కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక పురోగతిని సామాజిక అభివృద్ధితో ఏకం చేస్తున్న భారత్: డాక్టర్ మాండవీయ


డిజిటల్ ఆవిష్కరణను ఆర్థిక సమ్మిళితత్వంతో జోడించటం ద్వారా కోట్లాది మంది పౌరులకు సాధికారత కల్పించవచ్చని నిరూపించిన భారత్: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు 1.4 బిలియన్లకు పైగా పౌరులకు సంక్షేమ ప్రయోజనాలను అందేలా చేశాయన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి

ఖతార్ లోని దోహలో జరిగిన రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు మొదటి రోజున ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

దోహలో మారిషస్, యూఎన్ఈఎస్ సీఏపీతో ద్వైపాక్షిక సమావేశాల ద్వారా ప్రపంచ భాగస్వామ్యాలను బలపరచుకుంటున్న భారత్

Posted On: 04 NOV 2025 6:59PM by PIB Hyderabad

కేంద్ర కార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఖతార్‌లోని దోహలో జరిగిన రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సు ప్లీనరీ ప్రారంభ సమావేశానికి ఇవాళ హాజరయ్యారుఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి 180 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారుకార్మిక రంగంలో సహకారాన్ని పెంపొందించటంసామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించటంభారత డిజిటల్మానవ వనరుల విజయాలను ప్రపంచస్థాయిలో ప్రదర్శించటం వంటివి ఇవాళ జరిగిన ద్వైపాక్షికబహుళపాక్షిక చర్చల లక్ష్యం.

 

"సామాజికాభివృద్ధికి మూడు స్తంభాలైన పేదరిక నిర్మూలనఅందరికీ సంపూర్ణఉత్పాదక ఉపాధిగౌరవప్రదమైన పనిసామాజిక సమ్మిళిత్వాన్ని బలోపేతం చేయటం” అనే అంశంపై ఉన్నత-స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చేసిన ప్రసంగంలో భారత్ అధిక వృద్ధినిసమ్మిళితత్వంతో ఏకం చేయడాన్ని కేంద్ర కార్మిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "డిజిటల్ ఆవిష్కరణను ఆర్థిక సమ్మిళితత్వంతో జోడించటం ద్వారా కోట్లాది మంది పౌరులకు సాధికారత కల్పించవచ్చని భారత్ నిరూపించిందిఅని కేంద్రమంత్రి అన్నారు.

సామాజికాభివృద్ధికి సంబంధించిన మూడు స్తంభాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రస్తావించారు. 2016-17, 2023-24 మధ్య 170 మిలియన్లకు పైగా నూతన ఉద్యోగాలు కల్పించామనిమహిళల ఉపాధి భాగస్వామ్యం రెట్టింపైందని, 6 నుంచి 3.2 శాతానికి నిరుద్యోగం తగ్గిందని ఆయన తెలిపారుకార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా సరళీకరించారనియూనివర్సల్ పెన్షన్ కవరేజీ దిశగా భారత్ పురోగమిస్తుందని చెప్పారుభారత డిజిటల్ మౌలిక సదుపాయాలు 1.4 బిలియన్లకు పైగా పౌరులకు సంక్షేమ ప్రయోజనాలను అందేలా చేశాయన్నారు.

"ఈ ప్రయత్నాల ఫలితంగా 2015లో భారత్ లో 19% ఉన్న సామాజిక భద్రతా పథకాల పరిధి, 2025 నాటికి 64.3 శాతానికి పెరిగిందిఈ విషయాన్ని గుర్తించిన అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం ఈ ఏడాదికి గానూ సామాజిక భద్రతలో అత్యుత్తమ అవార్డును భారత్ కు అందించిందివేగంగాసమ్మిళిత అభివృద్ధి వల్ల సమాజంలో మార్పు వస్తుందని భారత్ నిరూపించిందిఆర్థిక ప్రగతిని సామాజిక అభివృద్ధికి జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నాంఅని మాండవీయ తెలిపారు.

మారిషస్ కార్మిక మంత్రిని కలిసిన డాక్టర్ మాండవీయ.. నైపుణ్యాభివృద్ధికార్మికుల వలసడిజిటల్ కార్మిక వేదికలుసామాజిక భద్రత రంగాల్లో సహకార విస్తరణపై విస్తృత స్థాయి చర్చలు జరిపారుమారిషస్ తో భారత్ కున్న ప్రత్యేక చారిత్రక సంబంధాల్ని స్పష్టం చేసిన మాండవీయ.. సాంకేతికవృత్తి విద్యశిక్షణలో(టీవీఈటీసామర్థ్య పెంపునకు మద్దతిచ్చేందుకు భారత్ సంసిద్ధతను వ్యక్తపరిచారుకార్మిక వ్యవస్థలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ నిర్మాణంలో భారత విజయాన్ని డాక్టర్ మాండవీయ వివరించారువాటిలో నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్ సీఎస్పోర్టల్-శ్రమ్ డాటాబేస్ ముఖ్యమైనవిప్రతిభావంతులను గుర్తించిసహకరించటానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలని మారిషస్ ను కేంద్రమంత్రి ప్రోత్సహించారుసామాజిక భద్రతా పరిధిని 2015లో 19% నుంచి 2025 నాటికి 64.3%కు పెంచడంలో భారతదేశం సాధించిన విజయాన్ని అభినందించారు.

యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యూఎన్ఈఎస్ సీఏపీకార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి ఆర్మిడా సల్సియా అలిస్జాబానాతో డాక్టర్ మాండవీయ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా సభ్య దేశంగా ఈఎస్ సీఏపీతో భారత్ కున్న దీర్ఘకాల అనుబంధాన్నివిపత్తు నిర్వహణనైపుణ్యాలను గుర్తించటండిజిటల్ సంక్షేమ సేవల్లో ప్రాంతీయ సహకారానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు.

దశాబ్ద కాలంగాపాలనాపరమైన అంశాల్లో డిజిటల్ సంస్కరణలుడైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ వ్యవస్థలుసామాజిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా 250 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావటంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందని వెల్లడించారు.

సామాజిక భద్రతఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించటంలో భారత్ సాధించిన పురోగతిని ఈఎస్ సీఏపీ ప్రశంసించిందిగ్రీన్డిజిటల్కేర్ ఎకానమీ రంగాల్లో విస్తృత స్థాయిలో నైపుణ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈఎస్ సీఏపీతో సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ తెలిపింది.

ఇవాళ భారత్ చేపట్టిన కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యాలు బలోపేతం అయ్యాయియూఎన్ఈఎస్ సీఏపీతో సహకారాన్ని పెంచాయిడిజిటల్ సామాజిక భద్రతనైపుణ్యాలుసమ్మిళిత కార్మిక మార్కెట్ల విషయంలో ప్రపంచస్థాయిలో భారత నాయకత్వ ధోరణిని పటిష్టం చేశాయి.

నేపథ్యం:

2025లో 78/261, 78/318 తీర్మానాల ద్వారా "రెండో ప్రపంచ సామాజికభివృద్ధి సదస్సుఅనే శీర్షికతో "ప్రపంచ సామాజిక సదస్సు"ను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించిందిరాజ్యప్రభుత్వాధినేతల స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సు.. కోపెన్‌హాగన్ సామాజిక అభివృద్ధి ప్రకటనదాని కార్యాచరణ అమలులోని లోపాలను సరిదిద్దటంవాటికి కట్టుబడి ఉండటాన్ని తెలియచేయటమే లక్ష్యంగా, 2030 అజెండా అమలుకు వేగం పెంచటం ఈ సదస్సు ఉద్దేశంనవంబర్ నుంచి 6వ తేదీ వరకు ఖతార్ లోని దోహలో ఈ సదస్సు జరుగుతుంది.

రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశమనేది ఒక బహిరంగ చర్చా వేదికప్రపంచ వ్యవస్థాగత పోకడలుకోపెన్‌హాగన్ ఒప్పందంలోని మూడు కీలక లక్ష్యాలపై ఆ మార్పుల ప్రభావాలను పరిగణలోకి తీసుకునిసామాజిక అభివృద్ధిని వేగవంతం చేసే సమగ్ర పనులను గుర్తించడానికి ఈ సమావేశం కృషి చేస్తుంది.

 

***

 

(Release ID: 2186789) Visitor Counter : 5