ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని భివాడీలో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 12:57PM by PIB Hyderabad
రాజస్థాన్లోని భివాడీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
-
‘‘రాజస్థాన్లోని భివాడీలో జరిగిన అగ్నిప్రమాదం విషాదకరం.. తీవ్ర దు:ఖ దాయకం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2228678)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13