ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 8:36PM by PIB Hyderabad

గౌరవ కేంద్ర ప్రభుత్వ మంత్రులారాపార్లమెంటు సభ్యులారాప్రభుత్వ ఉద్యోగులారావిశిష్ట అతిథులారా నా ప్రియమైన సహచరులారా!

నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులంవిక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షంవిజయ ఏకాదశిశక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోందిమన శాస్త్రాల ప్రకారంవిజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందిఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుందిఅభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థకర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాంమన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయిసేవా తీర్థనూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీపీఎంఓ బృందానికికేబినెట్ సెక్రటేరియట్‌కువివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నానువీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకుకార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

స్వాతంత్ర్యానంతరం ఎన్నో కీలక నిర్ణయాలువిధానాలు ఉత్తరదక్షిణ బ్లాక్ భవనాల్లో రూపుదిద్దుకున్నాయిఈ కట్టడాలు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి చిహ్నాలుగా ఉన్నాయన్నది నిజంభారతదేశాన్ని శతాబ్దాల పాటు బానిసత్వంలో బంధించాలన్నదే ఈ భవనాల ఉద్దేశం.

మిత్రులారా,

ఒకప్పుడు భారతదేశానికి రాజధానిగా కోల్‌కతా ఉండేదని మనందరికీ తెలుసు. 1905 నాటి బెంగాల్ విభజన సమయంలో బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమాలకు కంచుకోటగా కోల్‌కతా మారిందిదీనివల్ల 1911లో బ్రిటీష్ వారు రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారుఆ తర్వాత వలస పాలన అవసరాలకువారి ఆలోచనా దృక్పథానికి అనుగుణంగా ఉత్తరదక్షిణ బ్లాక్ భవనాలు నిర్మించారురైసినా హిల్స్‌పై ఈ భవనాలను ప్రారంభించినప్పుడుఅప్పటి వైస్రాయ్ బ్రిటీష్ చక్రవర్తి ఆకాంక్షలకు ఇవి ప్రతిరూపాలని ప్రకటించారుబానిసత్వంలో ఉన్న భారతదేశంపై రాజు ముద్రను వేయటానికి ఇవి సాధనాలుగా పనిచేశాయిఈ భవనాలు మిగతా అన్నింటికన్నా ఎత్తులో ఉండాలనే ఉద్దేశంతోనే రైసినా హిల్స్‌ను ఎంచుకున్నారుసేవా తీర్థ ఏ కొండ పైనో లేదుసామాన్యులకు అందుబాటులోనేలతో అనుసంధానమై ఉందిదక్షిణ బ్లాక్ఉత్తర బ్లాక్ వలసవాద ఆలోచనలకు ప్రతీకలుగా నిలిస్తే... సేవా తీర్థకర్తవ్య భవన్ భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలని నేడు నేను గర్వంగా చెబుతున్నాఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఏ రాజు సంకల్పాన్నో కాదు.. 140 కోట్ల భారతీయుల ఆశలను ప్రతిబింబిస్తాయిఇదే స్ఫూర్తితోనేను సేవా తీర్థకర్తవ్య భవన్‌ను భారత ప్రజలకు అంకితమిస్తున్నా.

మిత్రులారా,

21వ శతాబ్దంలో పావు భాగం ముగిసిందికేవలం విధానాలుపథకాల్లోనే కాకకార్యాలయాలుసంస్థల్లోనూ అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత ప్రతిబింబించాలిదేశ పరిపాలన సాగే ప్రదేశాలు ప్రభావవంతంగాస్ఫూర్తిదాయకంగాప్రతిష్ఠాత్మకంగా ఉండాలికొత్త సాంకేతికతలు మన పరిసరాలని వేగవంతం చేయాలిపాత భవనాలు ఈ మార్పులకు అనుగుణంగా లేవుఉత్తర బ్లాక్దక్షిణ బ్లాక్ భవనాలు దాదాపు శతాబ్దం నాటివి కావడం వల్ల స్థల సమస్యలుపరిమిత వసతులతో శిథిలావస‌్థకు చేరుతున్నాయిస్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినామంత్రిత్వ శాఖలు ఢిల్లీలోని 50కి పైగా వేర్వేరు ప్రాంతాల నుంచి కార్యకలాపాలను సాగించటం వల్ల ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయిఈ భవనాల అద్దె కోసమే ఏటా రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు అవుతోందిసుమారు 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు రోజూ ఈ కార్యాలయాలకు తిరగడం వల్ల అదనపు ఖర్చులతో పాటు సమయం కూడా వృథా అవుతోందిఇప్పుడు సేవా తీర్థకర్తవ్య భవన్ నిర్మాణంతో ఈ ఖర్చులు తగ్గటంతో పాటు సమయం ఆదా అయిపని ఉత్పాదకత పెరుగుతుంది.

