రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

లక్నోలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో (ఏఐపీవోసీ)లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ ప్రసంగం: ఏఐను సమర్థంగా వినియోగించుకోవడానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య సమన్వయానికి పిలుపు


కచ్చితమైన ఏఐ వ్యవస్థల కోసం సంస్థాగత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరిన శ్రీ హరివంశ్

చట్టాలు, పద్దులపై జరిగిన చర్చలతో సహా అధికారిక విధాన పత్రాలకు చట్టసభలే సంరక్షకులు: శ్రీ హరివంశ్

‘‘పార్లమెంటుకు తగిన విధంగా ఏఐను మార్చేది అల్గారిథం కాదు.. దానికి శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించిన విజ్ఞానం’’

प्रविष्टि तिथि: 20 JAN 2026 4:39PM by PIB Hyderabad

మంగళవారం లక్నోలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (ఏఐపీవోసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగించారువివిధ రాష్ట్రాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాసన వ్యవస్థలను మరింత సమర్థంగా తయారుచేయడంలో ఏఐ పాత్ర గురించి వివరించారుఅలాగే సాంకేతికతను కచ్చితత్వంతో కూడినదిగావిశ్వసనీయంగా మార్చడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యల గురించి కూడా తెలియజేశారుపార్లమెంటులో ఏఐను ప్రయోగాత్మకంగా అమలు చేసిన సందర్భాలుమార్గాలను తెలియజేశారుఅలాగే ఈ అంశంలో రాష్ట్ర శాసనసభలుపార్లమెంటు మధ్య మరింత సమన్వయం ఉండాలని పిలుపునిచ్చారుఇది పార్లమెంటురాష్ట్రాల శాసనసభలు రెండూ సంస్థాగత పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకొనేలా వీలు కల్పిస్తుంది.

విధానాలకు సంబంధించిన సమాచార సమన్వయానికిదానిని పొందడానికి అవసరమైన దార్శనికతను వివరిస్తూ.. ‘‘అన్ని అధికారిక పత్రాలుచట్టాలుపద్దులతో సహా వివిధ అంశాలపై జరిగిన చర్చలకు చట్టసభలే సంరక్షకులువాటిని ప్రవేశపెట్టినప్పుడే ఆ పత్రాలు సభలో భాగంగా మారతాయిసాధారణంగా ఈ సమాచారం వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉంటుందివీటిని అందరికీ సులభంగా అందుబాటులో ఉంచే వేదికను రూపొందించడానికి ఏఐను పార్లమెంటురాష్ట్ర శాసనసభలు వినియోగించుకోవాలిఇది సంస్థను విజ్ఞాన కేంద్రంగా మారుస్తుంది. శాసన సభ చర్చల్లో ఉపయోగించే భాషపదజాలం కోసం ‘డేటా లేక్’ రూపొందించాలి. భారతీయ పరిస్థితులకు తగినట్టుగా సాంకేతికతకు శిక్షణ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్లను ఉపయోగించుకోవాలి’’ అని అన్నారు.

ఏఐ అందిస్తున్న శిక్షణఅది ఇస్తున్న ఫలితాలను మానవులే పర్యవేక్షించే హైబ్రిడ్ వ్యవస్థకు హరివంశ్ పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటుకు తగిన విధంగా ఏఐను ఉపయోగించుకోవడానికి కారణం దాని అల్గారిథంకున్న సామర్థ్యం కాదువిజ్ఞానం ద్వారా ఆ సాంకేతికత పొందిన శిక్షణే. జాగ్రత్తగా ఎంపిక చేసిన పార్లమెంట్ సమాచారంతో.. పార్లమెంటరీ ఏఐకు పార్లమెంటులోనే శిక్షణ ఇవ్వాలినైపుణ్యాలను పెంపొందించుకోవచ్చువాటిని ఇతరులకు అందించవచ్చుఅవుట్ సోర్స్ చేయవచ్చుకానీ జ్ఞానం సందర్భానికి తగినట్టుగా ఉంటుందిసంస్థలో ఇమిడి ఉంటుంది. పార్లమెంట్ విజ్ఞానం ప్రత్యేకమైనదిచర్చలుతీర్పులుసదస్సులురాజ్యాంగ పద్ధతుల ద్వారా దశాబ్దాలుగా అది నిర్మితమైంది’’ అని ఆయన తెలిపారు.

ఏఐ-ఆధారిత ట్రాన్స్‌క్రిప్షన్‌ఒకే సమయంలో వివిధ భాషల్లో అనువాద సేవలను పార్లమెంట్ ఎలా పరీక్షించిందో తన ప్రసంగంలో ఆయన వివరించారుప్రస్తుతం.. తమకు నచ్చిన భాషలో సభకు సంబంధించినఇతర పరిపాలనాపరమైన డాక్యుమెంట్లను పార్లమెంటు సభ్యులు పొందవచ్చుదీనిని ఏఐ సాయంతో అందిస్తున్నారుప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నల స్వీకార యోగ్యతను పరిశీలించడంపూర్వోత్తరాలనుతీర్పులను ఏఐ ద్వారా శోధించవచ్చుఅలాగే సిబ్బందిచట్ట సభల సభ్యులు తమ పాత్రలను సమర్థంగా పోషించడానికి అవగాహనమార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

డిజిటల్ టూల్స్‌ను ఉపయోగించడంతో పాటుగా.. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంశాసనసభ్యుల సామర్థ్యాలను బలోపేతం చేయడం గురించి కూడా వివరించారుజనవరి 19న గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

 

***


(रिलीज़ आईडी: 2216739) आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada