సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక మాధ్యమాల నుంచి ఓటీటీ వేదికల వరకు: ఆన్‌లైన్‌లో అశ్లీలత, తప్పుడు సమాచారం, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు


ముఖ్యంగా మహిళలు, చిన్నారుల కోసం సురక్షితమైన, విశ్వసనీయమైన,

జవాబుదారీతనంతో కూడిన ఇంటర్నెట్ వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం

ఐటీ చట్టం, ఐటీ నియమాలు 2021, భారతీయ న్యాయ సంహిత ద్వారా అశ్లీలమైన, హానికరమైన,

చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ సమాచారాన్ని అరికట్టేందుకు చర్యలు

50 లక్షలకు పైగా వినియోగదారులను కలిగిన ప్రధాన సామాజిక మాధ్యమాల వేదికలు కచ్చితంగా

స్థానిక అధికారులను నియమించి, సమ్మతి నివేదికలను ప్రచురించాలి

प्रविष्टि तिथि: 17 DEC 2025 2:23PM by PIB Hyderabad

వినియోగదారులకు ముఖ్యంగా మహిళలుచిన్నారులకు  స్వేచ్ఛాయుతమైనసురక్షితమైననమ్మకమైనజవాబుదారీతనంతో కూడిన ఇంటర్నెట్‌ను అందించడమే ప్రభుత్వం విధానాల ముఖ్య లక్ష్యం.

ఇంటర్నెట్‌లో ఎలాంటి చట్టవిరుద్ధమైన సమాచారంముఖ్యంగా అశ్లీలతఅసభ్యకరమైనదిగా ఉండకూడదని ప్రభుత్వం సంకల్పించింది.

సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన సమాచారాన్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు

సమాచార సాంకేతిక చట్టం 2000

ఐటీ చట్టంసమాచార సాంకేతికత (మధ్యవర్తుల మార్గదర్శకాలు,సామాజిక మాధ్యమాల నైతిక నియమావళినియమాలుఐటీ నియమాలు 2021 సంయుక్తంగా కలిసి డిజిటల్ వేదికల్లో చట్టవిరుద్దమైనహానికరమైన సమాచారాన్ని నియంత్రించేందుకు కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేశాయి.

ఈ చట్టాలు మధ్యవర్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా స్పష్టమైన బాధ్యతలను విధిస్తాయి.

టీ చట్టం ప్రకారం గోప్యత ఉల్లంఘనలు (సెక్షన్ 66)అసభ్యమైనఅశ్లీల సమాచారాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం (సెక్షన్లు 67, 67, 67బీవంటి వివిధ సైబర్ నేరాలకు శిక్షలు విధించనుంది.

నేరాలను దర్యాప్తు చేయడానికి (సెక్షన్ 78), బహిరంగ ప్రదేశాల్లో తనిఖీ చేయడంఅనుమానిత వ్యక్తులను అరెస్టు చేయడం (సెక్షన్ 80) వంటి అధికారాలను పోలీసులకు ఈ చట్టం కల్పిస్తోంది.

ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలుడిజిటల్ మీడియా నైతిక నియమావళినియమాలు, 2021

సామాజిక మాధ్యమాల మధ్యవర్తులతో సహా ఇతర మధ్యవర్తులపై తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యతను ఐటీ నియమాలు 2021 తెలుపుతుందిచట్టవిరుద్ధమైన సమాచారాన్ని ప్రసారం చేయకుండానిరోధించడానికి ఈ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయాలని వాటిని ఆదేశిస్తాయి.

ఐటీ నియమాలు 2021లోని ముఖ్య నిబంధనలు:

నిబంధన

వివరాలు

నిబంధన 3(1)(బిప్రకారం పరిమిత సమాచారం

కింది పేర్కొన్న విధంగా ఉండే సమాచారాన్ని ప్రసారం చేయడంనిల్వ చేయడంప్రదర్శించడం లేదా ప్రచురించడాన్ని పరిమితం చేస్తుంది.

  • అశ్లీలమైనఅసభ్యమైనఇతరుల గోప్యతను ఉల్లంఘించేదిలింగ ఆధారంగా అవమానకరంగా లేదా వేధింపుగా ఉండేదిజాతిపరంగా వంశ ఆధారంగా అభ్యంతరకరమైనదిద్వేషంహింసను ప్రోత్సహించడం;

  • పిల్లలకు హానికరమైనది;

  • డీప్‌ఫేక్‌లతో సహామోసం చేసే లేదా తప్పుదారి పట్టించడం;

  • కృత్రిమ మేధ సహాఇతరులను అనుకరించడం;

  • జాతీయ భద్రతకుశాంతి భద్రతలకు ముప్పు కలిగించడం;

  • వర్తించే ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించడం.

వినియోగదారుల అవగాహన

బాధ్యతలు

చట్టవిరుద్ధమైన సమాచారాన్ని  ప్రసారం చేయడం వల్ల కలిగే పరిణామాలుసమాచారం తొలగింపుఖాతా నిలిపివేత లేదా రద్దు వంటి వాటి గురించి మధ్యవర్తులు సేవా నిబంధనలువినియోగదారు ఒప్పందాల ద్వారా వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి.

సమాచారం తొలగింపులో జవాబుదారీతనం

కోర్టు ఆదేశాలుప్రభుత్వం నుంచి హేతుబద్దమైన సమాచారంవినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా తొలగించడానికి త్వరితగతిన  చర్యలు మధ్యవర్తులు తీసుకోవాలి.

ఫిర్యాదుల పరిష్కారం

  • మధ్యవర్తులు ఫిర్యాదు అధికారులను నియమించాలి

  • చట్టవిరుద్ధమైన సమాచారాన్ని 72 గంటల్లోపు తొలగించడం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించాలి.

  • గోప్యతను ఉల్లంఘించేవ్యక్తులను నకిలీగా నటించేఅశ్లీలతను చూపించే సమాచారంపై వచ్చిన ఫిర్యాదుపై 24 గంటల్లోపు పరిష్కరించాలి.

ఫిర్యాదు అపీలేట్ కమిటీల వ్యవస్థ

తమ ఫిర్యాదులను మధ్యవర్తుల ఫిర్యాదు అధికారులు పరిష్కరించకపోతే వినియోగదారులు www.gac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు అపీలేట్ కమిటీలు సమాచార నియంత్రణ నిర్ణయాలపై బాధ్యతాయుత పారదర్శకతను నిర్ధారిస్తాయి.

మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ సంస్థలకు

సహాయం

వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడానికిసైబర్ భద్రతా పరమైన సంఘటనలతో సహా ఇతర నేరాల

నివారణగుర్తింపుదర్యాప్తు లేదా విచారణ కోసం మధ్యవర్తిత్వ సంస్థలు తమ నియంత్రణలో ఉన్న

సమాచారాన్నిసహాయాన్ని అధికారిక ప్రభుత్వ సంస్థలకు తప్పనిసరిగా అందించాలి.

ప్రాముఖ్యత కలిగిన సోషల్ మీడియా మధ్యవర్తుల అదనపు బాధ్యతలు

(దేశంలో 50 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయిన వినియోగదారులున్న సోషల్ మీడియా మధ్యవర్తులు)

  • మెసెజ్‌ సేవలను అందించే ఎస్‌ఎస్‌ఎంఐలు తీవ్రమైనసున్నితమైన సమాచారాన్ని పోస్టు చేసే వారిని గుర్తించడంలో అధికారులకు సహకరించాలి.

  • కొన్ని చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని గుర్తించడానికిపరిమితం చేయడానికి ఎస్‌ఎస్‌ఎంఐలు స్వయంచాలిత సాధనాలను ఉపయోగించాలి.

  • సమ్మతి నివేదికలను ప్రచురించడానికి స్థానిక అధికారులను నియమించాలిపాలనచట్ట అమలు సమన్వయానికి భారతీయ చిరునామాను అందించాలి.

  • ఎస్‌ఎస్‌ఎంఐలు స్వయంగా చర్యలు తీసుకునే ముందు స్వచ్ఛంద వినియోగదారు ధ్రువీకరణఅంతర్గత అప్పీళ్లున్యాయమైన విచారణను అందించాలి.


 

ఒకవేళ ఐటీ నియమాలు 2021లో పేర్కొన్న చట్టపరమైన విధులను నిర్వర్తించడంలో మధ్యవర్తులు విఫలమైతే.. వారు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద థర్డ్‌ పార్టీ సమాచారానికి సంబంధించి లభించే మినహాయింపును కోల్పోతారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం తదుపరి చర్యలు లేదా విచారణకు బాధ్యులవుతారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023

సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలనుఆన్‌లైన్‌లో హానికరఅశ్లీలతతప్పుడు సమాచారంఇతర సైబర్-ఆధారిత నేరాలకు సంబంధించిన వాటిని పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను 2023 బీఎన్‌ఎస్‌ చట్టం బలోపేతం చేస్తుంది.

అసభ్య చర్యలు (సెక్షన్ 296), ఎలక్ట్రానిక్ రూపంలో ప్రదర్శించే అశ్లీల సమాచారంతో సహాఅశ్లీల సామగ్రిని విక్రయించడం (సెక్షన్ 294) వంటి నేరాలకు శిక్షను విధిస్తుంది.

ఓటీటీ వేదికల్లో హానికర సమాచార ప్రతికూలప్రభావాలను నియంత్రించడానికి ప్రభుత్వం 25 ఫిబ్రవరి 2021న ఐటీ చట్టం 200 ప్రకారం సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలుడిజిటల్ మీడియానైతిక నియమావళినియమాలు, 2021ని నోటిఫై చేసింది.

నిబంధనలు భాగం-3లో డిజిటల్ వార్తా ప్రచురణకర్తలుఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురకుల కోసం ఒక నైతిక నియమావళిని అందిస్తుంది.

ఓటీటీ వేదికలు ప్రస్తుత చట్టం ద్వారా నిషేధించిన ఏదైనా సమాచారాన్ని ప్రసారం చేయకూడదు.

ఇప్పటి వరకు దేశంలో అశ్లీల సమాచారాన్ని ప్రదర్శించిన కారణంగా 43 ఓటీటీ వేదికలను ప్రభుత్వం నిలిపివేసింది.

ఈ సమాచారాన్ని సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ లోక్‌సభలో శ్రీ నిషికాంత్ దుబే అడిగిన ప్రశ్నకు సమాధానంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2205989) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam