వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 16.10 లక్షల కోట్ల విలువైన 352 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అంచనా వేసిన పీఎం గతిశక్తి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్


పీఎం గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు

50 సంవత్సరాల వడ్డీ లేని రుణంగా రూ. 5,000 కోట్ల అందజేత

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 3:34PM by PIB Hyderabad

దేశంలో మౌలిక సదుపాయాల ప్రణాళికఅభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఉద్దేశంతో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (పీఎంజీఎస్ ఎన్ఎంపీఅక్టోబర్ 2021లో ప్రారంభించారుపీఎం గతిశక్తి వ్యవస్థ కింద ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పీజీ).. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలిస్తుందిసమీకృత ప్రణాళికమల్టీమోడాలిటీఇంటర్-మోడాలిటీవివిధ శాఖల ప్రయత్నాల సమన్వయంచివరి మైలు కనెక్టివిటీప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిడేటా ఆధారిత నిర్ణయాలు వంటి అంశాలను చేపట్టడం ఈ గ్రూప్ ప్రధాన బాధ్యతఇప్పటి వరకు సుమారు రూ. 16.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 352 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎన్ పీజీ యంత్రాంగం పరిశీలించిందిఈ 352 ప్రాజెక్టులలో 201 మాత్రమే మంజూరయ్యాయివీటిలో ప్రస్తుతం 167 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.

 ‘‘2022-23 సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం’’ లోని రెండో భాగం (పీఎం గతిశక్తికి సంబంధించిన ఖర్చుల కోసంకింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం రూ.5,000 కోట్లను కేటాయించిందిఈ నిధులను రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో పంపిణీ చేస్తున్నారుఈ పథకం కింద ఆమోదించిన రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలుకేటాయించిన నిధుల వివరాలు కూడా అందించారు.

పీఎం గతిశక్తి విధానం ద్వారా రూ.150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో ప్రణాళికతో రూపొందించినపరిశీలించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సహా కేంద్ర రంగ ప్రాజెక్టుల పర్యవేక్షనను ‘గణాంకాలుకార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ’ నిర్వహిస్తుందిప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులుఅంచనా వ్యయం పెరగడం వంటి పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నివేదిక జూలై 2025 నుంచి పీఏఐఎంఏఎన్ఏ (ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్పోర్టల్‌ https://ipm.mospi.gov.in/ReportPage లో ప్రచురితమవుతుంది.

ప్రాజెక్టుల పురోగతిని దశల వారీగా పర్యవేక్షించడంసమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడంభారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల (రూ. 500 కోట్లుఅంతకంటే ఎక్కువ వ్యయం కలిగినవిఅమలును వేగవంతం చేసే లక్ష్యంతో ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీఅనే సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేశారుసమస్యల పరిష్కారంనిర్ణయాల వేగం పెంచేందుకు పీఎంసీ ప్రత్యేకమైన అయిదు అంచెల ఉన్నత స్థాయి విధానాన్ని అమలు చేసిందిదీని ద్వారా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖ స్థాయిలో పరిష్కరించడం నుంచి  మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన సమస్యల పరిష్కారం కోసం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్ఫోరం వరకు విస్తరించిందిఈ విధానం సమీక్షా వ్యవస్థను సులభతరం చేయడమే కాకుండాచేసిన పనిని మళ్లీ చేయడాన్ని కూడా నివారిస్తుందికీలకమైన సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించేలా చేస్తుందిఅడ్డంకులను తొలగించిప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా చూడటానికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను పీఎంజీతో అనుసంధానించారుఇది ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారాన్నినియంత్రణ అడ్డంకులను తొలగించడాన్ని వేగవంతం చేసింది.

ఈ సమచారాన్ని నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద లిఖిత పూర్వక సమాధానంగా అందించారు.

ప్రధానమంత్రి గతిశక్తి కింద ఎన్ పీజీ  వ్యవస్థ ద్వారా అంచనా వేసిన ప్రాజెక్టుల మంత్రిత్వ శాఖల వారీగా వివరాలు

 

                                                                                                                                                                                                                                                 అనుబంధం-

Ministry/Department

Number

of Projects evaluated by NPG

Sanctioned

Yet to be

Sanctioned

Under

Implementation

Total

Estimated Cost

(Rs. in Crore)

Ministry of Road Transport and Highways

164

87

77

55

8,61,821

Ministry of Railways

137

83

54

83

4,22,324.84

Ministry  of  Housing and Urban Affairs

23

7

16

7

2,01,264

Ministry of Petroleum and Natural Gas

4

4

0

3

9,271

Ministry of Ports, Shipping and Waterways

3

2

1

1

49,758.86

Ministry of Civil Aviation

5

3

2

3

7,871

NICDC, Department

for Promotion of Industry and Internal Trade

12

12

0

12

28,693

Ministry of New and

Renewable Energy

01

1

0

1

20,773.70

Ministry of Electronics and Information Technology

01

0

1

0

4,680

Ministry of Textiles

02

02

0

2

3,957

Grand Total

352

201

151

167

16,10,414

 

అనుబంధం-బీ

2022-23 సంవత్సరానికి మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం పార్ట్-II కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు.

Sr.

No.

States

No. of Projects approved by the

Department of Expenditure (DoE)

Approved Capital Expenditure

(Rs. in Crores)

1

West Bengal

30

376

2

Chhattisgarh

27

168.42

3

Bihar

21

502.92

4

Uttar

Pradesh

15

896.91

5

Madhya

Pradesh

11

393

6

Maharashtra

8

316

7

Tamil Nadu

8

204

8

Rajasthan

7

301

9

Assam

6

156

10

Nagaland

5

28.43

11

Kerala

4

96

12

Tripura

4

35

13

Gujarat

3

174

14

Haryana

3

55

15

Jharkhand

3

165

16

Manipur

3

36

17

Himachal

Pradesh

3

42

18

Arunachal

Pradesh

3

87.85

19

Andhra

Pradesh

2

202

20

Karnataka

2

182

21

Meghalaya

2

38

22

Mizoram

2

25

23

Uttarakhand

2

56

24

Goa

1

19

25

Punjab

1

90

26

Sikkim

1

19

27

Telangana

1

100

28

Odisha

0

0

 

Total

178

4764.53

మూలం: 2022-23 సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం పార్ట్-II కింద ప్రాజెక్టుల ఆమోదం కోసం వ్యయ విభాగం జారీ చేసిన కార్యాలయ మెమోరాండం.

 

 

***


(రిలీజ్ ఐడి: 2225962) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi