ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


యూఏఈపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి.. దాడుల్లో మృతి చెందిన వారిపట్ల సంతాపం వ్యక్తం చేసిన పీఎం

प्रविष्टि तिथि: 01 MAR 2026 11:30PM by PIB Hyderabad

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

యూఏఈపై దాడులను ప్రధానమంత్రి ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారుఈ క్లిష్ట పరిస్థితుల్లో యూఏఈకి భారత్ అండగా ఉంటుందని తెలిపారు.

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల పట్ల చూపుతున్న ఆదరణకు ఆ దేశ అధ్యక్షుడికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్రిక్తతలను తగ్గించటంప్రాంతీయ శాంతిభద్రతస్థిరత్వాన్ని నెలకొల్పేందుకు భారత్ మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"యూఏఈ అధ్యక్షుడునా సోదరుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడానుయూఏఈపై జరిగిన దాడులను ఖండించానుఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశానుఈ క్లిష్ట సమయంలో యూఏఈకి భారత్ అండగా ఉంటుంది.

యూఏఈలో నివసిస్తున్న భారత సమాజం పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ఆ దేశ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపానుఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గిశాంతిభద్రతలుస్థిరత్వం నెలకొనేందుకు మేం మద్దతిస్తాం".

 

***


(रिलीज़ आईडी: 2234666) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam