ఆయుష్
azadi ka amrit mahotsav

డయాబెటిస్ సంపూర్ణ నిర్వహణపై బెంగళూరులోని కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం: రేపు ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా నిర్వహణ

Posted On: 13 NOV 2025 3:33PM by PIB Hyderabad

ముధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్)లో కేంద్ర ఆయుష్ శాఖ గుర్తింపు పొందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈఅయిన బెంగళూరులోని కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీఏఆర్ఐ).. 2025 నవంబర్ 14న ‘మధుమేహ విమర్శ’ శీర్షికన ప్రపంచ డయాబెటిస్ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందిమధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్కోసం పరిశోధనక్లినికల్ సేవల్లో సంస్థ ప్రస్తుత పరిశోధనచికిత్సాపరమైన పనులుప్రజలకు చేరువయ్యేలా చేపట్టిన చర్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తారు.

ఆయుర్వేదంయోగాజీవనశైలి అంశాల ద్వారా డయాబెటిస్ నివారణనిర్వహణ కోసం సమగ్ర విధాన అభివృద్ధిఅమలుపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 6,000 మంది రోగులు సంస్థలో సేవలను పొందారువారిలో 25 శాతం కన్నా ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్వారే.

చికిత్సాపరమైన సంరక్షణతోపాటు.. డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఈ కేంద్రం ప్రజలకు మరింత సమర్థంగా చేరువవుతోంది-మెడికల్ రికార్డులుటెలికన్సల్టేషన్లుఎస్ఎంఎస్ అలర్టులువెబ్‌సైట్ (www.cari.gov.in)సామాజిక మాధ్యమ వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తోంది.

మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేయడం కోసం ఓ ‘మెషీన్ లెర్నింగ్’ ఆధారిత అంచనా వ్యవస్థను కూడా ఈ కేంద్రం అభివృద్ధి చేసిందిదీనికి ప్రస్తుతం కాపీరైట్ హక్కులు కూడా లభించాయిప్రస్తుతం ఈ వ్యవస్థను ఓ వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను ఉపయోగించి ధ్రువీకరిస్తున్నారువ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మరింత సమర్థంగా పర్యవేక్షించుకోవడానికి వీలుగా మొబైల్ యాప్‌గా దీనిని అభివృద్ధి చేస్తారు.

కార్యక్రమానికి ముందు సీఏఆర్ఐ ఇన్చార్జి డాక్టర్ సులోచనా భట్ మాట్లాడుతూ.. సాంప్రదాయక వైద్య పరిజ్ఞానాన్ని శాస్త్రీయ పరిశోధనతో మేళవించి.. ప్రామాణికంగా మధుమేహ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాంప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ‘సమగ్ర ఆరోగ్య సంరక్షణ’ ఎలా చేయూతనిస్తుందోవారి జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో ఈ కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి” అన్నారు.

ఎంపిక చేసిన ఆహార ఉత్పత్తులుఆయుర్వేద సూత్రీకరణలపై సీఎస్ఐఆర్-సీఎఫ్‌టీఆర్ఐమైసూరుఐఐఎస్సీ- బెంగళూరుతో సహకార అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మధుమేహం నివారణనిర్వహణ కోసం అభివృద్ధి చేసిన సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ప్రచురణకు సిద్ధంగా ఉందిఅదేవిధంగా ప్రకృతిడయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతీపై ఓ అధ్యయనం కూడా ప్రచురణలో ఉంది.

రేపటి కార్యక్రమంలో ‘మధుమేహ సంపూర్ణ నిర్వహణ’తదితర అంశాలపై రమియా ఇండిక్ స్పెషాలిటీ ఆయుర్వేద రీస్టోరేషన్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్జి.జిగంగాధరన్ ప్రసంగిస్తారు.

డయాబెటిస్ వంటి జీవనశైలి సంబంధిత రుగ్మతల నిర్వహణ కోసం సుస్థిరసమ్మిళితప్రామాణిక వ్యూహాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో పరిశోధనచికిత్సాపరమైన కార్యక్రమాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది.  

 

***


(Release ID: 2189753) Visitor Counter : 2