ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర పృథ్వి.. దేశానికి శక్తి వనరు అని చాటిన సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 11:13AM by PIB Hyderabad
పవిత్రమైన ఈ భూమి తల్లి దేశానికి శక్తిని అందించే వనరుగా అలరారుతోందని స్పష్టం చేస్తున్న సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆ సుభాషితం ఇదీ..:
‘‘యార్ణవేధి సలిలమగ్ర ఆసీద్యాం మాయాభిరన్వచరన్మనీషిణ:
యస్యా హృదయం పరమే వ్యోమన్త్సత్యేనావృతమమృతం పృథివ్యా:
సా నో భూమిస్త్విషిం బలం రాష్ట్రే దధాతూత్తమే’’.
భూమి లోపల మహాసముద్ర జలాలతోనూ, వెలుపల నీటితోనూ చుట్టి ఉందని ఆలోచనాపరులైన పండితులు తమ జ్ఞానంతో గ్రహించారు. భూమాత హృదయం విశాల గగనపు శాశ్వత సత్యంతో ఆవరించుకొని ఉంది. అలాంటి పుడమి.. మనలో ఉరిమే ఉత్సాహం, బలం ఒక మహత్తర దేశంగా మనం నిలదొక్కుకునేటట్లు చూడుగాక అనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో :
‘‘యార్ణవేధి సలిలమగ్ర ఆసీద్యాం మాయాభిరన్వచరన్మనీషిణ:
యస్యా హృదయం పరమే వ్యోమన్త్సత్యేనావృతమమృతం పృథివ్యా:
సా నో భూమిస్త్విషిం బలం రాష్ట్రే దధాతూత్తమే’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2237371)
సందర్శకుల సూచీ సంఖ్య : : 62
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam