బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్యనిర్వాహకేతర కార్మికులకు వారి పనితీరు ఆధారంగా రూ.1,03,000 ప్రతిఫలాన్ని ప్రకటించిన ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు

Posted On: 26 SEP 2025 9:28AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వశాఖ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యనిర్వాహకేతర కార్మికులకు వారి పనితీరు ఆధారంగా రూ.1,03,000 చొప్పున ప్రతిఫలాన్ని (పీఎల్‌ఆర్ఈ రోజు ప్రకటించాయిఈ ప్రోత్సాహకాన్ని నిన్న బొగ్గు పరిశ్రమ సంయుక్త ద్వైపాక్షిక సంఘానికి చెందిన ప్రామాణీకరణ కమిటీ ఆరో సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రకటించారుకోల్ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్)కి చెందిన దాదాపు 2.1 లక్షల కార్యనిర్వాహకేతర ఉద్యోగులూసీఐఎల్ అనుబంధ సంస్థల ఉద్యోగులతోపాటు ఎస్‌సీసీఎల్‌కు చెందిన దాదాపు 38,000 కార్యనిర్వాహకేతర ఉద్యోగులకూ ప్రయోజనం కలుగుతుందిపని దినాల ఆధారంగా దామాషా ప్రాతిపదికన ఈ నగదును అందిస్తారుఈ పీఎల్ఆర్ వల్ల సీఐఎల్‌పై రూ.2153.82 కోట్లుఎస్‌సీసీఎల్‌పై రూ.380 కోట్ల ఆర్థిక భారం పడుతుంది.

సీఐఎల్దాని అనుబంధ సంస్థల్లోని కార్యనిర్వాహకేతర కార్మికుల శ్రమనూసేవలనూ గుర్తించడంతో పాటు వారి కృషికి తగ్గ పురస్కారాన్ని అందించడం పీఎల్ఆర్ ఉద్దేశంపీఎల్ఆర్ చెల్లింపుతో పండగల కాలంలో కార్మికులకూవారి కుటుంబాలకూ కాలానుగుణ ప్రోత్సాహం అందజేసినట్లవుతుంది.

పనితీరుతో ముడిపెట్టిన ప్రతిఫలం కార్మికుల సంక్షేమంస్ఫూర్తిగుత్తేదారుల సేవలను గుర్తించాలన్న బొగ్గు శాఖ నిబద్ధతను సూచిస్తోందికార్యనిర్వాహకేతర కార్మికుల నడుమ ఉత్పాదకతనూమనోబలాన్నీఉద్యోగ సంతృప్తినీ పెంచడమే పీఎల్ఆర్‌ ఉద్దేశంప్రభుత్వ రంగ గని కార్యకలాపాల్లో ఈ కార్మికులు ముఖ్య పాత్రను పోషించడమే కాకస్వావలంబనయుక్త భారత్‌ను ఆవిష్కరించడంలోనూ చెప్పుకోదగ్గ తోడ్పాటును అందిస్తున్నారు.

 

***


(Release ID: 2171969) Visitor Counter : 6