భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ప్రారంభమైన ఐఐసీడీఈఎం-2026 సదస్సు


వివిధ దేశాల ప్రతినిధి బృందాల అధిపతులకు అధికారికంగా స్వాగత వేడుక నిర్వహించిన ఈసీఐ..

"ఇండియా డిసైడ్స్" డాక్యుమెంటరీ సిరీస్ ప్రదర్శన

प्रविष्टि तिथि: 21 JAN 2026 3:35PM by PIB Hyderabad

1. న్యూఢిల్లీలోని భారత మండపంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంఎన్నికల నిర్వహణ (ఐఐసీడీఈఎం)-2026 అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు ఇవాళ ప్రారంభమైంది.

 

2. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీశ్రీ జ్ఞానేశ్ కుమార్ఎన్నికల కమిషనర్లు (ఈసీలుడాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధుడాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి దాదాపు 60 మంది అంతర్జాతీయ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు.

 

3. వైభవంగా జరిగిన సదస్సు ప్రారంభ వేడుకలో సుమారు 1,000 మంది అతిథులు పాల్గొన్నారుఈ కార్యక్రమానికి 42 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు (ఈఎంబీలు), 27 దేశాల రాయబారులుహై కమిషనర్లు, 70కి పైగా జాతీయ సంస్థల నిపుణులు హాజరయ్యారుఈసీఐ ఉన్నతాధికారులుదేశవ్యాప్తంగా 36 మంది ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలుఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

4. కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలికిన సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్.. కొన్ని దశాబ్దాలుగా ఈఎంబీల పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారుప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. 150 కోట్ల జనాభాతో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఎన్నికలను నిర్వహిస్తుందని వివరించారు.

 

5. పౌరులు ఈఎంబీలపై ఉంచిన నమ్మకం అత్యంత విలువైనదని ఈసీ డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు అన్నారుప్రతి ఎన్నికకు పౌరులే కీలకమనితన ఓటును గౌరవిస్తారనే నమ్మకం పౌరులకు ఉంటుందనిఆ నమ్మకాన్ని కాపాడటం ఈఎంబీల ఉమ్మడి బాధ్యతని తెలిపారు.

 

6. సమావేశం ప్రారంభంలో ఈసీ డాక్టర్ వివేక్ జోషి మాట్లాడుతూ.. ఈఎంబీలుపరిశోధకులువిద్యార్థులునిపుణులను ఐఐసీడీఈఎం-2026 సదస్సు ఒకచోటకు చేర్చిందన్నారువీళ్లంతా విభిన్న కోణాల నుంచి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిఆయా సంస్థల అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు.

 

7. ఐఐసీడీఈఎం-2026 ఇతివృత్తంపై ఐఐఐడీఈఎం డైరెక్టర్ జనరల్ శ్రీ రాకేశ్ వర్మ మాట్లాడారుభారత్ ఎంచుకున్న సమ్మిళితశాంతియుతస్థితిస్థాపకత గలస్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం అనే ఇతివృత్తం.. 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం సాధించాల్సిన అంశంపై విస్తృతమైనవివిధ కోణాల్లో అవగాహనను ప్రతిబింబిస్తుందన్నారు.

 

8. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సహకారంతో నిర్మించిన ఇండియా డిసైడ్స్ డాక్యుమెంటరీ సీరిస్ కు సంబంధించిన విశేషాలను కార్యక్రమంలో పాల్గొన్నవారు వీక్షించారుఈ సందర్భంగా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అర్జున్ నోహ్వార్ మాట్లాడారుప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన బాధ్యతల్లో ఒకదాన్ని నిర్వహించే సంస్థ పనితీరు ఆధారంగాసాధారణ ఎన్నికలను ఆకట్టుకునే దృశ్యాలతో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ప్రభావవంతంగా చిత్రీకరించినట్లు చెప్పారు.

 

***


(रिलीज़ आईडी: 2217113) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , हिन्दी , Punjabi , Tamil