ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
Posted On:
01 NOV 2025 2:27PM by PIB Hyderabad
ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రామ్దరశ్ మిశ్రా జీ మరణం హిందీ, భోజ్పురి సాహిత్య రంగానికి తీరని లోటని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి అన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రాందరశ్ మిశ్రా మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన మరణం హిందీ, భోజ్పురి సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!"
***
(Release ID: 2185521)
Visitor Counter : 4
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam