ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ ఫుడ్ ఇండియా-2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ఆహార రంగానికి సంబంధించిన ప్రపంచ స్థాయి భారీ కార్యక్రమం... ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’

Posted On: 12 SEP 2025 6:48PM by PIB Hyderabad

ఆహార రంగానికి సంబంధించిన ప్రపంచ స్థాయి భారీ కార్యక్రమం అయిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2025ను (డబ్ల్యూఎఫ్ఐప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న సాయంత్రం 6:00 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించనున్నారుడబ్ల్యూఎఫ్ఐలో 4వ ఎడిషన్ అయిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ కూడా హాజరుకానున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐనిర్వహిస్తోన్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 సెప్టెంబర్ 25న ప్రారంభమైసెప్టెంబర్ 28 వరకు కొనసాగనుందిఆహార శుద్ధి రంగానికి ఉన్న పరివర్తన సామర్థ్యాన్ని గుర్తించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి కార్యక్రమం ఆహార శుద్ధి వాణిజ్య కార్యకలాపాల్లో భాగస్వామ్యాలుఆవిష్కరణపెట్టుబడులను ప్రోత్సహిచంటం ద్వారా "ప్రపంచ ఆహార కేంద్రంగాభారత్ స్థానాన్ని నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఇంతకు ముందు నిర్వహించిన డబ్ల్యూఎఫ్ఐ కార్యక్రమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయిదీని ఆధారంగా చేసుకొని వరల్డ్ ఫుడ్ ఇండియా నాలుగో ఎడిషన్ ఒక ప్రధాన అంతర్జాతీయ వేదికగా మారిందివేగంగా వృద్ధి చెందుతోన్న భారత్‌ ఆహార శుద్ధి వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకుఅవకాశాలను అందిపుచ్చుకునేందుకుభాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు.. విధాన నిర్ణేతలుపరిశ్రమ నాయకులువ్యవస్థాపకులుపెట్టుబడిదారులుపరిశోధకులుఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురానుందిపెద్ద సంఖ్యలో దేశీయఅంతర్జాతీయ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయనే అంచనా ఉందిప్రపంచ ఆహార రంగానికి సంబంధించిన వ్యవస్థ‌కు చెందిన అత్యంత సమగ్ర ప్రదర్శన కార్యక్రమాల్లో ఇది ఒకటి.

 

ఈ సంవత్సరం న్యూజిలాండ్సౌదీ అరేబియా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయిజపాన్యూఏఈవియత్నాంరష్యా ముఖ్య దేశాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయిఈ దేశాల భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటమే కాకుండా విజ్ఞాన మార్పిడిని పెంచుతుందిదీనితో పాటు ఆహార శుద్ధి రంగంలో వాణిజ్యంపెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

 

ప్రపంచ ఆహార శుద్ధి రంగంలోని మేధావులువిధాన నిర్ణేతలుపరిశ్రమ నిపుణులతో ఉన్నత స్థాయి వైజ్ఞానిక చర్చలుప్యానెల్ చర్చలను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారుతాజా ఆవిష్కరణలుసాంకేతికతలు.. ఆహార శుద్ధిప్యాకేజింగ్యంత్రాలుశీతలీకరణ కేంద్రాలుఅనుబంధ పరిశ్రమలకు సంబంధించిన ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ఉండనున్నాయివీటితో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి రూపొందించిన బీటూబీబీటూజీ నెట్‌వర్కింగ్ అవకాశాల ప్రదర్శన కూడా ఉండనుందివంటలకు సంబంధించిన అనుభవాలుచెఫ్ పోటీలు భారతదేశానికి చెందిన గొప్ప ఆహార వైవిధ్యాన్ని.. ఆరోగ్యకరమైనసుస్థిరమైనభవిష్యత్‌కు సరిపోయే ఆహారాలలో ప్రపంచ ధోరణులను ప్రదర్శించనున్నాయి.

 

రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమాలుఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించే 3వ ప్రపంచ ఆహార నియంత్రణ సదస్సుఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్).. ఆహార భద్రతా ప్రమాణాల సమన్వయంనియంత్రణ విషయంలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించేందుకు ప్రపంచ స్థాయి నియంత్రణ సంస్థలకు ఒక ప్రత్యేకమైన వేదికను అందించనున్నాయిపెరుగుతోన్న భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి సామర్థ్యంప్రపంచ మార్కెట్ అనుసంధానతలపై దృష్టి సారించే భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సంఘం (సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాఎస్ఈఏఐవరల్డ్ ఫుడ్ ఇండియాకు సమాంతరంగా 24వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (ఐఐఎస్ఎస్నిర్వహించనుంది.

 

ఈ భారీ కార్యక్రమానికి సన్నాహకంగా కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ 2025 సెప్టెంబర్ 11న ఢిల్లీలోని భారత్ మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను సవివరంగా సమీక్షించారువేదికకు సంబంధించిన లేఅవుట్రవాణా సదుపాయాలుస్టాళ్ల ప్రణాళికభద్రతా ఏర్పాట్లుఅంతర్జాతీయ ప్రతినిధులను స్వాగతించేందుకు ఉద్దేశించిన ప్రాధమ్యాలపై మంత్రి ఆరా తీశారుపొరపాట్లు లేని సమన్వయంఅంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంపాల్గొనే వారందరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించటం అవసరమని ఆయన ప్రధానంగా చెప్పారు.

 

***


(Release ID: 2166349) Visitor Counter : 10