ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మానసిక ప్రశాంతత, స్పష్టతకు ధ్యానమే మార్గం: న్యూఢిల్లీలో జరిగిన ధ్యాన గురువుల అంతర్జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్


అంతర్గత మార్పునకు ధ్యానమే నాంది: ఉపరాష్ట్రపతి

మెరుగైన ఆలోచనలతోనే మెరుగైన సమాజం: అంతర్జాతీయ ధ్యాన సమావేశంలో ఉపరాష్ట్రపతి

ధ్యానంతో యువత మాదక ద్రవ్య వ్యసనానికి దూరం: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 12:12PM by PIB Hyderabad

భారత్ మండపంలో సంపూర్ణ జీవనంశాంతియుత ప్రపంచం కోసం ధాన్యం అనే అంశంపై జరిగిన  ధ్యాన గురువుల అంతర్జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారుపిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్బుద్ధ-సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

నిర్వాహకులువక్తలుధ్యాన గురువులుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉపరాష్ట్రపతి అభినందించారుసమగ్ర జీవనంప్రపంచ శాంతికి మార్గంగా ధ్యానాన్ని ప్రోత్సహించడంలో వారు చూపిస్తున్న అంకితభావాన్ని ప్రసంశించారు.

తమిళ రుషి తిరుమూలర్ బోధనలను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారుఅజ్ఞానాన్ని పారదోలిసత్యంశాంతి దిశగా నడిపించేదిగాఅంతర్గత జ్ఞానజ్యోతిని వెలిగించేదిగా ధ్యానాన్ని వర్ణించారుమానవ శరీరాన్ని గుడిగాధ్యానాన్ని మనలోని దైవత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొనే సాధనంగా తిరుమూలర్ అభివర్ణించారని చెప్పారు.

నేటి ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనిసంఘర్షణపైకి కనిపించేది మాత్రమే కాదనీఅది వ్యక్తుల అంతరంగాల్లోనూ ఉంటుందన్నారుఈ నేపథ్యంలో శాంతినిస్పష్టతనుసానుకూల దృక్పథాన్ని తీసుకురావడంలోనూఇతరులు చెప్పేది వినడంవారిని అర్థం చేసుకోవడంలోనూ ధ్యానం పరివర్తనాత్మక పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు.

మానవుల్లో పరివర్తన తీసుకురావడంలోనే ధ్యానానికున్న పరివర్తనాత్మక శక్తి దాగి ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారుఒత్తిడిని తగ్గించడానికిఏకాగ్రతను మెరుగుపరచడానికిమానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికిఅతిగా ఆలోచించడంఅతిగా పనిచేయడం లాంటి సమస్యలను పరిష్కరించడానికి ధ్యానం తోడ్పడుతుందని వివరించారు.

అర్థవంతమైన జీవితాన్ని పణంగా పెట్టి భౌతికమైన విజయం కోసం పాకులాడవద్దని ఉపరాష్ట్రపతి సూచించారుసంపద మనకు సౌఖ్యాన్ని ఇచ్చినప్పటికీ.. మన జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేలా ఉండకూడదన్నారుధ్యానం ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుందనివ్యక్తులు సమతౌల్య జీవితాన్ని కొనసాగించేలా చేస్తుందని స్పష్టం చేశారుఆధ్యాత్మికతను అన్వేషించే వారి కోసమే ధ్యానం అనే వాదనను ఆయన ఖండించారుఇది అందరి కోసం ఉద్దేశించిందనీసామాన్యులను సైతం అత్యున్నత చైతన్యం వైపు నడిపించగలదని వివరించారు.

2047 నాటికి అభివృద్ధి  చెందిన భారత్‌ను సాధించాలనే లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. దీనికి ఆర్థికవృద్ధితో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా అవసరమని తెలిపారుదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అవసరమైన అంతర్గత ప్రశాంతతమానసిక సమతౌల్యంఆలోచనల్లో స్పష్టతను పెంపొందింపజేయడంలో ధ్యానం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

మాదక ద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు సాగిస్తున్న తన సుదీర్ఘ పోరాటం గురించి ఉపరాష్ట్రపతి వివరించారుమాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా 2004లో తాను చేపట్టిన పాదయాత్రను గుర్తు చేసుకున్నారుయువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారుఈ వ్యసనం నుంచి బయటపడేసే శక్తిమంతమైన సాధనంగా ధ్యానంగా ఉపకరిస్తుందన్నారుఒత్తిడిఆందోళనదిశ లేకపోవడం నుంచి బయటపడేందుకు తోడ్పడుతుందని తెలిపారు.

తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఉటంకిస్తూ..‘‘ఎలాంటి విశ్లేషణ చేయకుండానే పరిశీలించగలగడమే అత్యుతన్న స్థాయి మేధాశక్తి’’ అని ఉపరాష్ట్రపతి అన్నారుధ్యానం.. ఎలాంటి అభిప్రాయాలనూ వ్యక్తపరచకుండా ఆలోచనలను పరిశీలించుకొనేలా చేస్తుందనివ్యక్తిగత పరివర్తనను ముందుకు తీసుకెళుతుందని చెప్పారు.  ఇలాంటి మార్పు.. తెలివైన వ్యక్తులనుసామరస్యం నిండిన సమాజాలనుదయతో కూడిన నాయకత్వాన్నిమానవతా సంస్థలను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు.

మెరుగైనప్రశాంతమైన ఆలోచనలను పెంపొందించుకోవడం ద్వారానే మెరుగైన ప్రపంచం సాధ్యమవుతుందంటూ.. అంతర్గత పరివర్తన అవసరాన్ని ఉపరాష్ట్రపతి తెలియజేశారుఈ ప్రయాణానికి ఆరంభం ధ్యానమే అని చెప్పారు.

సీబీఐసీఆర్‌పీఎఫ్ మాజీ డైరెక్టర్ శ్రీ  డీఆర్ కార్తికేయన్రిషికేష్‌లోని పరమార్థ్ నికేతన్ ఆశ్రమం అధ్యక్షుడుఆధ్యాత్మిక గురువు స్వామి చిదానంద సరస్వతిక్వాంటమ్ లైఫ్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ డాక్టర్ న్యూటన్ కొండవేటిబుద్ధ-సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చంద్ర పులమరశెట్టిపిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్ఛైర్మన్ శ్రీ విజయ్ భాస్కర రెడ్డిఇతర ధ్యాన గురువులువిధాన రూపకర్తలుపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249205) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati