రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2026-27గానూ ఎన్హెచ్ఏఐ సవరించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ రుసుం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2026 12:20PM by PIB Hyderabad
ఆర్థిక సంవత్సరం 2026-27గానూ ఫాస్టాగ్ వార్షిక పాస్ రుసుం రూ.3,000 నుంచి రూ.3,075కు సవరించినట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి సవరించిన రుసుము అమల్లోకి రానున్నట్లు తెలిపింది. నేషనల్ హైవేస్ ఫీజు (రేట్లు నిర్ధారణ రేట్లు, వసూళ్లు) నిబంధనలు-2008కి అనుగుణంగా ఈ సవరణ చేపట్టినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికిపైగా ఫాస్టాగ్ వార్షిక పాస్ను వినియోగిస్తున్నారని, ప్రైవేటు వాహన యజమానులు దీన్ని ఎక్కువగా ఆదరిస్తున్నట్లు పేర్కొంది.
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ఉన్న సుమారు 1,150 టోల్ప్లాజాల వద్ద వార్షిక పాస్ సౌకర్యాన్ని పొందవచ్చు. చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ఉన్న వాణిజ్యేతర వాహనాలకు ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి. వార్షిక పాస్ ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్ను ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒకసారి రుసుము చెల్లించి ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్ప్లాజా నుంచి ప్రయాణించవచ్చు. చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది.
రాజమార్గ యాత్ర యాప్ లేదా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెబ్సైట్ ద్వారా రుసుము చెల్లించిన అనంతరం వాహన ఫాస్టాగ్లో రెండు గంటల్లోపు వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.
ఆగస్టు 15, 2025న ప్రారంభమైన ఫాస్టాగ్ వార్షిక పాస్కు లభిస్తున్న విశేష స్పందన ద్వారా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వినియోగదారులకు సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌలభ్యాన్ని ఇది అందిస్తుందని స్పష్టమవుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2240426)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2