ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామ్‌నాథ్ గోయెంకా 6వ ఉపన్యాసం ఇచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారేందుకు భారత్ ఆరాటం: పీఎం

భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. ఇది అభివృద్ధికి నమూనా: పీఎం

ఇవాళ భారత్ అభివృద్ధి నమూనాని నమ్మకమైనదిగా చూస్తున్న ప్రపంచం: పీఎం

ప్రతి లబ్ధిదారుడికీ పథకాల ప్రయోజనాలు... సంపూర్ణత దిశగా నిరంతర కృషి: పీఎం

నూతన జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషల్లో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత: పీఎం

Posted On: 17 NOV 2025 9:54PM by PIB Hyderabad

ఇవాళ న్యూఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక ‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… రామ్‌నాథ్ గోయెంకా ఆరో ఉపన్యాసాన్ని అందించారుఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యంజర్నలిజంభావవ్యక్తీకరణప్రజా ఉద్యమాల శక్తిని పెంచిన మహోన్నత వ్యక్తిని గౌరవించడంలో భాగంగా మనమంతా ఇక్కడ సమావేశమైనట్లు తెలిపారురామ్‌నాథ్ గోయెంకా.. దార్శనికత కలిగిన వ్యక్తిసంస్థ స్థాపకుడుజాతీయవాదిమీడియా నాయకుడని ప్రధానమంత్రి కొనియాడారుది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం వార్తాపత్రికగా కాకుండా భారత ప్రజల కోసం ఒక యజ్ఞంలా ప్రారంభించారన్నారురామ్‌నాథ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలుజాతీయ ప్రయోజనాల గొంతుకగా ఈ సంస్థ మారిందని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోరామ్‌నాథ్ గోయెంకా నిబద్ధతకృషిదార్శనికత స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారుఉపన్యాసం ఇచ్చేందుకు తనను ఆహ్వానించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు ధన్యవాదాలు చెప్పిన ప్రధానమంత్రి.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


 

భగవద్గీతలోని ఒక శ్లోకం నుంచి రామ్‌నాథ్ గోయెంకా స్ఫూర్తిని పొందారనిదాని ప్రకారం సుఖ దుఃఖాలులాభ నష్టాలుగెలుపోటములను సమానంగా చూస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటమనేవి ఆయన జీవితంలోనూపనిలోనూ అంతర్లీనంగా కనిపిస్తాయన్నారు.ఈ సిద్ధాంతాన్ని రామ్‌నాథ్ గోయెంకా జీవితాంతం పాటించారనిఅన్నిటికంటే కర్తవ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుస్వాతంత్య్రోద్యమ సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన రామ్‌నాథ్ గోయెంకాతర్వాత జనతా పార్టీలో చేరారనిజనసంఘ్ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారుఆయన భావజాలం ఏదైనప్పటికీజాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చేవారన్నారురామ్‌నాథ్ గారితో పనిచేసిన వారుఆయన చెప్పిన వాటిని స్మరించుకుంటారని ప్రధానమంత్రి తెలిపారుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో రజాకార్లు దౌర్జన్యం చేసినపుడు సర్దార్ పటేల్‌కు రామ్‌నాథ్ సహకరించిన పరిస్థితుల్ని గుర్తు చేశారు. 1970లో బీహార్ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం అవసరమైనప్పుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో కలిసి శ్రీ జయప్రకాశ్ నారాయణ్‌ను ఉద్యమానికి నాయకత్వం వహించాలని రామ్‌నాథ్ గారు ఒప్పించారని తెలిపారుఎమర్జెన్సీ సమయంలోనాటి ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైన మంత్రుల్లో ఒకరు రామ్‌నాథ్ గారిని పిలిపించి జైలు శిక్ష విధిస్తామని బెదిరించినప్పుడుఆయన చెప్పిన ధైర్యవంతమైన సమాధానం చరిత్రపుటల్లో రహస్యంగా ఉందన్నారుఈ కథనాల్లో కొన్ని బయట ప్రపంచానికి తెలిసినామరికొన్ని తెలియకపోయినాఅవన్నీ రామ్‌నాథ్ గారి నిజాయితీని నిలబెట్టాలనే నిబద్ధతనుఎవరికీ భయపడకుండా తన కర్తవ్యానికి కట్టుబడి ఉండే స్థిర వైఖరిని ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

రామ్‌నాథ్ గోయెంకాని అసహనంతో ఉండే వ్యక్తిగా వర్ణించేవారని అయితే అది ప్రతికూల కోణంలో కాదనిసానుకూల విధానమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుమార్పు కోసం అత్యున్నత స్థాయిలో కృషి చేసే అసహనంస్తంభించిపోయిన నీటిని కూడా కదిలించే అసహనమని స్పష్టం చేశారుప్రధానమంత్రి ఒక పోలికను ప్రస్తావిస్తూ, "నేటి భారతదేశం కూడా అసహనంతో ఉంది… అభివృద్ధి చెందటానికిస్వయం సమృద్ధి సాధించేందుకు ఉవ్విళ్లూరుతోందిఅని అన్నారు. 21వ శతాబ్దంలో మొదటి ఇరవై ఐదేళ్లు చాలా వేగంగా గడిచిపోయాయనిఒకదాని తర్వాత మరో సవాలు ఎదురవుతూనే ఉన్నప్పటికీఅవి భారత్ వృద్ధిని ఆపలేకపోయాయని అన్నారు.

 

గడిచిన నాలుగైదేళ్లు ప్రపంచం సవాళ్లతో నిండిపోయిందనీ, 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరిచిఅనిశ్చితిని సృష్టించిందని ప్రధానమంత్రి అన్నారుప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమై జనం అగాధంలోకి పడిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారుపరిస్థితులు చక్కదిద్దుకుంటున్న సమయంలోపొరుగు దేశాల్లో సంక్షోభం తలెత్తిందనిఇన్ని సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటును సాధించిస్థిరత్వాన్ని ప్రదర్శించిందని వెల్లడించారు. 2022లో వచ్చిన ఐరోపా సంక్షోభం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థఇంధన మార్కెట్లు ప్రభావితం కాగామొత్తం ప్రపంచంపై ఈ ప్రభావం పడిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుపశ్చిమాసియాలో 2023లో పరిస్థితులు క్షీణించినప్పటికీభారత్ వృద్ధి పథంలో నిలిచిందన్నారుప్రపంచవ్యాప్తంగా అశినిశ్చితి ఉన్నప్పటికీఈ ఏడాది కూడా దేశ వృద్ధి రేటు సుమారు శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.


 

"అస్థిర పరిస్థితుల దృష్ట్యా ప్రపంచం జంకుతున్న తరుణంలోఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందిఅని ప్రధానమంత్రి తెలిపారు. "భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. ఇది అభివృద్ధికి నమూనాఅని స్పష్టం చేశారుఇవాళ భారత్ అభివృద్ధి నమూనాని విశ్వసనీయమైనదిగా ప్రపంచం చూస్తోందన్నారు.

బలమైన ప్రజాస్వామ్యాన్ని అనేక ప్రమాణాల ఆధారంగా పరీక్షిస్తారనివాటిలో అత్యంత ముఖ్యమైనది ప్రజల భాగస్వామ్యమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకంఆశావాదం ఎన్నికల సమయంలో స్పష్టమవుతుందన్నారునవంబర్ 14న ప్రకటించిన ఫలితాలు చరిత్రాత్మకమైనవనిప్రజల భాగస్వామ్యం పెరగటాన్ని ఏ ప్రజాస్వామ్యమూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పారుబీహార్ చరిత్రలోనే ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదైందనిఅందులోనూ మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే సుమారు తొమ్మిది శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారుఇది కూడా ప్రజాస్వామ్య విజయమేనని ఆయన స్పష్టం చేశారు.


 

బీహార్ ఎన్నికల ఫలితాలు మరోసారి భారత ప్రజల ఉన్నతమైన ఆకాంక్షలను ప్రదర్శించాయని ప్రధానమంత్రి అన్నారుతమ ఆకాంక్షలను నెరవేర్చడానికిఅభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిజాయితీతో పనిచేసే రాజకీయ పార్టీలపైనే నేడు ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారుప్రతి రాష్ట్ర ప్రభుత్వం వారి  భావజాలం -  అది అతివాదమైనామితవాదమైనామధ్యస్తమైనా -  బీహార్ ఫలితాల నుంచి పాఠాన్ని గ్రహించాలని ప్రధానమంత్రి కోరారుఈ రోజు అందించే పాలనా విధానంరాబోయే సంవత్సరాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారుబీహార్ ప్రజలు 15 సంవత్సరాలపాటు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారనిరాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీవారు ఆటవిక పాలన మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన అన్నారుఈ నమ్మక ద్రోహాన్ని బీహార్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ప్రధానమంత్రి అన్నారుకేంద్ర ప్రభుత్వమైనా లేక రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలైనా వాటి అత్యధిక ప్రాధాన్యత అభివృద్ధికి మాత్రమేకేవలం అభివృద్ధికి మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారుమెరుగైన పెట్టుబడి వాతావరణం సృష్టించడంలోనూవ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలోనూఅభివృద్ధి సూచీలను ముందుకు తీసుకెళ్లడంలోనూ పరస్పరం పోటీపడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ మోదీ పిలుపునిచ్చారుఇటువంటి ప్రయత్నాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయని ఆయన తెలిపారు.

బీహార్ ఎన్నికల విజయం తరువాతతమను సమర్ధించే కొందరు మీడియా ప్రముఖులు సహా కొంతమంది వ్యక్తులు బీహార్ ఎన్నికల విజయం తరువాతతాముతమ పార్టీనిరంతర ఎన్నికలే అన్నట్లుగా పనిచేస్తున్నామన్నారని శ్రీ మోదీ గుర్తుచేశారుఅయితే ఎన్నికల్లో గెలవడానికి ఎన్నికలే పని అన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదనినిరంతరం మానసిక భావోద్వేగంలో ఉంటే చాలన్నది తన సమాధానమని ఆయన చెప్పారుఒక నిమిషం కూడా వృథా చేయకుండా పేదల కష్టాలను తగ్గించాలని,  ఉపాధి కల్పించాలనిఆరోగ్య సేవల్ని అందించాలనిమధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాలని మనసులో తపన ఉన్నప్పుడు నిరంతర శ్రమ సహజంగానే ముందుకు నడిపే శక్తిగా మారుతుందని ప్రధానమంత్రి తెలిపారుఈ భావోద్వేగంతోనూ,  నిబద్ధతతోనూ పాలన సాగిస్తే దాని ఫలితాలు ఎన్నికల రోజునఇప్పుడు బీహార్‌లో చూసినట్లుగా కనిపిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.

శ్రీ రామనాథ్ గోయెంకా విదిశ నుంచి జనసంఘ్ టికెట్ పొందిన సందర్భంగా జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూఅప్పుడు రామనాథ్నానాజీ దేశ్‌ముఖ్‌ల మధ్య సంస్థ ముఖ్యమావ్యక్తి ముఖ్యమా అనే అనే చర్చ జరిగిందనినామినేషన్ దాఖలు చేయడానికితరువాత విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి మాత్రమే రామనాథ్ వస్తే చాలని నానాజీ దేశ్‌ముఖ్ ఆయనతో చెప్పారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అనంతరం నానాజీ పార్టీ కార్యకర్తల ద్వారా ప్రచారాన్ని నడిపించిరామనాథ్ కు గెలుపు అందించారనిఈ కథను పంచుకోవడంలో తన ఉద్దేశం కేవలం అభ్యర్థులు నామినేషన్లు మాత్రమే దాఖలు చేయాలని సూచించడం కాదని,  పార్టీలోని లెక్కలేనంత మంది కార్యకర్తల నిబద్ధతను తెలియజేయడమే అని శ్రీ మోదీ స్పష్టం చేశారులక్షలాది మంది కార్యకర్తలు తమ స్వేదంతో తమ పార్టీలను పోషించారనిఇప్పటికీ అలాగే చేస్తున్నారని ఆయన చెప్పారుకేరళపశ్చిమ బెంగాల్,  జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలోవందలాది మంది కార్యకర్తలు పార్టీ కోసం తమ రక్తాన్ని కూడా త్యాగం చేశారని ఆయన తెలిపారుఅంతటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీకి కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే లక్ష్యం కాదనినిరంతర సేవ ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడమే లక్ష్యమని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దేశ అభివృద్ధికి దాని ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరడం అత్యవసరమని స్పష్టం చేస్తూప్రభుత్వ పథకాలు దళితులుఅణగారిన వర్గాలుదోపిడీకి గురైన వారువెనుకబడిన వారికి చేరినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి అన్నారుగత దశాబ్దాలలోసామాజిక న్యాయం పేరుతోకొన్ని పార్టీలుకుటుంబాలు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నాయని ఆయన విమర్శించారు

సామాజిక న్యాయం వాస్తవ రూపంలోకి మారడాన్ని ఈ రోజు దేశం చూస్తోందని ఆయన సంతృప్తి చేశారు. 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉదాహరణగా పేర్కొంటూవీటి వల్ల ఇంతవరకు బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయాల్సిన పరిస్థితిలో ఉన్న కోట్లాది మందికి గౌరవం లభించిందని చెప్పారుగత ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతాకు కూడా అర్హులుగా పరిగణించని వారికి 57 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని అందించాయని ఆయన పేర్కొన్నారు. 4 కోట్ల పక్కా గృహాలు పేదలకు కొత్త కలలు కనే శక్తిని ఇచ్చాయనిప్రమాదాలు ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాయని ఆయన తెలిపారు.

గత 11 సంవత్సరాలలో సామాజిక భద్రతపై చేసిన కృషి అద్భుతమైనదనిదశాబ్దం కిందట కేవలం 25 కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రత పరిధిలో ఉండేవారనిఅయితే నేడు దాదాపు 94 కోట్ల మంది భారతీయులు ఆ పరిధిలో ఉన్నారని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారుఇదే నిజమైన సామాజిక న్యాయం అని ఆయన అన్నారుప్రభుత్వం సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే కాకుండాఅర్హులైన లబ్ధిదారులలో ఎవరినీ వదలకుండా చూసే 'సంతృప్తలక్ష్యంతో కూడా పనిచేస్తోందని శ్రీ మోదీ చెప్పారుప్రతి లబ్ధిదారుడి వద్దకు చేరే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసినప్పుడువివక్షకు ఎటువంటి అవకాశం ఉండదని ఆయన అన్నారుఇటువంటి ప్రయత్నాల ఫలితంగాగత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారనిఈ కారణంగానే  'ప్రజాస్వామ్యం ఫలితాలను ఇస్తుందిఅని నేడు ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మరో ఉదాహరణగా పేర్కొన్నారుఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేయాలని ఆయన ప్రజలను కోరారుదేశంలోని 100కు పైగా జిల్లాలను గత  ప్రభుత్వాలు వెనుకబడినవిగా ముద్ర వేసినిర్లక్ష్యం చేశాయని ఆయన గుర్తు చేశారుఈ జిల్లాలను అభివృద్ధి చేయడం చాలా కష్టమని భావించేవారనిఅక్కడ నియమితులైన అధికారులను శిక్షకు గురైనవారిగా  చూసేవారని ఆయన తెలిపారుఈ వెనుకబడిన జిల్లాల్లో 25 కోట్ల మందికి పైగా పౌరులు నివసిస్తున్నారనిఇది సమ్మిళిత అభివృద్ధి ప్రాముఖ్యతను తెలియచేస్తుందని అన్నారు

ఈ వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందకుండా ఉండి ఉంటేభారతదేశం రాబోయే వంద సంవత్సరాలలో కూడా అభివృద్ధిని సాధించలేకపోయేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఅందుకే ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అనుసరించిందనిరాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేసిప్రతి జిల్లా ఏ అభివృద్ధి అంశాలలో వెనుకబడి ఉందో తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనాలు  నిర్వహించిందని ఆయన పేర్కొన్నారుఈ అధ్యయనాల ఆధారంగాప్రతి జిల్లాకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించినట్టు ప్రధాని చెప్పారుదేశంలో అత్యుత్తమ అధికారులను మెరుగైన ప్రతిభవినూత్న ఆలోచనలు కలిగిన వారిని ఆయా ప్రాంతాల్లో నియమించామని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ జిల్లాలను ఇక వెనుకబడినవిగా కాకుండాఆకాంక్ష జిల్లాలుగా పునర్నిర్వచించారనినేడుఈ జిల్లాల్లో చాలా జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల కంటే పలు అభివృద్ధి సూచీలలో ముందంజలో నిలుస్తున్నాయని వివరించారు

చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను ఉదాహరణగా పేర్కొంటూఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పాత్రికేయులకు ఒకప్పుడు పరిపాలనా అధికారుల నుంచి కంటే ప్రభుత్వేతర సంస్థల నుంచి అనుమతులు ఎక్కువగా అవసరమయ్యేవని శ్రీ మోదీ గుర్తు చేశారునేడుఅదే బస్తర్ అభివృద్ధి మార్గంలో పురోగమిస్తోందనిబస్తర్ ఒలింపిక్స్‌కు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్ఎంత ప్రచారం ఇచ్చిందో సరిగా చెప్పలేను గానీ బస్తర్ యువత ఇప్పుడు ఒలింపిక్స్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు చూసి శ్రీ రామనాథ్ గోయెంకా చాలా సంతోషించేవారని ఆయన అన్నారు

బస్తర్ గురించి చర్చించినప్పుడునక్సలిజం లేదా మావోయిస్టు తీవ్రవాదం సమస్యను కూడా పరిష్కరించడం అత్యవసరం అని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారునక్సలిజం ప్రభావం దేశవ్యాప్తంగా తగ్గిపోతున్నప్పటికీఅది ప్రతిపక్ష పార్టీలో సజీవంగా ఉందని ఆయన అన్నారుగత ఐదు దశాబ్దాలుగాభారతదేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్ట్ తీవ్రవాదంచే ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారు.

బస్తర్ గురించి మాట్లాడేటప్పుడు నక్సలిజం అంటే మావోయిస్టు తీవ్రవాదం గురించి ప్రస్తావించడం అవసరమని శ్రీ మోదీ అన్నారుదేశంలో నక్సలిజం ప్రభావం తగ్గిపోతున్నప్పటికీప్రతిపక్ష పార్టీలలో మాత్రం అది ఎక్కువగా కనిపిస్తోందనిగత అయిదు దశాబ్దాలుగా భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్టు తీవ్రవాదంతో ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారుభారత రాజ్యాంగాన్ని తిరస్కరించే మావోయిస్టు తీవ్రవాదాన్ని ప్రతిపక్షం పోషిస్తూనే ఉండటం పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారువారు మారుమూల అటవీ ప్రాంతాలలో నక్సలిజాన్ని సమర్థించడమే కాకుండాపట్టణ కేంద్రాలలోప్రధాన సంస్థలలో కూడా అది వేళ్లూనుకోవడానికి సహాయం చేశారని ఆయన తెలిపారు.  

10 - 15 సంవత్సరాల కిందటే పట్టణ నక్సల్స్ ప్రతిపక్షంలో లోతుగా పాతుకుపోయారనినేడు వారు ఆ పార్టీని తాను పేర్కొన్న విధంగా  "ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్" (ఎంఎంసీఅని మార్చేశారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఈ ఎంఎంసీ తన స్వార్థపూరిత ఉద్దేశాల కోసం జాతీయ ప్రయోజనాలను విస్మరించిందనిదేశ ఐక్యతకు ముప్పుగా మారుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు

భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలోశ్రీ రామనాథ్ గోయెంకా వారసత్వం  మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని ప్రధానమంత్రి అన్నారుబ్రిటిష్ వలస పాలనను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో గుర్తు చేస్తూ, "బ్రిటీష్ వారి ఆదేశాలను పాటించే బదులు నేను వార్తాపత్రికను మూసివేస్తానుఅని ఆయన చేసిన సంపాదకీయ ప్రకటనను శ్రీ మోదీ ఉదహరించారుఎమర్జెన్సీ సమయంలోదేశాన్ని మరోసారి బానిసత్వంలోకి నెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడురామనాథ్ గారు దృఢంగా నిలబడ్డారని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ సంవత్సరంతో ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తు చేస్తూఅప్పుడు ఖాళీ సంపాదకీయాలతో కూడా ప్రజలను బానిసలుగా చేయాలనుకున్న ఆలోచనను సవాలు చేయగలదని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్నిరూపించిందని ఆయన తెలిపారు.

బానిసత్వ మనస్తత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేసే అంశంపై తాను వివరంగా మాట్లాడతానని ప్రధానమంత్రి తెలిపారుదీనికి 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందు, 190 సంవత్సరాల వెనుకకుఅంటే 1835 సంవత్సరానికి వెళ్లాలని ఆయన అన్నారుఆ సమయంలోనే బ్రిటిష్ ఎంపీ థామస్ బాబింగ్టన్ మెకాలే భారతదేశాన్ని దాని సాంస్కృతిక పునాదుల నుంచి పెకలించడానికి ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించారని ఆయన చెప్పారుభారతీయులుగా కనిపిస్తూ బ్రిటిష్ వారిలా ఆలోచించే భారతీయులను సృష్టించడమే తన ఉద్దేశమని మెకాలే ప్రకటించారనిఇందుకోసం ఆయన భారత విద్యా వ్యవస్థను కేవలం మార్చడమే కాకుండా దానిని పూర్తిగా నాశనం చేశారని తెలిపారు

భారతదేశ ప్రాచీన విద్యావ్యవస్థ ఒక అందమైన వృక్షమనిదానిని పెకలించి నాశనం చేశారని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ప్రధానమంత్రి ఉటంకించారుభారతదేశ సంప్రదాయ విద్యావ్యవస్థ సంస్కృతి పట్ల గర్వాన్నిచ్చిందనీవిద్యకునైపుణ్యాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చిందనీ అంటూఅయితే మెకాలే దానిని నిర్మూలించడానికి ప్రయత్నించారని,  అందులో విజయం కూడా సాధించారని శ్రీ మోదీ పేర్కొన్నారుఆ కాలంలో బ్రిటిష్ భాషకుఆలోచనకు ఎక్కువ గుర్తింపు లభించేలా మెకాలే చూశారనితదనంతర శతాబ్దాలలో భారతదేశం దీనికి మూల్యం చెల్లించిందని ఆయన తెలిపారుమెకాలే భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేశారనిన్యూనతా భావాన్ని నింపివేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారుఒకే దెబ్బతోఆయన వేల సంవత్సరాల భారతదేశ జ్ఞానాన్నివిజ్ఞానాన్నికళనుసంస్కృతినిమొత్తం జీవన విధానాన్ని పక్కన పెట్టారని ఆయన అన్నారు.

విదేశీ పద్ధతుల ద్వారా మాత్రమే పురోగతిగొప్పతనాన్ని సాధించగలమనే నమ్మకానికి బీజాలు నాటిన క్షణం ఆదేనని చెబుతూఈ మనస్తత్వం స్వాతంత్ర్యం తరువాత మరింత బలపడిందని శ్రీ మోదీ అన్నారుభారతదేశ విద్యఆర్థిక వ్యవస్థసామాజిక ఆకాంక్షలు విదేశీ నమూనాలకు మరింత అనుగుణంగా మారాయని ఆయన తెలిపారుదేశీయ వ్యవస్థలపై గౌరవం తగ్గిపోయిందనిమహాత్మాగాంధీ వేసిన స్వదేశీ పునాది చాలా వరకు మరుగునపడిందని ప్రధానమంత్రి అన్నారుపాలనా నమూనాలను విదేశాలలో అన్వేషించడం ప్రారంభమైందనిఆవిష్కరణల కోసం విదేశాల వైపు చూశారని ఆయన పేర్కొన్నారుఈ మనస్తత్వం దిగుమతి చేసుకున్న ఆలోచనలువస్తువులుసేవలను ఉన్నతంగా పరిగణించే సామాజిక ధోరణికి దారితీసిందని ఆయన తెలిపారు.

ఒక దేశం తనను తాను గౌరవించుకోనప్పుడు... అది మేడ్ ఇన్ ఇండియా తయారీ వ్యవస్థతో సహా దాని దేశీయ సహజ వ్యవస్థను కూడా తిరస్కరిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుపర్యాటకాన్ని ఒక ఉదాహరణగా పేర్కొంటూపర్యాటకం అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూప్రజలు తమ చారిత్రక వారసత్వం పట్ల గర్వపడుతున్నారని,  దీనికి విరుద్ధంగాస్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో తమ సొంత వారసత్వాన్ని తిరస్కరించే ప్రయత్నాలు జరిగాయని ఆయన పేర్కొన్నారువారసత్వంపై గర్వం లేకపోతేదానిని సంరక్షించాలనే  ఉద్దేశం కూడా ఉండదనిసంరక్షణ లేకపోతేఅలాంటి వారసత్వం కేవలం ఇటుకరాతి శిథిలాలకే  పరిమితం అవుతుందని ఆయన పేర్కొన్నారువారసత్వాన్ని చూసి గర్వపడటం పర్యాటక రంగం వృద్ధికి తప్పనిసరని ఆయన ఉద్ఘాటించారు.

స్థానిక భాషల అంశాన్ని ప్రస్తావిస్తూమరే దేశమైనా తన సొంత భాషలను అవమానిస్తోందా అని ప్రధానమంత్రి ప్రశ్నించారుజపాన్చైనాదక్షిణ కొరియా వంటి దేశాలు అనేక పాశ్చాత్య పద్ధతులను అవలంబించినప్పటికీతమ మాతృభాషలపై ఎప్పుడూ రాజీ పడలేదని ఆయన గుర్తు చేశారుఅందుకే కొత్త జాతీయ విద్యా విధానం స్థానిక భాషలలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారుతమ ప్రభుత్వం ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదనికానీ భారతీయ భాషలకు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు

భారతదేశ సాంస్కృతికవిద్యా పునాదులకు వ్యతిరేకంగా మెకాలే చేసిన నేరానికి 2035 నాటికి 200 సంవత్సరాలు పూర్తవుతాయని అంటూవచ్చే పదేళ్లలో మెకాలే నింపిన బానిసత్వ ఆలోచన నుంచి ముక్తి పొందడానికి దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారుమెకాలే ప్రవేశపెట్టిన దుర్మార్గాలనుసామాజిక బాధలను రాబోయే దశాబ్దంలో పూర్తిగా నిర్మూలించాలని  ఆయన ఉద్ఘాటించారు.  

అనేక ముఖ్యమైన అంశాలను చర్చించినందున ఇక ఎక్కువ సమయాన్ని తీసుకోనని ప్రధాని అన్నారుదేశంలో ప్రతి మార్పునకు అభివృద్ధి కథకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సాక్షిగా ఉందని ఆయన అభినందించారు. ‘అభివృద్ధి చెందిన దేశం‘ లక్ష్య సాధన దిశగా  భారత్ ప్రయాణంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్  భాగస్వామ్యాన్ని స్వాగతించారురామనాథ్ గోయెంకా ఆదర్శాలను పరిరక్షించడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నందుకు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారుఈ కార్యక్రమం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు

 

 

***

MJPS/SR


(Release ID: 2191215) Visitor Counter : 5