ప్రధాన మంత్రి కార్యాలయం
పట్నా పక్షుల అభయారణ్యం, ఛారీ-ధండ్లను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని స్వాగతించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
31 JAN 2026 10:52AM by PIB Hyderabad
ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. స్థానికులకు, చిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడం ఆనందదాయకం. అక్కడి స్థానికులకు, చిత్తడి నేలల పరిరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శుభాకాంక్షలు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో మా చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోంది. ఈ చిత్తడి నేలలు అనేక వలస, స్థానిక జీవ జాతులకు సురక్షితమైన ఆవాసాలుగా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాను.’’
***
(రిలీజ్ ఐడి: 2221302)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam