మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌ఈపీ-2020లో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వృత్తిపరంగా సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందించేందుకు కెరీర్ కార్డ్స్‌ను ప్రారంభించిన పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం కార్యదర్శి


వృత్తిపరమైన మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధికారత కల్పించటం, సమ్మిళిత, సమానత్వ, జ్ఞానాధారిత సమాజ నిర్మాణానికి కీలకం: శ్రీ సంజయ్ కుమార్

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 7:52PM by PIB Hyderabad

మార్చి 31, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్-2లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యఅక్షరాస్యతా విభాగ (డీఓఎస్ఈఎల్కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం కెరీర్ కార్డ్స్‌ను ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ వృత్తిపరమైన మార్గదర్శకత్వాన్ని సమానంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం కీలకమైనది. యూనిసెఫ్ ఇండియాఎన్‌సీఈఆర్‌టీసెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ), పండిట్ సుందర్ లాల్ శర్మ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (పీఎస్ఎస్ సీఐవీఈ), ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యుడీపరిధిలోని జాతీయ సంస్థల సాంకేతిక సహకారంక్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా ఈ కెరీర్ కార్డ్స్‌ను రూపొందించారు.

 

ఈ సందర్భంగా శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020, పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక వ్యవస్థ (ఎన్‌సీఎఫ్-ఎస్ఈ)-2023 సూత్రాలపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారుప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటుప్రతి ఒక్కరూ వైవిధ్యమైన విద్యా కోర్సులువృత్తిపరమైన మార్గాలను ఎంచుకునే అవకాశం కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారువికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో జ్ఞానాధారితసమానత్వసమ్మిళిత సమాజంగా భారత్ ఎదుగుతున్న తరుణంలో విద్యార్థులంతా తమ వంతు సహకారాన్ని అందించేలా శక్తిమంతులను చేయాలన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి దార్శనికతను ఆయన స్పష్టం చేశారు.

 

సీడబ్ల్యూఎస్ఎన్ ను ముందుగానే గుర్తించి, పరీక్షలు నిర్వహించటంవారి అవసరాలను చూడటం వంటివి పాఠశాల విద్యా వ్యవస్థలోనే ఉండాలన్న ఆవశ్యకతనువిద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారుప్రత్యేక ఉపాధ్యాయుల కోసం అదనపు పోస్టులను సృష్టించటమే కాకనియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారుసాధారణ ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారుఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీలుడీఐఈటీల సహకారంతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా ప్రణాళికను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించనుంది.

 

ఎన్ఈపీ-2020లో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని, 2030 నాటికి 12వ తరగతి పూర్తి చేసుకునే ప్రతీ విద్యార్థి కనీసం ఒక కీలక నైపుణ్యాన్ని నేర్చుకుని ఉండాలని స్పష్టం చేశారుసీడబ్ల్యూఎస్ఎన్ సహా అందరికీ నైపుణ్య శిక్షణను చేరువ చేయటంలో పీఎస్ఎస్ సీఐవీఈ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారుఇలాంటి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టటం అత్యంత ఆవశ్యకమని చెబుతూ.. 2047 నాటికి భారత్ సాధించబోయే పరివర్తనలో విద్యా వ్యవస్థే కీలకంగా ఉంటుందని తెలిపారుసమ్మిళిత విద్యనందించే విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవలందించే సంస్థలతో అనుబంధం కోసం ఎన్ఐఓఎస్ దీర్ఘకాలిక ఎంఓయూ కుదుర్చుకుందని ఆయన చెప్పారు.

 

ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి శ్రీమతి ప్రాచీ పాండే మాట్లాడుతూ.. యూనిసెఫ్ ఇండియాఎన్‌సీఈఆర్‌టీ భాగస్వామ్యంతో పాఠశాల విద్యఅక్షరాస్యతా విభాగం ఒక కెరీర్ గైడెన్స్ పుస్తకాన్ని రూపొందించినట్లు వెల్లడించారుజూలై 29, 2024న జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో విడుదల చేసిన ఈ పుస్తకంలో 500 కెరీర్ కార్డులున్నట్లు వివరించారుఇవాళ్టి ప్రారంభోత్సవంతో ఈ జాతీయ మార్గదర్శక వ్యవస్థను ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూపొందించినట్లు తెలిపారుఅందరికీ అర్థమయ్యేలా సుమారు 150 కార్డులను తయారు చేశామనిభారత విద్యా పరివర్తన ప్రయాణంలో సమ్మిళిత్వం విశేష లక్షణంగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

 

 

ఈ కార్యక్రమం సందర్భంగా ఆర్థిక సలహాదారు శ్రీమతి ఎశ్రీజ ధన్యవాదాలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన శ్రీ ధీరజ్ సాహు (అదనపు కార్యదర్శి), శ్రీ రాహుల్ సింగ్ (సీబీఎస్ఈఛైర్మన్), శ్రీ దినేశ్ ప్రసాద్ సక్లానీ (ఎన్‌సీఈఆర్‌టీడైరెక్టర్), శ్రీమతి ప్రాచీ పాండే (సంయుక్త కార్యదర్శి), శ్రీమతి అమర్ ప్రీత్ దుగ్గల్ (సంయుక్త కార్యదర్శి), శ్రీ వికాస్ గుప్తా (కేవీఎస్ కమిషనర్), శ్రీ రాజేశ్ లఖానీ (ఎన్ వీఎస్ కమిషనర్)లతో పాటు యూనిసెఫ్ నుంచి డాక్టర్ సాధనా పాండేప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి శ్రీమతి రుక్మిణీ బెనర్జీ పాల్గొన్నారు.

 

వివిధ వృత్తిపరమైన అవకాశాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించటం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవటంలో సహకరించేలా ఆలోచనాత్మకంగా ఈ కెరీర్ కార్డ్స్‌ను రూపొందించారుప్రతి కార్డులో వృత్తికి సంబంధించిన బాధ్యతలుఅర్హతలుఆ వృత్తిలో ఎదుగుదలకు ఉపయోగపడే మార్గాల గురించి సమాచారం ఉంటుందివిద్యార్థుల ఆసక్తిఆశయాలకు అనుగుణంగా పలు రంగాల గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

 

ఆకర్షణీయంగాసులభంగా అర్థమయ్యేలా ఉన్న ఈ కార్డులు.. విద్యావృత్తిపరంగా విద్యార్థులు సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించుకోవటంలో మార్గనిర్దేశం చేసేందుకు ఉపాధ్యాయులకుసలహాదారులకు ముఖ్యమైన వనరుగా ఉపయోగపడతాయి.

 

గతంలో యూనిసెఫ్ సహకారంతో విద్యార్థుల కోసం 500 కెరీర్ కార్డులతో కెరీర్ గైడ్ బుక్‌ను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిందిప్రస్తుతం ఈ సమాచారాన్ని సీడబ్ల్యూఎస్ఎన్ కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందిఇందులో భాగంగా కెరీర్ మార్గదర్శకత్వం అందరికీ అందుబాటులోసమ్మిళితత్వంతో ఉండేలా యూనిసెఫ్ సహకారంతో సీడబ్ల్యూఎస్ఎన్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 150 కెరీర్ కార్డులను రూపొందించిందిఈ కార్డులు ప్రస్తుతం బ్రెయిలీ లిపిలోనూ అందుబాటులో ఉన్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2250416) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi