రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కౌలాలంపూర్లో జరిగే 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం - ప్లస్‌కు హాజరు కానున్న రక్షణ మంత్రి

Posted On: 29 OCT 2025 10:05AM by PIB Hyderabad

మలేషియాలోని కౌలాలంపూర్లో 2025, నవంబర్ 1న జరిగే 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ (ఏడీఎంఎం ప్లస్)కు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ హాజరవుతారు. ‘‘ఏడీఎంఎం-ప్లస్ 15 ఏళ్ల ప్రయాణం అవలోకనం.. ముందుకు సాగాల్సిన మార్గాన్ని రూపొందించడం’’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో ఆయన ప్రసంగిస్తారుఅలాగే మలేషియా అధ్యక్షతన జరిగే ఆసియాన్-ఇండియా రక్షణ మంత్రుల అనధికార సమావేశం రెండో సంచికలో పాల్గొంటారుఈ సమావేశంలో ఆసియాన్ సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటారుఆసియాన్ సభ్యదేశాలుభారత్ మధ్య రక్షణభద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ‘యాక్ట్ ఈస్ట్ విధానాన్ని’ ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం లక్ష్యం.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడీఎంఎం-ప్లస్ దేశాల రక్షణ మంత్రులుమలేషియా అగ్ర నాయకులతో రక్షణ మంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఆసియాన్‌ (ఆగ్నేయాసియా దేశాల సంఘంలో అత్యున్నత స్థాయి రక్షణ సలహాసహకార యంత్రాంగమే ఏడీఎంఎంఆసియాన్ సభ్యదేశాలు (బ్రూనైకాంబోడియాఇండోనేషియాలావో పీడీఆర్మలేషియామయన్మార్ఫిలిప్పీన్స్సింగపూర్థాయ్‌లాండ్తైమూర్ లెస్ట్వియత్నాంతో పాటుగా.. దాని ఎనిమిది చర్చా భాగస్వాములు (భారత్యూఎస్చైనారష్యాజపాన్దక్షిణ కొరియాఆస్ట్రేలియాన్యూజిలాండ్మధ్య రక్షణభద్రతా సహకారాన్ని బలోపేతం చేసే వేదికగా ఏడీఎంఎం-ప్లస్ పనిచేస్తుంది.

భారత్ 1992లో ఆసియాన్ చర్చల భాగస్వామిగా మారిందిఏడీఎంఎం-ప్లస్ తొలి సమావేశం వియత్నాంలోని హనోయ్‌లో 2010 అక్టోబర్ 12న జరిగింది. 2017 నుంచి ఆసియాన్చర్చా భాగస్వామ్య దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు ఏటా ఏడీఎంఎం-ప్లస్ నిర్వహిస్తున్నారు.

ఏడీఎంఎం-ప్లస్ నియమాల ప్రకారం 2024-2027 కాలానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి మలేషియాతో కలసి భారత్ సహ-అధ్యక్షత వహిస్తోందిఆసియాన్-భారత్ నౌకాదళ విన్యాసాల రెండో సంచిక 2026లో జరగనుంది.

 

***


(Release ID: 2183729) Visitor Counter : 5