రాష్ట్రపతి సచివాలయం
చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేతి చాంద్, నవ్రే, సజిబు చెయిరోబా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 4:27PM by PIB Hyderabad
చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేతి చాంద్, నవ్రే, సజిబు చెయిరోబా పండుగల సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రపతి సందేశంలో ఈ విధంగా పేర్కొన్నారు:
"చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేతి చాంద్, నవ్రే, సజిబు చెయిరోబా శుభ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నూతన సంవత్సర ఆగమన వేళ జరుపుకునే ఈ పండుగలు భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతాయి. ఇవి కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. ఈ పండుగలు మన ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి, ఇతరులతో సంతోషాన్ని పంచుకునే మన సంప్రదాయాలకు సజీవ రూపాలు.
ఈ పండుగలు ప్రేమ, సామరస్యాల ద్వారా భారతదేశంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించాలని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను."
***
(రిలీజ్ ఐడి: 2242226)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5