కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నకిలీ పీఎంవీబీఆర్‌వై పోర్టళ్లపై పౌరులను హెచ్చరించిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 03 SEP 2025 3:53PM by PIB Hyderabad

https://viksitbharatrozgaryojana.org/https://pmviksitbharatrozgaryojana.com/ వంటి కొన్ని వెబ్‌సైట్లు భారత ప్రభుత్వానికి చెందినవిగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయనిమంత్రిత్వ శాఖ పేరుతో దేశవ్యాప్తంగా నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయని కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది.

ఈ వెబ్‌సైట్లతోవాటి కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందిఆ పోర్టళ్లతో పౌరులు ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దనివాటిని ఉపయోగించవద్దనిఆ పోర్టళ్ల ద్వారా ఎలాంటి చెల్లింపులూ చేయవద్దని సూచిస్తోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన కింద నమోదును సులభతరం చేసే ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన పోర్టల్ ఆగస్టులో ప్రారంభమైందిఈ పథకం కింద ప్రామాణికమైన సమాచారంసేవల కోసం.. సంస్థల యాజమాన్యాలు ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన పోర్టల్ (https://pmvbry.epfindia.gov.in లేదా https://pmvbry.labour.gov.in)ను సందర్శించివన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

మోసపూరిత వెబ్‌సైట్లు తప్పుడు నియామక ప్రకటన సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని పౌరులుసంస్థల యాజమాన్యాలుభాగస్వాములకు కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ సలహా ఇస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2163523) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam