రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జైసల్మేర్‌లోని వైమానిక దళ స్థావరంలో తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్‌’ లో ప్రయాణించిన రాష్ట్రపతి


దేశీయంగా తయారయిన ప్రచండ్

దేశ రక్షణ సామర్థ్యాలను చూసి గర్విస్తున్నా...: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2026 12:39PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైసల్మేర్ వైమానిక దళ స్థావరంలో ఈ రోజు (2026 ఫిబ్రవరి 27)న తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్‌’లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారుఇదివరకు, 2023లో సుఖోయ్ 30 ఎంకేఐ, 2025లో రాఫెల్ యుద్ధ విమానాల్లో రాష్ట్రపతి ప్రయాణించారు.
ప్రచండ్ మిషన్‌లో భాగంగా రెండు హెలికాప్టర్లు కలిసి పాల్గొన్నాయిముందు భాగంలో ఉన్న హెలికాప్టరులో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గ్రూప్ కెప్టెన్ నయన్ శాంతిలాల్ బహువాతో ఉండగారెండో హెలికాప్టరులో వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పిసింగ్‌తో పాటు గ్రూప్ కెప్టెన్ ఎమహేంద్ర ప్రయాణించారుదాదాపు 25 నిమిషాల పాటు ప్రచండ్ మిషన్‌ కొనసాగిందిదీనిలో భాగంగా వారు గడీసర్ సరస్సుజైలస్మేర్ దుర్గం మీదుగా వెళ్లి ఒక ట్యాంకు లక్ష్యాన్ని ఛేదించారు.
ఆ తరువాత రాష్ట్రపతి తన భావాలను సందర్శకుల పుస్తకంలో రాశారు. ‘‘దేశీయంగా రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ప్రయాణించడం మరపురాని అనుభవందేశ రక్షణ సామర్థ్యాల పట్ల నా మది మరోసారి గర్వంతో నిండిపోయిందిఈ దాడిని విజయవంతంగా నిర్వహించినందుకు భారతీయ వైమానిక దళానికీజైసల్మేర్ వైమానిక దళ స్థావరానికి చెందిన బృందానికీ అభినందనలు ’’ అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
జైసల్మేర్‌‌లో…ఈ రోజు సాయంత్రం భారతీయ వైమానిక దళం నిర్వహించే వాయు శక్తి విన్యాసాలను రాష్ట్రపతి వీక్షిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233766) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam