విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజల నుంచి సలహాల స్వీకరణకు జాతీయ విద్యుత్ విధానం (ఎన్ఈపీ) ముసాయిదా - 2026 విడుదల

प्रविष्टि तिथि: 21 JAN 2026 9:32AM by PIB Hyderabad

నూతన ‘‘జాతీయ విద్యుత్ విధానం (ఎన్ఈపీ)-2026’’ ముసాయిదాను విడుదల చేసినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావడమే ఎన్ఈపీ 2026 ముసాయిదా లక్ష్యంఇది ఖరారైతే.. 2005లో నోటిఫై చేసిన ఎన్ఈపీ స్థానంలో అమల్లోకి వస్తుంది.

డిమాండ్-సరఫరా లోటుపరిమిత విద్యుత్ వసతిమౌలిక వసతుల లేమితో సహా విద్యుత్ రంగంలో ప్రాథమిక సవాళ్లను పరిష్కరించేందుకు 2005 ఫిబ్రవరిలో మొదటి జాతీయ విద్యుత్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారుఅప్పటి నుంచి భారతీయ విద్యుత్ రంగం పురోగమనంలో పయనిస్తోందిప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ఉత్పత్తి సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగిందిమార్చి 2021 నాటికి సార్వత్రిక విద్యుద్దీకరణ సాధ్యమైందిఏకీకృత జాతీయ గ్రిడ్ 2013 డిసెంబర్‌లో పనిచేయడం ప్రారంభించింది. 2024-25 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1,460 కిలోవాట్లకు చేరుకుందిదేశవ్యాప్తంగా విద్యుత్ సేకరణ సౌలభ్యాన్నిసామర్థ్యాన్ని విద్యుత్ మార్కెట్లుఎక్స్ఛేంజిలు మెరుగుపరిచాయి.

ఇన్ని ఘనతలు సాధించినప్పటికీపంపిణీ వ్యవస్థలో అధిక నష్టాలుబకాయిలు లాంటి సవాళ్లు అలాగే ఉన్నాయిచాలా విభాగాల్లో సుంకాలు.. ఖర్చుల్లో ప్రతిబింబించడం లేదుఅలాగే అధిక క్రాస్ సబ్సిడీల వల్ల పారిశ్రామిక సుంకాలు పెరిగాయిఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పరిశ్రమలు పోటీ పడటంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఈపీ-2026 ముసాయిదా ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకుందితలసరి విద్యుత్ వినియోగం 2030 నాటికి 2,000 కిలోవాట్లకు, 2047 నాటికి 4,000 కిలోవాట్లకు చేర్చాలనేది ఈ విధానం లక్ష్యంఅదే విధంగా, 2005తో పోలిస్తే 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడం, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడంతో సహా భారత పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ విధానం ఉందిఇది తక్కువ కర్భన ఉద్గారాలు వెలువడే విద్యుత్ మార్గాల దిశగా నిర్ణయాత్మక మార్పును తప్పనిసరి చేస్తుంది.

ఎన్ఈపీ-2026 ముసాయిదాలో పేర్కొన్న ప్రధాన కార్యక్రమాలు:

  1. సమృద్ధిగా వనరులు (ఆర్ఏ):

  • వికేంద్రీకృత ముందస్తు ప్రణాళిక ద్వారా అవసరమైన సామర్థ్య విస్తరణను సాధించడానికి రాష్ట్రాల కమిషన్ల నిబంధనలకు అనుగుణంగా.. వినియోగరాష్ట్ర స్థాయుల్లో ఆర్ఏ ప్రణాళికలను డిస్కమ్‌లుఎస్ఎల్‌డీసీలు రూపొందిస్తాయిజాతీయ స్థాయిలో వనరుల సమృద్ధికి భరోసా ఇచ్చేలా జాతీయ స్థాయి ప్రణాళికలను సీఈఏ సిద్ధం చేస్తుంది.

  1. ఆర్థిక ఆచరణఆర్థిక పోటీతత్వం:

  • రాష్ట్ర కమిషన్ ఎలాంటి పన్ను ఉత్తర్వులు జారీ చేయని సందర్భంలో సుంకాలను స్వయంచాలకంగా వార్షిక సవరణ చేసేలా తగిన సూచికలకు అనుసంధానించాలి.

  • పన్ను విభాగాలువివిధ వర్గాల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీలను నివారించడానికి డిమాండు చార్జీల ద్వారా స్థిర వ్యయాలను సుంకాల ద్వారా తిరిగి రాబట్టుకోవాలి.

  • భారతీయ ఉత్పత్తుల ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించేందుకురవాణా ఖర్చులను తగ్గించేందుకు తయారీ రంగ పరిశ్రమలురైల్వేలుమెట్రో రైల్వేలకు క్రాస్-సబ్సిడీలుసర్‌చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలి.

  • సంబంధిత ప్రభుత్వాలను సంప్రదించిన అనంతరం ఒక మెగావాట్అంతకంటే ఎక్కువ కాంట్రాక్టు లోడ్ ఉన్న వినియోగదారులకు సంబంధించి పంపిణీ లైసెన్సుదారులకు సార్వత్రిక సేవా భారం నుంచి నియంత్రణ కమిషన్లు మినహాయింపు ఇవ్వొచ్చు.

  • నియంత్రణ కమిషన్లపై భారాన్ని తగ్గించేందుకువివాదాలను వేగంగా పరిష్కరించేందుకువినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి.

  1. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తినిల్వ:

  • మార్కెట్ ఆధారిత వ్యవస్థలుసొంత విద్యుత్ కేంద్రాల ద్వారా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం.

  • చిన్న వినియోగదారులకు అధిక మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కలిగే ధరల ప్రయోజనాన్ని అందించేందుకు వారి తరఫున లైసెన్సు పొందిన వారే నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాయిఅలాగే టోకు వినియోగదారులు నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ (డీఆర్ఈస్వీకరణను సులభతరం చేయవచ్చు.

  • డీఆర్ఈ నుంచి లభించే మిగులు విద్యుత్తును వినియోగదారులు తామే స్వయంగా (పీ2పీలేదా అగ్రిగేటర్ల ద్వారా విక్రయించవచ్చు లేదా నిల్వ చేసుకోవచ్చు.

  • 2030 నాటికి షెడ్యూలింగ్వ్యత్యాసాల నిర్వహణలో పునరుత్పాదక విద్యుత్తుసంప్రదాయ వనరుల మధ్య సమానత్వం తీసుకురావడం.

  • మార్కెట్ ఆధారిత నిల్వ వ్యూహంబ్యాటరీ విద్యుత్ నిల్వ వ్యవస్థ (బీఈఎస్ఎస్సాంకేతికతల వినియోగందేశీయంగా బీఈఎస్ఎస్ బ్యాటరీలుఇతర పరికరాలను తయారు చేయడంబీఈఎస్ఎస్పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కోసం వీజీఎఫ్ లాంటి డిమాండు ఆధారిత ప్రోత్సాహకాలను అందించడం.

    4. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి

  • పెద్ద మొత్తంలో పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానించేందుకు వీలుగా గ్రిడ్‌కు తోడ్పాటకు అందించేందుకు నిల్వ ఏకీకరణపాత యూనిట్ల పునరుద్ధరణ.

  • కేంద్రీయ కూలింగ్ వ్యవస్థ లేదా గరిష్ఠ వినియోగం కోసం పారిశ్రామిక పద్ధతులు వంటి అనువర్తనాల్లో థర్మల్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే ఆవిరిని నేరుగా ఉపయోగించుకునే అవకాశాల అన్వేషణ.

  1. అణు విద్యుత్ ఉత్పత్తి:

  • 2047 నాటికి 100 గిగావాట్లను సాధించడానికి శాంతి చట్టం-2025లోని నిబంధనలకు అనుగుణంగా అధునాతన అణు సాంకేతికతల స్వీకరణమాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధిచిన్న రియాక్టర్ల ఏర్పాటువాణిజ్యపారిశ్రామిక వినియోగదారులు అణు విద్యుత్తును వినియోగించుకోవడం.

  1. జల విద్యుత్ ఉత్పత్తి:

  • వరద ప్రభావ నియంత్రణసాగునీరునీరువిద్యుత్ భద్రత కోసం నిల్వ ఆధారిత జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడం.

  1. విద్యుత్ మార్కెట్లు:

  • మార్కెట్ పర్యవేక్షణ కోసంకుట్రలుఅక్రమాలను లేదా మార్కెట్ ఆధిపత్యాన్ని నివారించేలా నిఘా ఉంచడానికి బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం.

  1. సరఫరా:

  • రైట్ ఆఫ్ వే (ఆర్‌వోడబ్ల్యూసవాళ్లను పరిష్కరించడానికి ఆధునిక సాంకేతికతల స్వీకరణతగినంత భూ వినియోగ పరిహారం చెల్లింపు.

  • 2030 నాటికి అన్ని రకాల నూతన పునరుత్పాదక విద్యుత్ సరఫరా ఛార్జీలను సంప్రదాయక విద్యుత్ టారిఫ్‌లతో సమానంగా తీసుకురావడం.

  • గరిష్ట వినియోగాన్ని నిర్ధారించడానికిఊహాజనిత నిల్వను నిరోధించడానికి సరైన నియంత్రణా వ్యవస్థలతో పాటుగా.. సరఫరా అనుసంధానానికి వినియోగ ఆధారిత నియమాల ఏర్పాటు.

  1. పంపిణీ:

  • ఏటీ అండ్ సీ నష్టాలను సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు.

  • నెట్వర్క్ పునరావృతం కాకుండా చూసుకుంటూనే పోటీనిసామర్థ్యాన్ని పెంపొందించేలా ఉమ్మడి పంపిణీ వ్యవస్థల ఏర్పాటు.

  • ఉమ్మడి వ్యవస్థపునరుత్పాదక పంపిణీ ఏకీకరణనిల్వవాహనం నుంచి గ్రిడ్ (వీ2జీవ్యవస్థలను సులభతరం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆపరేటర్ (డీఎస్ఓఏర్పాటు.

  • 2032 నాటికి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లోనూ ట్రాన్స్ఫార్మర్ స్థాయి పంపిణీలో లో ఎన్-1 అదనపు సౌకర్యాల ఏర్పాటు(రిడెండెన్సీ). ఇలాంటి నగరాల్లో ఇరుకు ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థను భూగర్భంలోకి మార్చేందుకు పరిగణన.

  1. గ్రిడ్ కార్యకలాపాలు

  • ఎస్ఎల్‌డీసీ కార్యకలాపాలను నిర్వహించడానికిసరఫరా ప్రణాళికలను చేపట్టడానికి రాష్ట్ర సరఫరా సంస్థ (ఎస్‌టీయూ)ల క్రియాత్మక విభజనరాష్ట్ర స్థాయిలో స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం.

  • సీఈఆర్‌సీ నిర్దేశించిన ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్‌కు అనుగుణంగా రాష్ట్ర గ్రిడ్ కోడ్‌లు.

  1. సైబర్ భద్రత

  • విస్తృతమైన సైబర్ భద్రతా విధానం ఏర్పాటు.

  • డేటా సార్వభౌమత్వాన్నివ్యవస్థ స్థిరత్వానికి హామీ ఇచ్చేలా విద్యుత్ రంగ సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయడం తప్పనిసరి.

  1. డేటా షేరింగ్:

  • కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ఆధారంగా కార్యనిర్వాహకమార్కెట్ సమాచారం పంచుకోవడం.

  • డిస్కంలుఎస్ఎల్‌డీసీలకు పంపిణీ చేసి విద్యుత్ వనరుల సమచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం.

  1. సాంకేతికతనైపుణ్యాభివృద్ధి:

  • 2030 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన ఎస్‌సీఏడీఏకు మారడం.

  • విద్యుత్ వ్యవస్థలో కీలకమైన అన్ని అనువర్తనాల కోసం దేశీయ సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం.

  • వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. నమ్మకమైననాణ్యమైన విద్యుత్తును చౌక ధరలకు అందించడానికి భవిష్యత్తుకు అనుగుణమైనఆర్థికంగా లాభదాయకమైనపర్యావరణపరంగా సుస్థిరమైన విద్యుత్ రంగానికి అవసరమైన నమూనాను ఎన్ఈపీ-2026 ముసాయిదా అందిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2217115) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Odia , Tamil