ఆయుష్
azadi ka amrit mahotsav

సాంప్రదాయ వైద్య రంగంలో ఉమ్మడి పరిశోధనను బలోపేతం చేసే దిశగాకీలక ముందడుగు

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 12:30PM by PIB Hyderabad

వైద్య రంగంలో ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టు కోసం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)-సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఏఆర్ఐ) న్యూఢిల్లీజవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంఏ అండ్ యూ టిబ్బియా కాలేజ్,  హాస్పిటల్ మధ్య ఓ త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. మార్చి 62026న  న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కింద పేర్కొన్న శీర్షికతో ఈ ఒప్పందం కుదిరింది.

‘‘ఆరోగ్యవంతులైన పెద్దల్లో జీవక్రియవ్యాధి నిరోధక ప్రతిస్పందనలుమైక్రోబయోమ్ మార్కర్లపై వసంతకాలపు వాంతి చికిత్స (వాసంతిక వామన) ప్రభావం-ఒక అన్వేషణాత్మక యాదృచ్ఛిక నియంత్రిత అధ్యయనం’’. 

వాసంతిక వమనం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను పరిశీలించడానికిదాని వెనకున్న శాస్త్రీయ ఆధారాన్ని అన్వేషించడానికి ఈ ఉమ్మడి పరిశోధన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారా పూర్తి ఆరోగ్యవంతులైన వయోజనుల్లో జీవక్రియవ్యాధి నిరోధక ప్రతిస్పందనలుమైక్రోబయోమ్ మార్కర్లపై దీని ప్రభావాలను అంచనా వేస్తారు. కఠినమైన వైద్య పరిశోధన పద్ధతుల ద్వారా ఆయుర్వేద చికిత్సల్లో శాస్త్రీయమైన ఆధారపూర్వకమైన అవగాహనను రూపొందించాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ అధ్యయనం ప్రతిబింబిస్తుంది.

ఈ ఒప్పంద సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ కేదార్ సింగ్ (పరిశోధన, అభివృద్ధి డైరెక్టర్డీ)ప్రొఫెసర్ అరుణ్ ఖారత్ప్రొఫెసర్ అమల్ చంద్ర (స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్)సీసీఆర్‌ఏఎస్-సీఏఆర్ఐ నుంచి డాక్టర్ హేమంత పాణిగ్రాహి(ఇనిస్టిట్యూట్ ఇన్‌ఛార్జ్)డాక్టర్ బబితా యాదవ్డాక్టర్ షైజీ లయీక్,  డాక్టర్ రేణు రాణి హాజరయ్యారు.

ఈ భాగస్వామ్యం ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడంలో,  సంప్రదాయ చికిత్సా విధానాలకు శాస్త్రీయ ఆధారాలను బలపేతం చేయడానికి అర్థవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు. 

 

***

 

(రిలీజ్ ఐడి: 2238274) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati