రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్: భారతీయ ఉత్పాదనల కొనుగోలు కేటగిరీలో… 8 డార్నియర్-228 విమానాల కోసం హెచ్ఏఎల్తో రక్షణ శాఖ ఒప్పందం కాంట్రాక్టు విలువ... రూ.2,312 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 4:15PM by PIB Hyderabad
డార్నియర్ 228 రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేయడానికి కాన్పూర్ లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్తో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘బై (ఇండియన్) కేటగిరీ’ ఒప్పందంలో భాగంగా దీంతో పాటు, భారతీయ కోస్తాతీర రక్షక దళం (ఐసీజీ) కోసం ఆపరేషనల్ రోల్ ఎక్విప్మెంట్ను కూడా రూ.2,312 కోట్లు ఖర్చుతో ఎంఓడీ సమకూర్చుకోనుంది. రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఒప్పంద పత్రంపై ఈ రోజు సంతకాలయ్యాయి.
దీంతో హెచ్ఏఎల్ ఉత్పత్తి అనుబంధ విస్తారిత వ్యవస్థ దృఢతరమై, చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయనీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకూ, అనుబంధ పరిశ్రమలకూ పెద్ద ఎత్తున ఊతం లభిస్తుందనీ భావిస్తున్నారు. ఈ ఒప్పందం నిర్వహణ, మరమ్మతులు, పూర్తి స్థాయి తనిఖీ (ఎంఆర్ఓ)కీ, జీవిత కాలం పాటు సాంకేతిక సేవల దిశగా అనేక అవకాశాలను కూడా అందిస్తుంది.
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్లో తయారీ) కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ ఒప్పందం పటిష్ఠపరచడంతో పాటు, భారత నౌకా వాణిజ్య భద్రతా వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2227121)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8