మిత్రులారా,

ఈ విప్లవాత్మక మార్పులో పాత భవనాల జ్ఞాపకాలు మనతోనే ఉంటాయిఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనేఆ ప్రాంగణాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారుఆ భవనాలు దేశానికి దిశానిర్దేశం చేయడమే కాకఅనేక సంస్కరణలకు సాక్ష్యంగా నిలిచాయిఅవి భారత చరిత్రలో చిరస్మరణీయ భాగంఅటువంటి భవనాలను మ్యూజియాలుగా మార్చి దేశానికి అంకితం చేయాలని మేం నిర్ణయించాంఅవి 'యుగే యుగీన్ భారత్మ్యూజియంలో భాగంగా మారిరాబోయే తరాలకు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయియువత వాటిని సందర్శించినప్పుడుచారిత్రక వారసత్వం వారికి సరైన మార్గదర్శకత్వం వహిస్తుంది.

మిత్రులారా,

అభివృద్ధి చెందుతున్న భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో బానిసత్వ మసస్తత్వాన్ని మనం వీడాలిస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు వలస పాలన నాటి జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయిగతంలో ప్రధానమంత్రి నివాసాన్ని రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవారుఉపరాష్ట్రపతికి ప్రత్యేక అధికార నివాసం ఉండేది కాదుప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే దారిని రాజ్‌పథ్‌ అని పిలిచేవారుస్వాతంత్యానంతరం సైనికుల కోసం కానీవిధి నిర్వహణలో అమరులైన పోలీసుల కోసం కానీ ఎలాంటి స్మారక చిహ్నాలు నిర్మించలేదుస్వతంత్ర భారత రాజధానిలోని భవనాలుబహిరంగ ప్రదేశాలు వలసపాలన నాటి బానిసత్వ చిహ్నాలతో నిండిపోయిఆ మనస్తత్వంలోనే ఉండిపోయాయి.

కానీ మిత్రులారా,

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదువలసవాద మనస్తత్వం ఇకపై కొనసాగకూడదని 2014లో దేశం నిర్ణయించుకుందిఆ ఆలోచనా విధానాన్ని మార్చేందుకు మేం ఒక ప్రచారాన్ని ప్రారంభించాంఅమరవీరుల గౌరవార్థం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించాంపోలీసుల శౌర్యాన్ని స్మరించుకోవటానికి పోలీసు స్మారకాన్ని నిర్మించాంరేస్ కోర్స్ రోడ్‌ను లోక్ కళ్యాణ్‌ మార్గ్‌గా మార్చాంఇది కేవలం పేరు మార్పు కాదు.. పాలనలోని స్ఫూర్తిని సేవగా మార్చటానికి చేసిన పవిత్రమైన ప్రయత్నం.

మిత్రులారా,

ఈ నిర్ణయాల వెనుక లోతైన భావంగొప్ప దార్శనికత ఉన్నాయిఇది మన వర్తమానాన్నిగతాన్నిభవిష్యత్తును భారత అస్తిత్వంతో అనుసంధానిస్తుందిరాజ్‌పథ్ ప్రాంతంలో పౌరులకు తగిన సౌకర్యాలుఏర్పాట్లు ఉండేవి కావుమేం దాన్ని కర్తవ్య పథ్‌గా పునర్నిర్మించాందేశవ్యాప్తంగా కుటుంబాలుపిల్లలుసందర్శకులతో కళకళలాడే ఒక ప్రజా ప్రదేశంగా ఇది మారిందిఇదే సముదాయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని మేం ప్రతిష్టించాంచాలా కాలంగా మన రాజధానిలో వీరులకు ఇటువంటి నివాళులు కరువయ్యాయిమన రాజధాని నడిబొడ్డు నుంచి భవిష్యత్ తరం స్ఫూర్తిని పొందాలని మేం సంకల్పించాంరాష్ట్రపతి భవన్ సముదాయంలోనూ మార్పులు జరిగాయిమొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చాంకొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించినప్పుడు మేం పాత దాన్ని మరచిపోకుండాదానికి సంవిధాన్ సదన్ అని కొత్త గుర్తింపును ఇచ్చాంమంత్రిత్వ శాఖలన్నీ ఒకే సముదాయంలోకి తీసుకువచ్చిఆ భవనాలకు కర్తవ్య భవన్ అని పేరు పెట్టాంపేర్లు మార్చే ఈ కార్యక్రమాలు కేవలం మాటల ఆట కాదుఅవి ఒక స్థిరమైన సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయివలసవాద గుర్తుల నుంచి విముక్తి పొందిస్వతంత్ర భారతం కోసం ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని చాటుకోవటం.

మిత్రులారా,

కొత్త ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ అని పేరు పెట్టాంసేవా భావమే భారతదేశపు ఆత్మఅదే మన దేశపు అసలైన గుర్తింపుశ్రీ రామకృష్ణ పరమహంస తరచుగా ఇలా అనేవారు: "శివ జ్ఞానే జీవ సేవఅంటే మానవ సేవయే మాధవ సేవఇది కేవలం ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు.. ఒక దేశ నిర్మాణ తత్వశాస్త్రంపాలన అంటే సేవ అనిబాధ్యత అంటే అంకితభావమని ఈ భవనం మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తుందిసేవా పరమో ధర్మః అంటే సేవయే అత్యున్నతమైన ధర్మం అని మన శాస్త్రాలు చాటిచెప్పాయిఇదే ప్రధానమంత్రి కార్యాలయానికిప్రభుత్వానికున్న దార్శనికతసేవా తీర్థ కేవలం ఒక పేరు మాత్రమే కాదుఅదొక సంకల్పంసేవా తీర్థ అంటే పౌరులకు చేసే సేవతో పునీతమైన ప్రదేశంసేవ అనే సంకల్పం నెరవేరే చోటు అని అర్థంతీర్థ అంటే "లక్ష్యాన్ని చేరుకోవటానికిదాటటానికి సహాయపడేదిఅని అర్థంఅభివృద్ధి చెందిన దేశంగా మారాలనేస్వావలంబన సాధించాలనే లక్ష్యం భారత్ ముందున్నదిమనం కోట్లాది మందిని పేదరికం నుంచిబానిసత్వ మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేయాలిఇది సేవ అనే శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

మిత్రులారా,

నేడు భారత్ సంస్కరణల వేగంతో దూసుకుపోతోందిఅంతర్జాతీయ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందినూతన వాణిజ్య ఒప్పందాలు అవకాశాలను కల్పిస్తున్నాయిప్రతి పథకం ప్రజలకు వంద శాతం చేరాలనే లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తోందిఈ నేపథ్యంలో మీ పని వేగంమీలోని నూతన ఆత్మవిశ్వాసం దేశ లక్ష్యాలను సాధించటంలో సేవా తీర్థకర్తవ్య భవన్ కీలక పాత్ర పోషిస్తాయి.

మిత్రులారా,

ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు ఆశీస్సులు తీసుకోవటంలోకకళ్యాణాన్ని కోరుకోవటంఒక మంచి సంకల్పాన్ని స్వీకరించటం మన సంస్కృతి నేర్పిన పాఠం. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతఃఅంటే అన్ని దిశల నుంచి మనకు ఉదాత్తమైన ఆలోచనలు రావాలని వేద మంత్రం దిశానిర్దేశం చేస్తోందిఈ భవనానికి ఇదే ప్రాణవాయువు కావాలిభారతదేశపు గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనలే శక్తివారి కలలే పెట్టుబడివారి ఆకాంక్షలే ప్రాధాన్యతవారి ఆశయాలే మార్గదర్శకాలుఈ భావాలకుఈ వ్యవస్థకు మధ్య ఎటువంటి అడ్డుగోడలు కానీదూరం కానీ ఉండకూడదుప్రజల కలలను అర్థం చేసుకున్నప్పుడే విధానాలు సఫలమవుతాయిప్రజల ఆశయాలను అనుభూతి చెందినప్పుడే నిర్ణయాలు ప్రభావవంతంగా మారతాయిగత 11 ఏళ్లలో మనం చూసిన నూతన పరిపాలనా నమూనాలో ప్రతి నిర్ణయానికి పౌరుడే కీలకం. "నాగరిక్ దేవో భవకేవలం ఒక నినాదం మాత్రమే కాదు.. మా పని సంస్కృతిమీరు ఈ కొత్త భవనాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇదే స్ఫూర్తితో ఉండాలిఈ సేవా తీర్థలో తీసుకునే ప్రతి నిర్ణయంఇక్కడ కదిలే ప్రతి ఫైలుగడిపే ప్రతి క్షణం 140 కోట్ల భారతీయుల జీవితాలను మెరుగుపరచటానికే అంకితం కావాలినేను ప్రతి అధికారినిప్రతి ఉద్యోగినిప్రతి కర్మయోగిని కోరుతున్నానుమీరు ఈ భవనంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఒక్క క్షణం ఆలోచించండిఈరోజు నేను చేసే పని లక్షలాది మంది పౌరుల జీవితాలను సులభతరం చేస్తుందాఅని ప్రశ్నించుకోండిఈ ఆత్మపరిశీలనే ఈ ప్రదేశానికి గొప్ప బలమవుతుంది.

మిత్రులారా,

మనం ఇక్కడ అధికారాన్ని ప్రదర్శించటానికి కాదు.. బాధ్యతను నెరవేర్చటానికి ఉన్నాంసేవా భావంతో పాలన సాగినప్పుడు అసాధారణ ఫలితాలుంటాయని మనం చూశాంఈ విధంగానే 250 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారుఆర్థిక వ్యవస్థ నూతన వేగాన్ని పుంజుకుంది.

మిత్రులారా,

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. ప్రపంచం ముందు భారత్ చేసిన ప్రతిజ్ఞకాబట్టిఇక్కడ రూపొందించే ప్రతి విధానంతీసుకునే ప్రతి నిర్ణయం నిరంతర సేవా భావన స్ఫూర్తినివ్వాలిపదవీ విరమణ చేసినాఈ భవనం నుంచి వేరే బాధ్యతల్లోకి వెళ్లినా గడిచిన ఈ రోజులను మీరు ఎంతో గర్వంగా స్మరించుకుంటారుఅవునునేను సేవా తీర్థకర్తవ్య భవన్‌లో ఉన్నప్పుడు రోజూ పౌరుల సేవకే అంకితమయ్యానుతీసుకున్న ప్రతి నిర్ణయం దేశ హితం కోసమే అని సగర్వంగా చెప్పుకోగలరుఆ క్షణం మీకు ఎనలేని ప్రశాంతతనిస్తుందిఅదే మీ గొప్ప విజయంగా మారుతుందిఅది మీ వ్యక్తిగత నిధిగా మిగిలిపోతుందిఆ నిధే మీ జీవితాన్ని గౌరవంతో నింపుతుంది.

మిత్రులారా,

బాధ్యత పునాదిపైన హక్కులనే మహోన్నత సౌధం నిర్మితమవుతుందని మహాత్మాగాంధీ నమ్మేవారుమన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడుఎంతటి సవాలునైనా ఎదుర్కోగలంపరిష్కారాలను కనుక్కోగలంవిధులకు మన రాజ్యాంగ నిర్మాతలు అంతటి ప్రాముఖ్యతనివ్వటానికి ఇదే కారణంకోట్లాది మంది ప్రజల కలలు సాకారమవటం మన కర్తవ్య నిర్వహణపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలికర్తవ్యమే ఆరంభంచైతన్యవంతమైన ఈ దేశానికి కర్తవ్యమే ప్రాణాధారంకర్తవ్యం అంటే కరుణకష్టపడే తత్వాల కలయికకర్తవ్యం అంటే సంకల్పాల ఆశకఠోర శ్రమకు శిఖరం వంటిదిప్రతి సమస్యకు పరిష్కారంఅభివృద్ధి చెందిన భారత్ పట్ల మనకున్న విశ్వాసంకర్తవ్యం అంటే సమానత్వంకర్తవ్యం అంటే అనురాగంకర్తవ్యం విశ్వవ్యాప్తం.. కర్తవ్యం సర్వవ్యాపకంసబ్ కా సాథ్సబ్ కా వికాస్‌తో పెనవేసుకున్న సూత్రమే కర్తవ్యందేశం పట్ల అంకితభావానికి ప్రతీక కర్తవ్యంప్రతి జీవితంలో వెలుగులు నింపే సంకల్ప బలమే కర్తవ్యంస్వావలంబన భారత్ ఇచ్చే అసలైన ఆనందమే కర్తవ్యంరాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు కర్తవ్యమే అసలైన గ్యారెంటీభారతమాత ప్రాణశక్తికి ధ్వజవాహిక ఈ కర్తవ్యందేశభక్తితో చేసే ప్రతి పనీ ఒక కర్తవ్యమేనాగరిక్ దేవో భవ అనే భావనను ఆచరించే జాగృత మార్గమే కర్తవ్యం.

మిత్రులారా,

కర్తవ్యాన్ని పరమావధిగా భావిస్తూపూర్తి బాధ్యతాయుతమైన దృక్పథంతో సేవా తీర్థలోనూతనంగా నిర్మించిన భవన సముదాయాల్లోనూ అడుగు పెట్టాలి.

మిత్రులారా,

నేడు భారతదేశం సరికొత్త శిఖరాల వైపునవశకం దిశగా శరవేగంతో దూసుకుపోతోందిరాబోయే కాలంలో కేవలం ఆర్థిక వ్యవస్థ ద్వారానే కాదు.. మన పరిపాలనా దక్షతవిధానపరమైన స్పష్టతకర్మయోగుల అంకితభావం ద్వారా మనకి గుర్తింపు లభిస్తుందిసేవా తీర్థకర్తవ్య భవన్‌లో తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ఒక ఫైలు పరిష్కారం మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన భారత్-2047 దిశను నిర్దేశిస్తుందిగుర్తుంచుకోండి. 2047 ఒక తేదీ మాత్రమే కాదు.. 140 కోట్ల మంది భారతీయుల కలలకు గడువుఈ ప్రయాణంలో ప్రతి సంస్థాప్రతి అధికారీ ముఖ్యమే.. ప్రతి ఉద్యోగిప్రతి కర్మయోగి అత్యంత కీలకమైనవారేసేవా తీర్థ సునిశిత పాలనకు చిహ్నంగాపౌర-కేంద్రీకృత పరిపాలనకు నమూనాగా నిలవాలని నేను కోరుకుంటున్నానుఅధికారం కాదు.. సేవ కనిపించేలాహోదా కాదు.. అంకితభావం ఉట్టిపడేలాఆధిపత్యం కాదు.. బాధ్యత ప్రధానంగా ఉండేలా ఆ ప్రదేశం ఉండాలిమన దృఢ సంకల్పం చరిత్రను తిరగరాస్తుందనిమన కష్టం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నానుఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా "ఇదే సమయంసరైన సమయంప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాందేశమే ప్రథమమనే స్ఫూర్తితో ముందుకు సాగుదాంభారతదేశ విధిని పునర్నిర్మించుకున్న కాలం ఇదేసరికొత్త శక్తితోవేగంతో వేల ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు వైపు భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేసిన సమయం ఇదేనని భవిష్యత్ తరాలు చెప్పుకోవాలిఈ విశ్వాసంతో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాధన్యవాదాలు.

 

వందేమాతరం!


(రిలీజ్ ఐడి: 2228221) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati