ప్రధాన మంత్రి కార్యాలయం
కెనడాలో తుపాకి కాల్పుల ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 3:43PM by PIB Hyderabad
కెనడాలో తుపాకి కాల్పుల ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ‘‘ఈ విషాద ఘడియలో భారత్ .. కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘కెనడాలో భయానక తుపాకి కాల్పుల ఘటన సంగతి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. భారత్ ఈ విషాద ఘడియలో కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2226488)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam