ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 25న న్యూఢిల్లీ భారత మండపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
వరల్డ్ ఫుడ్ ఇండియా వాణిజ్య ప్రదర్శన మాత్రమే కాదు...
ఆహార ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్థిరత్వంలో భారత్ ను ప్రపంచ స్థాయిలో నిలిపే వేదిక: చిరాగ్ పాశ్వాన్
Posted On:
23 SEP 2025 12:34PM by PIB Hyderabad
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 నాలుగో ఎడిషన్ను 2025 సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ఈ ప్రపంచ స్థాయి ఆహార మహాసభ 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుంది. ఇందులో 21 కంటే ఎక్కువ దేశాలు, 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 5 అనుబంధ ప్రభుత్వ సంస్థలు పాల్గొననున్నాయి. ఇది దేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగానికి చెందిన భాగస్వాములందరీ ఏకతాటిపైకి తీసుకురానుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 25న సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రారంభ సమావేశంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధానమంత్రి శ్రీ దిమిత్రి పత్రుషేవ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్, ఆహార శుద్ది పరిశ్రమలు, రైల్వే శాఖల సహాయ మంత్రి శ్రీ రవ్నీత్ సింగ్ బిట్టు పాల్గొననున్నారు.
ఈ సదస్సుపై ఆహార శుద్ది పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ.. ‘ "వరల్డ్ ఫుడ్ ఇండియా కేవలం ఒక వాణిజ్య ప్రదర్శన మాత్రమే కాదు. ఆహార ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్థిరత్వానికి సంబంధించి దేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలిపేందుకు నిర్వహించే ఓ వేదిక. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరగబోతున్న ఈ కార్యక్రమం స్థిరమైన, సమ్మిళిత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆహార వ్యవస్థలపై మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది ప్రపంచానికి ఆహారాన్ని అందించడంలోదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ముఖ్యాంశాలు
· భాగస్వామ్య దేశాలు: న్యూజిలాండ్, సౌదీ అరేబియా
· కేంద్రీకృత దేశాలు: జపాన్, రష్యా, యూఏఈ, వియత్నాం
· భాగస్వామ్యం, ప్రాతినిధ్యం: 1700కిపైగా ప్రదర్శకులు, 500కిపైగా అంతర్జాతీయ కొనుగోలు దారులు, 100 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు
· విజ్ఞాన సమావేశాలు: 45 కంటే ఎక్కువ అంశాల ఆధారిత సెషన్లు, రాష్ట్రాలు, దేశాల ప్రత్యేక సమావేశాలు, 100కిపైగా ప్రపంచ వ్యవసాయ ఆహార నాయకులతో నేపథ్య చర్చలు
సమాంతర కార్యక్రమాలు :
-
3వ ప్రపంచ ఆహార నియంత్రణ సంస్థల సదస్సు: ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల సమన్వయానికి దోహదం.
-
24వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో: భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల సామర్ధ్యం బలోపేతం.
-
రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్: 1000కిపైగా అంతర్జాతీయ కొనుగోలు దారుల పాల్గొనబోయే వేదిక.
-
అంతర్జాతీయ స్టాళ్లు, రాష్ట్ర మంత్రిత్వ శాఖల స్టాళ్లు, జంతు ఆహార స్టాళ్లు, సాంకేతిక స్టాళ్లు, అంకుర సంస్థల ఆవిష్కరణల స్టాళ్లు
అయిదు ప్రధాన అంశాల చుట్టూ ఈ ఏడాది ఎడిషన్ కు రూపకల్పన.
1. స్థిరత్వం, పర్యావరణ అనుకూల ఆహార శుద్ధి.
2. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ కేంద్రంగా భారత్
3. ఆహార శుద్ధి, ఉత్పత్తులు, ప్యాకేజింగ్ సాంకేతికతలలో నూతన ఒరవడి
4. పోషకాహారం, ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆహారం.
5. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే పశుసంపద, సముద్ర ఉత్పత్తులు
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సందర్భంగా “ఆహార శుద్ధిలో వివిధ అంశాలపై తరచూ అడిగే ప్రశ్నలు” పుస్తకాన్ని శ్రీ చిరాగ్ పాస్వాన్ ప్రారంభించారు. పరిశ్రమ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా రూపొందించిన ఈ పుస్తకం ప్రాసెస్డ్ ఫుడ్స్ చుట్టూ ఉన్న అపోహలను తొలగించేందుకు, విజ్ఞాన ఆధారిత సమాచారం ద్వారా వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు దోహదపడుతుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటంలో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఏపీఈడీఏ, ఎంపీఈడీఏ, కమోడిటీ బోర్డులు వంటి వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించిన సహకారాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ గుర్తించింది.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 దేశ ఆహార శుద్ధి రంగంలో చేసిన నమోదైన ప్రగతిని ప్రదర్శించడమే కాకుండా, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలను పెంపొందించే ఓ మహోత్తర కార్యక్రమంగా నిలవనుంది.
***
(Release ID: 2170548)
Visitor Counter : 8