ప్రధాన మంత్రి కార్యాలయం
ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2025 8:26AM by PIB Hyderabad
ఓనం పర్వదినం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ ఐక్యత, ఆశ, సాంస్కృతిక గర్వానికి ప్రతీక. ఓనం పండుగ మన సమాజంలో ఐక్యతా భావాన్ని బలపరచి, ప్రకృతితో మన అనుబంధాన్ని మరింత గాఢతరం చేయాలి’ అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సోషల్ మీడియా మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఇలా పోస్టు చేశారు.
‘ప్రతి ఒక్కరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. ఈ అందమైన పండుగ అందరికీ కొత్త ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓనం పండుగ కేరళ రాష్ట్ర శాశ్వత వారసత్వం, గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఇది ఐక్యత, నమ్మకం, సాంస్కృతిక గర్వానికి చిహ్నం. ఈ సందర్భం మన సమాజంలో సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేయాలని, ప్రకృతితో మన సంబంధాన్ని మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నాను’
(రిలీజ్ ఐడి: 2164286)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam