ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి
రష్యా భాషలోని భగవద్గీత ప్రతిని అధ్యక్షుడు శ్రీ పుతిన్కు బహూకరించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 DEC 2025 10:30AM by PIB Hyderabad
రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్కు భారత్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
‘‘ఈ రోజు సాయంత్రం, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
రష్యన్ భాషలోకి అనువాదమైన భగవద్గీత పుస్తకాన్ని రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహూకరించారు. గీత బోధనలు ప్రపంచం అంతటా లక్షల మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘నా స్నేహితుడు, అధ్యక్షుడు శ్రీ పుతిన్కు భారత్కు ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు సాయంత్రమూ, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’.
‘‘నా నేస్తం, అధ్యక్షుడు శ్రీ పుతిన్ను 7, లోక్ కల్యాణ్ మార్గ్కు ఆహ్వానించాను’’.
‘‘రష్యన్ భాషలోకి అనువాదమైన గీత పుస్తకాన్ని అధ్యక్షుడు శ్రీ పుతిన్కు అందజేశాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి’’.
***
(రిలీజ్ ఐడి: 2199680)
సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam