ప్రధాన మంత్రి కార్యాలయం
స్వావలంబన శక్తిని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 12:56PM by PIB Hyderabad
స్వావలంబన శక్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు:
‘‘నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే
ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’
సముద్రం నీటి కోసం ఎన్నడూ ఎవరినీ అడగకపోయినా, అయినా అదెప్పుడూ నిండుగానే ఉన్నట్టుగా... ఓ వ్యక్తి సమర్థుడైతే, సహజంగానే సంపద వారి వద్దకు వస్తుందని ఈ సుభాషితం చెబుతోంది.
స్వావలంబన అన్నది ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారిదీపమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్ కూడా మన యువత స్వావలంబనలో, వారిని సాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారి చూపే దీపం స్వావలంబన. ఈ సారి బడ్జెట్ కూడా మన యువ మిత్రుల స్వావలంబనలో, వారిని సాధికారులను చేయడంలో ముఖ్య పాత్ర పోషించబోతోంది.
నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే
ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’
(రిలీజ్ ఐడి: 2222101)
సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam