ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో తయారైన మొదటి చిప్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్


ఇదొక గర్వకారణమైన సందర్భమని పేర్కొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్


దూరదృష్టి, దృఢ సంకల్పం, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నందుకు

ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి


7.8 శాతం జీడీపీ వృద్ధి నుంచి.... దేశంలో తయారైన మొదటి చిప్‌తో కూడిన సెమీకండక్టర్ వ్యవస్థ వరకూ

భారతదేశపు స్థిరత్వానికి దీపస్తంభం: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్


సెమికాన్ ఇండియా-2025లో కుదిరిన 12 అవగాహన ఒప్పందాలు

కెమెరా మాడ్యూళ్లు, మైక్రోఫోన్ బడ్స్, మినియేచర్ ప్యాకేజింగ్‌ సంబంధిత ఉత్పత్తుల డిజైన్, తయారీ‌తో పాటు నైపుణ్యాభిృద్ధి వ్యవస్థలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించనున్న ఈ ఒప్పందాలు


స్వచ్ఛ ఇంధనం, క్వాంటం, అధునాతన సాంకేతిక రంగాలలో సెమీకండక్టర్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు

బిలియన్ డాలర్ల మూలధనంతో డీప్ టెక్ కూటమిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి



తొలిదశలో ఫ్యాబ్స్, ఓసాట్, ముఖ్యమైన పరికరాలు, పదార్థాల తయారీ ద్వారా విస్తారిత వ్యవస్థ...

మలిదశలో మేకింగ్ ఇండియా ద్వారా ఉత్పత్తి దేశంగా భారత్... ఐఎస్ఎం 2.0 లక్ష్యం


ప్రపంచదేశాలతో ప

Posted On: 02 SEP 2025 8:02PM by PIB Hyderabad

భారత సెమీకండక్టర్ ప్రయాణం నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుందిప్రయోగాత్మక ఉత్పత్తిలో భాగంగా భారత్‌లో తయారైన మొదటి చిప్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అందజేశారుడిసెంబర్ 2021లో ప్రారంభించిన భారత సెమీకండక్టర్ మిషన్.. కేవలం మూడున్నర సంవత్సరాల్లో అనుమతుల దశ నుంచి ఉత్పత్తి దశకు మారిందిఈ ఘనతను సాధించడం మనకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారుఈ రంగానికి సంబంధించి దూరదృష్టిదృఢ సంకల్పంనిర్ణయాత్మక చర్యలు తీసుకున్న ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 7.8 శాతం జీడీపీ వృద్ధి నుంచి ‘భారత్‌లో తయారైన’ మొదటి చిప్‌లతో కూడిన సెమీకండక్టర్ వ్యవస్థ వరకు స్థిరత్వానికి భారత్ దీపస్తంభంగా నిలుస్తోందని ఆయన అన్నారు.

 

మేధో సంపత్తి హక్కులను గౌరవించడంసరఫరా గొలుసు అభివృద్ధికి మద్దతునివ్వటంప్రపంచ భాగస్వాములతో కలిసి సహాభివృద్ధి పద్ధతిలో నమూనాల తయారీని ప్రోత్సహించడం అనే నమ్మకంపై భారత సెమీకండక్టర్ మిషన్ ఏర్పాటైందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. "పరస్పర వృద్ధిఇరు పక్షాల గెలుపుకు ఉపయోగపడే విధంగా ప్రపంచ దేశాల వద్దకు భారతదేశం ఎల్లప్పుడూ ఒక భాగస్వామిగా వెళ్తుంది." అని ఆయన అన్నారుప్రపంచ విలువ గొలుసులో భారతదేశానికి ఉన్న బలమైన అనుకూలతల్లో ఈ విశ్వసనీయత ఒకటని అన్నారు.

 

సెమీకాన్ ఇండియా- 2025 సందర్భంగా 12 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూజరిగాయిదేశంలో స్వయం సమృద్ధిగాభవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ఉత్పత్తిఅభివృద్ధిని మెరుగుపరచడం.. సర్వీస్ సామర్థ్యాలను విస్తరించటంనైపుణ్యాభివృద్ధి రంగాన్ని బలోపేతం చేయడంపై ఈ ఒప్పందాలు దృష్టి సారించనున్నాయి.

 

ఆవిష్కరణలను మరింత పెంచేందుకు డీప్ టెక్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారుదీనికోసం దాదాపు బిలియన్ డాలర్ల మూలధనాన్ని ఇప్పటికే ప్రకటించారుప్రారంభంలో సెమీకండక్టర్లపై దృష్టి సారించనున్నప్పటికీ క్రమంగా ఇది స్వచ్ఛ ఇంధనం.. జీవ సాంకేతికతక్వాంటం సాంకేతికతఅంతరిక్షం తదితర అధునాతన (ఫ్రాంటియర్రంగాలపై పనిచేయనుందిఇది వర్థమాన డీప్ టెక్ పరిశ్రమలకు అత్యంత అవసరమైన మూలధన సహాయాన్ని (వెంచర్ క్యాపిటల్అందిస్తుందని మంత్రి అన్నారు.

మొహాలిలోని సెమీకండక్టర్ ప్రయోగశాల ఆధునికీకరణ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు వెళుతోందని కేంద్ర మంత్రి తెలిపారుఉత్పత్తి స్థాయిని పెంచటంకొత్త ఉత్పత్తుల టేప్ అవుట్స్‌ను ప్రారంభించడం.. భారతదేశపు అధిక విలువమధ్య స్థాయి తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారుఐఎస్ఎం 1.0 విజయాన్ని ఆధారంగా చేసుకుంటూఐఎస్ఎం 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందిఇది మొత్తం సెమీకండక్టర్ విలువ గొలుసుపై పనిచేసేందుకు ఫ్యాబ్‌లుఓశాట్ యూనిట్లుతయారీ పరికరాలు-పదార్థాల విషయంలో మద్దతునందించనుంది.

ఆమోదం పొందిన పది ప్రాజెక్టులలో ఎగుమతులు అనేవి అంతర్భాగంగా ఉంటాయని ఎలక్ట్రానిక్స్ఐటీ శాఖ మంత్రి తెలిపారుభారత్‌లో తయారైన చిప్‌లు దేశీయప్రపంచ మార్కెట్లకు ఉపయోగపడేలా ఇది చూసుకుంటుందని అన్నారుప్రపంచవ్యాప్తంగా చూసుకుంటేభారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తికి భారత్‌లో ఖర్చు ఇప్పటికే 15–30 శాతం తక్కువ అవుతోందని స్వతంత్ర అధ్యయనాలు తెలియజేస్తున్నాయిప్రాజెక్టులను ఆమోదించే విషయంలో భారత్ ఎప్పుడూ తొందరపడలేదనిసుస్థిర పురోగతి కోసం వృత్తిపరమైన అంచనా ఉండేలా చూసుకుందని ప్రధానంగా పేర్కొన్నారుఇప్పటికే రెండు ఫ్యాబ్‌లు ఉన్నాయిమరిన్ని రాబోతున్నాయిఇవి భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమలో ఉత్తేజాన్ని పెంచనున్నాయిఈ రంగంలో ఒకసారి గట్టి పునాది ఏర్పడిన తర్వాత వృద్ధి భారీగా పెరగనుంది.

 

సెమికాన్ ఇండియా- 2025లో ఏఎస్ఎంఎల్లామ్ రీసెర్చ్అప్లయిడ్ మెటీరియల్స్మెర్క్టోక్యో ఎలక్ట్రాన్ వంటి పరికరాలుముడి పదార్థాలకు సంబంధించిన ప్రపంచ సంస్థలతో సహా సెమీకండక్టర్ వ్యవస్థలోని ప్రధాన భాగస్వాములన్నీ పాల్గొన్నాయిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగతి సాధిస్తోన్న భారత సెమీకండక్టర్ మిషన్‌పై ప్రపంచం కలిగి ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

 

సెమీ-కండక్టర్ ప్రయోగశాలలో (ఎస్‌సీఎల్భారతీయ విద్యార్థులు తయారు చేసిన 20 చిప్‌లను ప్రధానమంత్రికి అందజేశారుకార్యక్రమంలో ఇదొక ప్రత్యేక ఆకర్షణదేశవ్యాప్తంగా 78 విశ్వవిద్యాలయాలు అధునాతన ఈడీఏ సాధనాలను ఉపయోగిస్తున్నాయని.. అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను భారత్ తయారు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారుప్రపంచ సెమీకండక్టర్ శ్రామిక శక్తిలో దాదాపు 20% వాటాను ఇప్పటికే భారత్ కలిగి ఉందని తెలిపారుమిషన్‌కు నైపుణ్యాభివృద్ధిఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవని అన్నారు.

 

డిజైన్అంకుర వ్యవస్థను కూడా భారతదేశం అభివృద్ధి చేస్తోంది. 28 కంటే ఎక్కువ అంకురాలు ప్రాజెక్ట్ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి పురోగమిస్తున్నాయిఇటీవలి అవగాహన ఒప్పందాలు.. పూర్తి ఐఓటీ చిప్‌సెట్‌లుకెమెరా వ్యవస్థలను తయారీకి సంబంధించినవి కాగా.. ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలు స్వదేశీ మైక్రోకంట్రోలర్లుప్రాసెసర్లను విడుదల చేశాయిడిజైన్ ఆధారిత ప్రోత్సాహక (డీఎల్ఐపథకం విలువైన మేధో సంపత్తి (ఐపీపోర్ట్‌ఫోలియోను తయారు చేసిందిదీని కింద ఫ్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు 25 ఉత్పత్తులను గుర్తించారు.

 

2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి సెమీకండక్టర్ పరిశ్రమ చేరుకుంటున్న అంచనా ఉందిదీనితో పాటు నమ్మకంసాంకేతికతనైపుణ్యాల పరంగా బలమైన స్థానాన్ని కలిగిన భారత్.. ప్రధానమంత్రి దార్శనికతను సాధించేలా సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఎదగటానికి సిద్ధంగా ఉంది.

 

సెమికాన్ ఇండియా 2025 సందర్భంగా చేసుకున్న ఎంఓయూలుచేసిన ప్రకటనలు

1. తయారీప్యాకేజింగ్‌కు సంబంధించి భారత్‌లో సెమీకండక్టర్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్మెర్క్ మధ్య ఒప్పందం.

2. దేశీయ సెమీకండక్టర్ డిజైన్ఐపీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్మధ్య ఒప్పందం.

 

3. స్పర్ష్-ఐక్యూథర్డ్‌ఐటెక్ఫోకల్లీసెన్స్‌సెమీ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్థానికంగా ఆటోమేటివ్ కెమెరామాడ్యూల్ ఉమ్మడి అభివృద్ధిని ప్రారంభించనున్నట్లు కేన్స్ సెమికాన్ ప్రకటన.

4. ఇన్ఫినియన్ భాగస్వామ్యంతో భారతదేశంలో మొదటి ఎంఈఎంస్ మైక్రోఫోన్అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజీలను అందించనున్నట్లు కేన్స్ సెమికాన్ ప్రకటన.

5. భారీగా ఉపయోగించేందుకు వీలున్న సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా తయారైనఎలక్ట్రానిక్ పాస్‌పోర్టల వంటి తదుపరి తరం డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను నడిపించేస్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉన్న భారత్‌లో తయారైన సెక్యూర్ చిప్ సంయుక్త అభివృద్ధి ప్రారంభోత్సవ ప్రకటన.. ఐఐటీ గాంధీనగర్సీడాక్‌ సహకారంతో దీన్ని చేపట్టనున్న ఎల్‌అండ్‌టీ సెమీకండక్టర్ సంస్థ.

6. సెమీకండక్టర్ పరిశోధనక్వాంటం సాంకేతికతల విషయంలో నాయకత్వానికి సంబంధించి జాతీయ ఆవిష్కరణ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఎల్అండ్‌టీ సెమీకండక్టర్ఐఐఎస్‌సీ బెంగళూరు మధ్య అవగాహన ఒప్పందం.

7. సీడాక్ అభివృద్ధి చేసిన స్వదేశీ వెగా ప్రాసెసర్‌ను గుజరాత్‌లోని ఒక మహిళ నాయకత్వంలోని దేశీయ అంకురం అయిన ఇండీసెమిక్‌కు చెందిన బ్లూటూత్లోరా మ్యూడ్యూల్స్‌లో అనుసంధానిస్తూ భారతదేశపు మొదటి ఐఓటీ ఎవల్యూషన్ బోర్డు ఆవిష్కరణ.

8. సెమీకండక్టర్ నైపుణ్యాలుపరిశ్రమలువిద్యా సంస్థల సంబంధాలుసెమీకండక్టర్ సాంకేతికతల్లో సామర్థ్య తయారీని ప్రోత్సహించేందుకు ఎన్ఐఈఎల్ఐటీసింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏమధ్య అవగాహన ఒప్పందం.

9. ఐఎస్ఎం జాతీయ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా అనువర్తిత పరిశోధన (అప్లయిడ్ రీసెర్చ్), ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళుతూనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత సెమీకండక్టర్ వ్యవస్థ కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు సహకార విధివిధానాలను ఏర్పాటు చేసేందుకు ఐఎస్ఎంన్యూ ఏజ్ మేకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్‌టెక్మధ్య అవగాహన ఒప్పందం.

10. శాస్త్రీయవిద్యా సహకారంపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎంమధ్య అవగాహన ఒప్పందం.

11. డీఎల్ఐ పథకం కింద ఆమోదం పొందిన కంపెనీలకు సినాప్సిస్ ఐపీలను సులభంగా వాడుకునే వెసులుబాటు కల్పించేందుకు సీడాక్సినాప్సిస్ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ మధ్య అవగాహన ఒప్పందం.

12. డీఎల్ఐ పథకం కింద ఆమోదం పొందిన కంపెనీలకు అందుబాటులో ఉండే డిజైన్ మౌలిక సదుపాయాలపై ప్రకటన..

మౌలిక సదుపాయాలు, అవి అందించే కంపెనీలు కంపెనీలు ఇలా ఉన్నాయి. :

ఐపీ కోర్:

ఏ) ఐటీసీ కొరియా

బీ) సెక్యూర్ ఐసీ

సీ) కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్

డీ) అనలాగ్ బిట్స్

ఈడీఏ టూల్స్ :

ఏ) సిమ్ యోగ్ టెక్నాలజీస్

బీ) కేడర్ డిజైన్ సిస్టమ్స్

పోస్ట్ సిలికాన్ వాలిడేషన్:

ఏ) ఎమర్సన్ గ్లోబల్

బీ) స్మార్ట్సాక్ సొల్యూషన్స్

సీ) సైయంట్ సెమీకండక్టర్

 

సెమికాన్ ఇండియా:

ప్రపంచవ్యాప్తంగా సెమి నిర్వహించే ఎనిమిది వార్షిక సెమికాన్ ప్రదర్శనలలో సెమికాన్ ఇండియా ఒకటి. ఇది ప్రపంచ సెమీకండక్టర్ డిజైన్తయారీ వ్యవస్థలోని కార్యనిర్వాహకులుప్రముఖ నిపుణులను ఒక వేదికకు తీసుకొస్తుందిసెమికాన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ సెమీకండక్టర్ వ్యవస్థలో సహకారంస్థిరత్వాన్ని పెంపొందించే సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన భవిష్యత్తులో పరివర్తన చెందే ప్రయాణానికి నాంది పలుకుతుంది.

సెమి:

సెమి అనేది సెమీకండక్టర్ఎలక్ట్రానిక్స్ డిజైన్తయారీ సరఫరా వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు పనిచేసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,000 కంటే ఎక్కువ సభ్య కంపెనీలు, 1.5 మిలియన్ల నిపుణులను అనుసంధానించే ప్రపంచ స్థాయి పరిశ్రమ సంఘంవారు సలహామానవ వనరుల నైపుణ్యాభివృద్ధిసుస్థిరతసరఫరా వ్యవస్థ నిర్వహణఇతర కార్యక్రమాల ద్వారా పరిశ్రమలో ప్రధాన సవాళ్లను పరిష్కరించే విషయంలో సభ్యుల సహకారాన్ని వేగవంతం చేస్తోంది.

ఐఎస్ఎం:

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవైకింద పనిచేసే స్వతంత్ర సంస్థ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం). దేశంలో సుస్థిరమైనప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండే సెమీకండక్టర్డిస్ ప్లే తయారీ వ్యవస్థను తయారు చేసేందుకు ఉపయోగపడే సెమికాన్ ఇండియా కార్యక్రమానికి ఇది నోడల్ ఏజెన్సీప్రతిపాదనలను పరిశీలించటంసాంకేతిక భాగస్వామ్యాలను సులభతరం చేయడంకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడంఆర్థికపరమైన ప్రోత్సాహకాల విషయంలో చెల్లింపులు చేయటం వంటి బాధ్యతలను ఐఎస్ఎం నిర్వహిస్తోందిఆర్థిక భద్రతసాంకేతిక స్వావలంబనను నిర్ధారించడం ద్వారా భారత్‌ను సెమీకండక్టర్ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలో విశ్వసనీయ ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తోంది.

 

***


(Release ID: 2163248) Visitor Counter : 2