గాలు వాణిజ్యంపారిశ్రామికాభివృద్ధికి సరికొత్త మార్గాలను చూపిస్తున్నాయని చెప్పారుఈ దిశగా కీలకమైన పోర్టు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలుజాతికి అంకితమిచ్చే కార్యక్రమాలు జరిగాయితూర్పు భారదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా కోల్‌కతాహల్దియా నౌకాశ్రయాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారుహల్దియా డాక్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న యాంత్రీకరణ ద్వారా ఓడరేవు సామర్థ్యం పెరగటంతో పాటు సరకు రవాణా కార్యకలాపాలు వేగవంతం అవుతాయనివాణిజ్యానికి నూతన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారుఅదనంగా కోల్‌కతా డాక్ సిస్టమ్‌లోని బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణ పనులుకిడ్డర్‌పూర్ డాక్ వద్ద సరకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే పనులు కూడా జరుగుతున్నాయన్నారు. "ఈ ప్రాజెక్టులన్నీ తూర్పు భారతదేశంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయిఅని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.

రహదారులు, రైల్వేలుఓడరేవులకు సంబంధించిన ఈ నూతన ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ ఆధునిక భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ప్రధానమంత్రి తెలిపారురైతులువర్తకులుపారిశ్రామికవేత్తలువిద్యార్థులుసమాజంలోని ప్రతి విభాగానికి ఈ ప్రాజెక్టుల ప్రయోజనాలు చేరుతాయన్నారుపర్యాటక రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడటంతో స్థానిక పరిశ్రమలుసేవా రంగాలు నూతనోత్తేజాన్ని సంతరించుకుంటాయని వ్యాఖ్యానించారుభారతదేశానికి దిశా నిర్దేశం చేయటంలో బెంగాల్ కీలక పాత్రను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుబలమైన అనుసంధానతఆధునిక మౌలిక సదుపాయాలే అభివృద్ధి చెందిన బెంగాల్ ఏర్పాటుకు ఆధారమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "భారతదేశానికి ఎల్లప్పుడూ దారి చూపిన బెంగాల్.. 'వికసిత్ బెంగాల్'గా వృద్ధి చెంది పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్నదే మా సంకల్పంఅని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2254242) సందర్శకుల సూచీ సంఖ్య : : 12