రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మూడు ఆధునిక పదార్థ సాంకేతికతలను పరిశ్రమకు బదిలీ చేసిన డీఆర్డీఓ

प्रविष्टि तिथि: 04 SEP 2025 12:44PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని డీఆర్డీఓ రక్షణ లోహశాస్త్ర పరిశోధన ప్రయోగశాల (డీఎమ్ఆర్ఎల్మూడు ఆధునిక పదార్థ సాంకేతికతలను పరిశ్రమ భాగస్వాములకు బదిలీ చేసిందిహైరదాబాద్ లోని డీఎమ్ఆర్ఎల్ లో 2025 ఆగస్టు 30న నిర్వహించిన కార్యక్రమంలో రక్షణశాఖ కార్యదర్శిడీఆర్ డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ పరిశ్రమ భాగస్వామ్యులకు సాంకేతికత బదిలీ లైసెన్సు ఒప్పంద పత్రాలను అందజేశారు.

బదిలీ చేసిన సాంకేతికతలు ఇవే:

  • అధిక నాణ్యతతో కూడిన రాడోమ్ ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను జగదీష్‌పూర్‌లోని బీహెచ్ఈఎల్ కు బదిలీ చేశారుదీని ద్వారా అధిక సామర్థ్యం కలిగిన రాడోమ్‌ల తయారీ సాధ్యమవుతుందిఇది కీలక రక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకుక్షిపణి వ్యవస్థలలో స్వయం సమృద్ధిని సాధించేందుకు సహాయపడుతుందిభారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు.

  • డీఎమ్ఆర్-1700 స్టీల్ షీట్లుప్లేట్ల తయారీ సాంకేతికను జేఎస్ పీఎల్అంగుల్‌కు బదిలీ చేశారుఇవి రక్షణ అవసరాల కోసం ఉపయోగపడతాయి .ఈ స్టీల్‌కు ఒక ప్రత్యేక లక్షణం ఉందిఇది  సాధారణ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక బలంవిరిగిపోకుండా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది.

  • డీఎమ్ఆర్ 249ఏ హెచ్ఎస్ఎల్ఏ ఉక్కు ప్లేట్ల తయారీ హక్కును సెయిల్ భిలాయ్ స్టీల్ ప్లాంటుకు బదిలీ చేశారునౌకా నిర్మాణానికి వినియోగించే ఈ ఉక్కు అధిక నాణ్యతదృఢత్వాన్ని కలిగి ఉంటుందిఖచ్చితమైన పరిమాణాలుభౌతికలోహ సంబంధిత ప్రమాణాలతో తయారైన ఈ ఉక్కు బలమైనదినమ్మకమైనది.

డీఆర్ డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ మాట్లాడుతూ.. పరిశోధనఅభివృద్ధి విభాగం విజయానికి తోడ్పడిన శాస్త్రవేత్తలుపరిశోధకుల కృషిని ప్రశంసించారుపరిశ్రమ–పరిశోధన భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూభవిష్యత్తులో ప్రభావవంతమైన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో డీఎమ్ఆర్ఎల్ చూపిన నిబద్ధతను ఆయన అభినందించారు.

ఈ సాంకేతిక బదిలీలు.. వ్యూహాత్మక అవసరాల కోసం స్వదేశీ పదార్థ సాంకేతికత అభివృద్ధిలో ముఖ్యమైన ప్రస్థానంగా నిలుస్తాయని ఆయన అన్నారుఈ సాంకేతికతలు విభిన్న రంగాల్లో ఉపయోగపడతాయిఇది డీఎమ్ఆర్ఎల్ బహుళ విభాగ నైపుణ్యాన్నిపరిశ్రమ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని అందిస్తుంది.. ప్రతిష్ఠాత్మక పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేయడం ద్వారా ఈ ఆవిష్కరణలను వేగంగా విస్తరించి వాణిజ్యవ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమలు చేయగలమని అన్నారు.

డీఆర్డీఓ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో (ఏఏఐబీ), డీఎమ్ఆర్ఎల్ మధ్య ఒక ఒప్పందం కుదరిందిఈ ఒప్పందం ద్వారా డీఎమ్ఆర్ఎల్ అనుభవంసదుపాయాలునైపుణ్యాలను ఏఏఐబీ కార్యకలాపాలకు అనుగుణంగా వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్డాక్టర్ ఆర్ వీహర ప్రసాద్డైరెక్టర్ జనరల్ (రిసోర్సెస్ అండ్ మేనేజ్‌మెంట్డాక్టర్ మనూ కొరుల్లాడీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్బాలమురళి కృష్ణన్ పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2163880) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil