ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026'ను ప్రారంభించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 8:47PM by PIB Hyderabad
ఢిల్లీలోని భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.
ఆవిష్కర్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణుల మధ్య ఉండటం ద్వారా కృత్రిమ మేధ, భారతీయ ప్రతిభ, ఆవిష్కరణల అసాధారణ సామర్థ్యం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి అన్నారు. ఏఐ రంగంలో భారత్ సాధిస్తోన్న పురోగతి కేవలం దేశానికే పరిమితం కాకుండా ప్రపంచాభివృద్ధికి తోడ్పడే పరివర్తనాత్మక పరిష్కారాలను రూపొందిస్తుందని ఆయన చెప్పారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించాను.
ఆవిష్కర్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణుల మధ్య ఇక్కడ ఉండటం ద్వారా ఏఐ, భారతీయ ప్రతిభ, ఆవిష్కరణల అసాధారణ సామర్థ్యం స్పష్టమవుతోంది. మనమందరం కలిసి కేవలం భారతదేశం కోసమే కాకుండా ప్రపంచం కోసం పరిష్కారాలను రూపొందిద్దాం!”
***
(రిలీజ్ ఐడి: 2228939)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4