ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2025 7:42AM by PIB Hyderabad

మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారుఆయన సమగ్రతవినయంనిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు.

 

దేశ చరిత్రలోని కీలక సమయాల్లో జాతీయ స్వభావాన్ని రూపొందించడంలో శాస్త్రి గారు పోషించిన కీలక పాత్రను ప్రధానమంత్రి ప్రస్తావించారుఆయన ఇచ్చిన ప్రతిష్ఠాత్మక నినాదం ‘జై జవాన్ జై కిసాన్’.. సైనికులురైతుల పట్ల భారత్ చూపే నిబద్ధతకు శక్తిమంతమైన చిహ్నంగా మిగిలిపోయిందని అన్నారు.

 

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంనాయకత్వం.. స్వావలంబన కలిగిన బలమైన దేశం కోసం చేస్తోన్న సమష్టి కృషిలో తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉందని మోదీ వ్యాఖ్యానించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

 

"శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అసాధారణ రాజనీతిజ్ఞులుఆయన సమగ్రతవినయందృఢ సంకల్పం భారత్‌ను బలోపేతం చేశాయి.. సవాళ్లున్న సమయాల్లో కూడా దేశం బలోపేతమైందిఆదర్శప్రాయమైన నాయకత్వంమనోబలంనిర్ణయాత్మక పనులకు ఆయన ప్రతీక. 'జై జవాన్ జై కిసాన్అంటూ ఆయన అందించిన నినాదం మనందరిలో దేశభక్తిని రగిలించిందిస్వావలంబన కలిగిన బలమైన భారతదేశాన్ని తయారు చేసే ప్రయాణంలో ఆయన మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు."


(రిలీజ్ ఐడి: 2174127) సందర్శకుల సూచీ సంఖ్య : : 31