ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వావలంబన శక్తిని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2026 12:56PM by PIB Hyderabad

స్వావలంబన శక్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు:

‘‘నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే

ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’

సముద్రం నీటి కోసం ఎన్నడూ ఎవరినీ అడగకపోయినా, అయినా అదెప్పుడూ నిండుగానే ఉన్నట్టుగా... ఓ వ్యక్తి సమర్థుడైతే, సహజంగానే సంపద వారి వద్దకు వస్తుందని ఈ సుభాషితం చెబుతోంది.

స్వావలంబన అన్నది ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారిదీపమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్ కూడా మన యువత స్వావలంబనలో, వారిని సాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారి చూపే దీపం స్వావలంబన.  ఈ సారి బడ్జెట్ కూడా మన యువ మిత్రుల స్వావలంబనలో, వారిని సాధికారులను చేయడంలో ముఖ్య పాత్ర పోషించబోతోంది.

 

నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే

ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’ 


(రిలీజ్ ఐడి: 2222101) సందర్శకుల సూచీ సంఖ్య : : 60