పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో మంత్రిత్వశాఖ సందర్శన కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్


గ్రామీణ పరిపాలనను బలోపేతం చేసేందుకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో

ఏఐ సాధనాలను ప్రదర్శించిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 4:31PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సందర్శన కేంద్రాన్ని ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరిబీహార్ పరిశ్రమలురహదారుల నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ దిలీప్ కుమార్ జైస్వాల్ఐటీక్రీడల శాఖ మంత్రి కుమారి శ్రేయసి సింగ్పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ సభ్యుడుశ్రీ సంజయ్ కుమార్ ఝామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పాలనలో పారదర్శకతకచ్చితత్వంసమర్థతను పెంపొందించేందుకు మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వేదికలను మంత్రిత్వశాఖ ప్రదర్శిస్తోందిఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ఎక్స్‌పో 2026 ద్వారా సభాసార్ప్రమాణ్-గ్రామసాథి ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన "సర్పంచ్ కి చౌపాల్ఏఐ కా కమాల్పేరుతో జరిగిన నుక్కడ్ నాటక్.. క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్పారదర్శక ప్రక్రియల ద్వారా గ్రామసభల పనితీరును కృత్రిమ మేథ ఎలా మెరుగుపరుస్తుందో ఇది వివరించింది. "సర్వజన హితాయసర్వజన సుఖాయఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో గ్రామసభల కార్యక్రమాలను డిజిటల్ రూపంలో భద్రపరచటంఆస్తుల పర్యవేక్షణలో కచ్చితత్వాన్ని నిర్ధారించటంరియల్-టైమ్ గవర్నెన్స్ మద్దతును అందించటంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.

ఏఐ సహాయంతో గ్రామసభ సమావేశాలను రికార్డు చేయటంస్థానిక భాషల్లో లిఖితపూర్వక ప్రతిని సిద్ధం చేయటంసమావేశ నిర్ణయాలను క్రమబద్ధంగా రూపొందించటానికి సభాసార్ సహకరిస్తుందివివిధ పథకాల ద్వారా నిర్మించిన ఆస్తుల ఛాయాచిత్రాలను ఇమేజ్ అనలిటిక్స్ ద్వారా తనిఖీ చేసినాణ్యతను ధ్రువీకరించటానికి ప్రమాణ్ ఉపయోగపడుతుందిపంచాయతీ ప్రతినిధులకుపౌరులకు అవసరమైన సమాచారాన్ని ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ-గ్రామసాథి సహకరిస్తుందిడిజిటల్ ఆవిష్కరణల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతిక కార్యక్రమాలున్నాయిఇవి దేశవ్యాప్తంగా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయటమే కాకప్రతి వ్యక్తికి పారదర్శకమైన సేవలను అందించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సందర్శన కేంద్రాన్ని భారత మండపం (హాల్ 5, బూత్ 5ఎఫ్5, 5ఎఫ్9)లో 20 ఫిబ్రవరి 2026 వరకు సందర్శించవచ్చు. "బీ ద సర్పంచ్సంప్రదాయ నుక్కడ్ నాటక్ ద్వారా ఏఐ సాంకేతికతతో నిర్ణయాలను డాక్యుమెంట్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చుమంత్రిత్వ శాఖకు చెందిన ఏఐ వేదికల పనితీరుని నిపుణుల మార్గదర్శకత్వంలో ప్రత్యక్ష ప్రదర్శనల రూపంలో తెలుసుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2229316) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam