ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


నేడు ప్రారంభిస్తున్న ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.. మరింత బలమైన అనుసంధానం, ఆర్థిక – పర్యాటక రంగాలకు ఊతం

25 ఏళ్లు పూర్తిచేసుకుని 26వ యేట అడుగుపెట్టిన ఉత్తరాఖండ్.. ఈ ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రహదారి మరో మైలురాయి

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌తో ఈ ప్రాంతంలో విప్లవాత్మక మార్పు

ఈ కారిడార్‌తో సమయం ఆదా: తక్కువ వ్యయంతో, వేగంగా ప్రయాణం.. ప్రజలకు పెట్రోలు, డీజిలుపై తగ్గనున్న ఖర్చులు

చార్జీలు, రవాణా ఖర్చుల్లోనూ తగ్గుదల.. మెరుగైన ఉపాధి అవకాశాలు

మన పర్వతాలు, ఈ అడవులు, ఈ దేవభూమి వారసత్వం... ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలు: వీటిని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యం

ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త కుప్పలు... దేవభూమి పవిత్రతకు భంగం.. మన పుణ్యక్షేత్రాలైన ఈ దేవభూమి ప్రదేశాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవడం అత్యావశ్యకం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 4:10PM by PIB Hyderabad

ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారుఉత్తరాఖండ్చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిదిడెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖిబోహాగ్ బిహుపుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుదేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.

పుణ్యభూమి అయిన దేవభూమికి ప్రణమిల్లుతూ –  యమునోత్రిగంగోత్రికేదార్‌నాథ్భద్రీనాథ్‌లను కలుపుతూ సాగే చార్‌ధామ్ యాత్ర త్వరలోనే మొదలవబోతోందన్నారుదేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు అత్యంత భక్తిప్రపత్తులతో ఈ యాత్ర కోసం ఎదురుచూస్తున్నారన్నారుకార్యక్రమానికి ముందు పంచభద్రిపంచకేదార్పంచప్రయాగ్‌లను సందర్శించిన ఆయన.. ఈ ప్రాంత ఆరాధ్యదైవాలైన సంకటలా మాతదాత్ కాళీమాత తదితర ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. ‘‘ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో దాత్ కాళీమాత ఆశీస్సులు గొప్ప బలాన్నిచ్చాయి’’ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగాయావద్దేశం తరఫునా బాబా సాహెబ్‌కు ప్రధానమంత్రి నివాళి అర్పించారుపేదలూఅణగారిన వర్గాలకు న్యాయం కోసం డాక్టర్ అంబేద్కర్ ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారుఅధికరణ 370 రద్దు నుంచి పదులకొద్దీ జిల్లాల్లో మావోయిజాన్నీనక్సలిజాన్నీ నిర్మూలించడం వరకు.. గత దశాబ్ద కాలంగా రాజ్యాంగ విలువలను నిలబెట్టేలా ప్రభుత్వ విధానాలున్నాయని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగపరమైన ఆకాంక్ష… ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తీసుకెళ్లడంలో దేశం మొత్తానికీ ఉత్తరాఖండ్ మార్గదర్శిగా నిలిచింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంగా ఇరవై ఆరవ యేట అడుగుపెడుతున్న ఉత్తరాఖండ్ ప్రస్థానాన్ని వివరిస్తూ.. ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనంటూ ఇదివరకే తాను చేసిన ప్రకటనను ప్రధానమంత్రి గుర్తుచేశారుప్రస్తుత ప్రభుత్వ విధానాలుప్రజల కృషితో ఈ యువరాష్ట్రం అభివృద్ధిలో నిరంతరం కొత్తపుంతలు తొక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి నవోత్తేజాన్నిస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

రోడ్లుహైవేలుఎక్స్‌ప్రెస్ రహదారులువిమాన మార్గాలురైల్వేలుజలమార్గాల్లోనే దేశ భవిత లిఖితమై ఉంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మునుపెన్నడూ లేనిరీతిలో వేగం పుంజుకుందన్నారు. 2014కు ముందు దేశంలో మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం ఏడాదికి రూ. 2 లక్షల కోట్ల లోపే ఉండగా.. అది నేడు ఆరు రెట్లు పెరిగి రూ. 12 లక్షల కోట్లను దాటిందని వివరించారు. ‘‘ప్రస్తుతం ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ. 2.25 లక్షల కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

ఢిల్లీ పశ్చిమ యూపీ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారుఢిల్లీ మెట్రో విస్తరణమీరట్‌లో మెట్రో సేవల ప్రారంభంఢిల్లీ మీరట్ నమో భారత్ రైలు ప్రారంభంనోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంఎంఆర్‌వో కేంద్రం పనుల ప్రారంభం... అనతికాలంలోనే ఈ పనులన్నింటినీ చేపట్టినట్టు గుర్తుచేశారు. ‘‘దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి.. ఈ చిన్న ప్రాంతంలో జరుగుతున్నది దానికొక మచ్చుతునక మాత్రమే’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఎన్నో విశేష ప్రయోజనాలున్నాయని ప్రధానమంత్రి చెప్పారుఆ ప్రాంతంపై ఈ ప్రాజెక్టు బహుముఖ ప్రభావాన్ని చూపుతుందన్నారుఎక్స్‌ప్రెస్‌ రహదారి వల్ల ప్రయాణ సమయంఖర్చులు గణనీయంగా తగ్గుతాయనీ.. తద్వారా ఇంధనం చాలావరకూ ఆదా అవ్వడమే కాకుండారవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయని ఆయన వివరించారుఇప్పటికే రూ12,000 కోట్ల పెట్టుబడితో సాగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం.. వేలాది ఇంజినీర్లుకార్మికులురవాణా రంగంలో పనిచేస్తున్నవారికి ఉపాధిని కల్పిస్తోందనీఇది ప్రధానమైన ఉపాధి అవకాశాల చోదకంగా నిలిచిందనీ ఆయన వివరించారుఅలాగే ఉత్పత్తులను వేగంగా పెద్ద మార్కెట్లకు చేరవేయడం ద్వారా.. రైతులుపశుపోషకులు లబ్ధి పొందుతారని ప్రధానమంత్రి వివరించారుఘజియాబాద్బాగ్‌పథ్బరౌత్శామ్లీసహరాన్‌పూర్ గుండా వెళ్లే ఈ కారిడార్.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ నగరాల్లో కూడా నూతన ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. ‘‘ఇదొక రహదారి మాత్రమే కాదు.. ఈ ప్రాంతమంతటా వాణిజ్యంపరిశ్రమలుగిడ్డంగులువస్తురవాణా రంగాల్లో ఇది కొత్త దారులను తెరుస్తుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

కొత్త ఎక్స్‌ప్రెస్‌ రహదారి వల్ల పర్యాటక రంగంలో కలిగే అవకాశాలను ప్రధానమంత్రి వివరించారుదీనివల్ల డెహ్రాడూన్హరిద్వార్రిషికేశ్ముస్సోరీచార్‌ధామ్ ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరమవుతుందని ఆయన పేర్కొన్నారుశీతాకాల పర్యాటకంశీతాకాల క్రీడలుపర్యాటక ప్రాంతాల్లో వివాహాలకు ఉత్తరాఖండ్ ప్రధాన వేదికగా నిలుస్తోందని ఆయన అన్నారురాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఏడాది పొడవునా సాగడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ.. శీతాకాల యాత్రలకు అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన వెల్లడించారుకొన్ని వందలుగా ఉన్న ఆది కైలాష్ఓం పర్వత్ సందర్శకుల సంఖ్య.. 2025లో 36,000 దాటిందని తెలిపారుఅలాగే శీతాకాలంలో చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య 2024లో 80,000 ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య లక్షన్నర దాటిందని ఆయన వివరించారు. ‘‘పర్యాటకం వృద్ధి చెందితే హోటళ్లుధాబాలుటాక్సీలువసతిగృహాలు.. ఇలా స్థానిక ఆర్థిక వ్యవస్థ మొత్తానికీ ప్రయోజనం కలుగుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రకృతిసంస్కృతులతో అభివృద్ధిని సమతౌల్యం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఏనుగులుఇతర జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకమూ కలగకుండా.. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారిలో భాగంగా దాదాపు 12 కిలోమీటర్ల మేర ఎత్తైన వన్యప్రాణి కారిడార్‌ను నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారుఅలాగే ఈ దేవభూమిలోని కొండలూఅడవులను సందర్శించే పర్యాటకులుభక్తులు ఈ పవిత్ర క్షేత్రాలను శుభ్రంగా ఉంచుకోవాలనిప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయొద్దని ఆయన కోరారు. ‘‘మౌలిక సదుపాయాల ద్వారా ప్రజలకు సేవలందించడంతోపాటు.. ఈ ప్రాంతాల్లోని వన్యప్రాణులుసహజ వారసత్వాన్ని కూడా పరిరక్షించాలన్నదే మా సంకల్పం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరగబోతున్న కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని.. ఈ వేడుకను అత్యంత వైభవంగాదివ్యంగాస్వచ్ఛంగా నిర్వహించేలా చూడాలని సంబంధిత వర్గాలన్నింటికీ ప్రధానమంత్రి పిలుపునిచ్చారుఅలాగే భారత సాంస్కృతిక చేతనకు సజీవ సాక్ష్యంగా నిలిచే నందాదేవీ రాజ్‌జాత్ యాత్రనూ ఆయన ప్రస్తావించారుఈ యాత్రలో నందాదేవిని కుమార్తెగా భావించి గౌరవంగా వీడ్కోలు పలుకుతారనీముఖ్యంగా మహిళల భాగస్వామ్యం ఈ యాత్రను మరింత అర్థవంతంగా మారుస్తుందనీ ఆయన చెప్పారు. ‘‘రాజ్‌జాత్ యాత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదుఅది మన సజీవ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మహిళా సాధికారత అంశంపై మాట్లాడుతూ.. మహిళల రక్షణభద్రతరాజకీయ భాగస్వామ్యానికి ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారునాలుగు దశాబ్దాల నిరీక్షణ అనంతరం లోక్‌సభరాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. నారీ శక్తి వందన్ అధినియాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారుదీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేక చర్చకు ప్రణాళిక రూపొందించినట్టు ఆయన ప్రకటించారు2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చేలా చూడం కోసం.. ఈ రాజ్యాంగ సవరణకు మద్దతివ్వాలని దేవభూమి సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలనూ ఆయన అభ్యర్థించారు. ‘‘ఇది దేశంలోని అక్కాచెల్లెళ్లుఆడబిడ్డలందరి ఆకాంక్షమనమంతా ఏకగ్రీవంగా దీన్ని నెరవేర్చాలి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

చరిత్రాత్మక గర్హి కంటోన్మెంట్ వేదికగా.. గర్వించదగ్గ ఉత్తరాఖండ్ సైనిక సంప్రదాయాన్ని ప్రధానమంత్రి కొనియాడారు1962 యుద్ధంలో రైఫిల్‌మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ వంటి అమరవీరుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారుమాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంక్షేమ చర్యలను ఆయన వివరించారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కింద దాదాపు రూ1.25 లక్షల కోట్ల పంపిణీమాజీ సైనికుల ఆరోగ్య పథకం బడ్జెటులో 36 శాతం పెరుగుదల70 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే మందుల సరఫరాపిల్లల విద్యా గ్రాంట్ల రెట్టింపుకుమార్తెల వివాహ సహాయాన్ని రూ50,000 నుంచి రూలక్షకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు‘‘సాయుధ దళాలను బలోపేతం చేయడంమన సైనికుల కుటుంబాలను గౌరవించడం మా ప్రభుత్వానికి రాజీపడలేని ప్రాధాన్య అంశాలు’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

పురోగతిప్రకృతిసంస్కృతులను సమపాళ్లలో మేళవిస్తూ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారుఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీఉత్తర ప్రదేశ్ఉత్తరాఖండ్ ప్రజలకూభారతీయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశభక్తిఅంకితభావంఅన్ని రంగాల్లో అభివృద్ధిని మేళవించడం ద్వారానే నిజమైన అభివృద్ధి చెందిన భారత్‌ను మనం నిర్మించగలం’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2252059) సందర్శకుల సూచీ సంఖ్య : : 15