ప్రధాన మంత్రి కార్యాలయం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 9:05AM by PIB Hyderabad
మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.
సమానత్వం, సామాజిక న్యాయం అన్న ఆదర్శాలకు బాబూ జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. ఆయన అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎన్నటికీ మరువలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు వెనవేల వందనాలు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి.”
(రిలీజ్ ఐడి: 2249203)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada