ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2026 8:53AM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

శ్రీ చంద్రశేఖర్ శతజయంతి ప్రారంభాన్ని ఈ ఏడాది సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారుఇది సుసంపన్నమైననిష్పక్షపాతమైన భారత్‌ను సాధించాలనే ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో చిత్తశుద్ధిని పునరుద్ఘాటించాల్సిన సందర్భమని తెలిపారు.

ధైర్యందృఢ సంకల్పంప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్‌ చిరస్మరణీయంగా నిలిచిపోయారని ప్రధాని అన్నారుఅచంచలమైన దేశభక్తితోసామాన్య పౌరుల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. శ్రీ చంద్రశేఖర్ ప్రజా జీవితానికి సరళతనుస్పష్టతను తీసుకొచ్చారని వివరించారు.

శ్రీ చంద్రశేఖర్‌ను కలుసుకొన్నదేశాభివృద్ధికి సంబంధించిన ఆలోచలనను పంచుకొన్న సందర్భాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు.

దేశ ప్రగతి గురించి శ్రీ చంద్రశేఖర్‌ ఆలోచనలుఆయన చేసిన ప్రయత్నాల గురించి చదవాలని భారత యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానుఆయన శతజయంతి ప్రారంభాన్ని ఈ ఏడాది సూచిస్తుందిఅలాగే సుసంపన్నమైన నిష్పాక్షికమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే ఆయన కలను సాకారం చేయడంలో మన అంకితభావాన్ని పునరుద్ఘాటించాల్సిన సమయమిదిధైర్యందృఢ సంకల్పంప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావం ఉన్న ప్రజా నాయకుడిగా శ్రీ చంద్రశేఖర్ చిరస్మరణీయులుఅచంచలమైన దేశభక్తిసామాన్య ప్రజల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా జీవితానికి సరళతనుస్పష్టతను తీసుకొచ్చారుఆయన్ను కలుసుకున్నదేశాభివృద్ధి కోసం ఆలోచనలు పంచుకున్న సందర్భాలను గుర్తు చేసుకుంటున్నానుభారత దేశ పురోగతి విషయంలో ఆయన ఆలోచనలుచేసిన కృషి గురించి దేశ యువత చదవాలని పిలుపునిస్తున్నాను’’.

***


(రిలీజ్ ఐడి: 2252844) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam