ప్రధాన మంత్రి కార్యాలయం
ఛఠ్ పూజలోని పవిత్ర ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
Posted On:
26 OCT 2025 10:04AM by PIB Hyderabad
ఛఠ్ మహాపర్వంలో భాగంగా చేసుకునే 'ఖర్నా' పూజ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పండగలో కఠోర ఉపవాసాలు, ఆచారాలను పాటించే వారందరికీ గౌరవప్రదంగా నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
ఛఠీ మాతకు సంబంధించిన భక్తీ గీతాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు:
“మీ అందరికీ ఛఠ్ మహాపర్వంలోని ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలు. వ్రతం చేస్తోన్న భక్తులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం. ఈ పవిత్రమైన సందర్భంలో బెల్లంతో చేసిన పాయసంతో పాటు సాత్విక ప్రసాదాన్ని స్వీకరించే సంప్రదాయం ఉంది. ఇది శ్రద్ధ, సంయమనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పవిత్ర పూజ సందర్భంగా ఛఠీ మాత ప్రతి ఒక్కరికీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.”
https://www.youtube.com/watch?v=mOTEaLwwKK0
https://m.youtube.com/watch?v=fwX2g9jjo1o&pp=0gcJCR4Bo7VqN5tD”
(Release ID: 2182738)
Visitor Counter : 3
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam