ఉప రాష్ట్రపతి సచివాలయం
కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్కు వివరించిన మంత్రులు
అనుసంధానం, ఆవిష్కరణ, ప్రాంతీయ వృద్ధిలో మంత్రిత్వ శాఖల కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి
బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ, పోస్టల్ సంస్కరణలను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
ఈశాన్య ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
16 OCT 2025 5:12PM by PIB Hyderabad
కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈ రోజు పార్లమెంట్ హౌస్లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ను కలిశారు. సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ కూడా ఆయన వెంట ఉన్నారు.
కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రధాన కార్యక్రమాలు, విజయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వారు ఉపరాష్ట్రపతికి వివరించారు.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న టెలికాం, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల గురించి, అందరికీ కనెక్టివిటీని, తక్కువ ధరకు డేటా సేవలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారు శ్రీ రాధాకృష్ణన్కు వివరించారు. ఈ ప్రయత్నాలు భారతదేశ డిజిటల్ మార్పునకు దోహదపడుతున్నాయని తెలిపారు.
విస్తృత తపాలా వ్యవస్థ గురించి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో సహా వినూత్న ప్రాజెక్టుల ద్వారా దాని విస్తృతమైన పరిధిని వినియోగించుకోవడానికి మంత్రిత్వ శాఖ చేపడుతున్న ప్రయత్నాల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు. బీఎస్ఎన్ఎల్ సేవల పునరుద్ధరణను, పోస్టల్ శాఖ చేపట్టిన కొత్త కార్యక్రమాలను శ్రీ రాధాకృష్ణన్ ప్రశంసించారు, స్పీడ్ పోస్ట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడాన్ని అభినందించారు.
బడ్జెట్ కేటాయింపుల పెంపు, రైలు, రహదారి కనెక్టివిటీ విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, ఈశాన్య ప్రాంత పెట్టుబడుల కోసం శిఖరాగ్ర సమావేశాల నిర్వహణ, ప్రైవేట్ పెట్టుబడుల పెంపు, ఈ ప్రాంత జలవిద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో సహా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుండటం, కొత్త అవకాశాలు ఏర్పడటం, మొత్తం భద్రతా పరిస్థితి మెరుగుపడటం పట్ల శ్రీ రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2180103)
आगंतुक पटल : 24