ఉప రాష్ట్రపతి సచివాలయం
పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సచివాలయంలో వివిధ విభాగాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్
Posted On:
21 OCT 2025 4:27PM by PIB Hyderabad
పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సచివాలయంలో వివిధ విభాగాలను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు సందర్శించారు. టేబుల్ ఆఫీస్, న్యాయ విభాగం, ప్రశ్నల విభాగం, సభ్యుల జీతభత్యాల విభాగం, సభ్యుల సౌకర్యాల విభాగం, బిల్లు కార్యాలయం, నోటీసు కార్యాలయం, లాబీ కార్యాలయం, రిపోర్టర్ల విభాగం లాంటి కీలక విభాగాలను సందర్శించారు.
తన సందర్శనలో భాగంగా.. సచివాలయ అధికారులు, సిబ్బందితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ముచ్చటించారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ సజావుగా, సమర్థవంతంగా సాగడంలో వారు పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.
అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధతతో అధికారులూ, సిబ్బంది పనిచేయాలని, పార్లమెంట్ నిర్వహణను బలోపేతం చేయాలని, దేశసేవ పట్ల చిత్తశుద్ధితో ఉండాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ సూచించారు.
***
(Release ID: 2181398)
Visitor Counter : 5