రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో వ్యోమగాములు శుభాంశు శుక్లా, పీబీ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లను సత్కరించిన రక్షణమంత్రి


మన వ్యోమగాములు భారత ఆకాంక్షలకు మార్గదర్శకులు: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

"అంతరిక్ష రంగాన్ని భారత్ కేవలం పరిశోధనా రంగంగా మాత్రమే చూడదు..

రేపటి ఆర్థిక వ్యవస్థ, భద్రత, శక్తి, మానవాళి భవిష్యత్తుగా చూస్తుంది"

प्रविष्टि तिथि: 24 AUG 2025 1:25PM by PIB Hyderabad

ఇస్రో మానవ సహిత తొలి అంతరిక్ష ప్రయోగం- గగన్‌యాన్‌లో భాగమైన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాగ్రూప్ కెప్టెన్ పీబీ నాయర్గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్‌లను న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఘనంగా సత్కరించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నలుగురు వ్యోమగాములను దేశ రత్నాలుగాజాతీయ ఆకాంక్షలకు మార్గదర్శకులుగా అభివర్ణించారు.

 

అంతరిక్ష రంగంలో విస్తరిస్తున్న భారత ఉనికిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. మనం అంతరిక్షాన్ని పరిశోధనా రంగంగా మాత్రమే కాకుండారేపటి ఆర్థిక వ్యవస్థభద్రతశక్తిమానవాళి భవిష్యత్తుగా చూస్తాంమనం భూమి ఉపరితలం దాటి అంతరిక్షంలోని కొత్త సరిహద్దుల్లోకి క్రమంగా ముందుకు సాగుతున్నాంచంద్రుని నుంచి అంగారక గ్రహం దాకా మనం చేరుకున్నాంనేడు మన దేశం గగన్‌యాన్ వంటి ప్రయోగాలకు పూర్తిగా సిద్ధంగా ఉంది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

 

ఈ విజయం కేవలం సాంకేతికపరమైన విజయం మాత్రమే కాదుఆత్మనిర్భర్ భారత్‌లో ఒక కొత్త అధ్యాయంగా రక్షణమంత్రి అభివర్ణించారు. “ప్రపంచంలో అంతరిక్ష శక్తిని కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ సగర్వంగా నిలిచిందిమన అంతరిక్ష కార్యక్రమం కేవలం ప్రయోగశాలలుప్రయోగ వాహనాలకే పరిమితం కాదుఇది మన జాతీయ ఆకాంక్షలుప్రపంచ స్థాయి దార్శనికతకు ప్రతిబింబంపరిమిత వనరులే ఉన్నప్పటికీ మన అపరిమిత సంకల్ప శక్తితో అత్యంత సవాలుతో కూడిన లక్ష్యాలను కూడా అద్భుతమైన విజయాలుగా మార్చగలమని చంద్రయాన్ నుంచి మంగళయాన్ దాకా సాగిన ప్రయోగాలతో మనం నిరూపించాంఅని ఆయన పేర్కొన్నారు.

 

కమ్యూనికేషన్ ఉపగ్రహాలువాతావరణ పర్యవేక్షణవిపత్తు నిర్వహణ వంటి అంతరిక్షం నుంచి పొందిన సాంకేతికతలు దేశంలోని ప్రతి గ్రామానికిప్రతి రంగానికి సేవలను అందిస్తున్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారుఅంతరిక్ష ప్రయాణంలో భారత్ వెనకబడి ఉండకూడదని పేర్కొన్నారురాబోయే కాలంలో మానవ నాగరికత గమనాన్ని అంతరిక్ష మైనింగ్లోతైన అంతరిక్ష అన్వేషణగ్రహ వనరులు పునర్నిర్వచించగలవని ఆయన తెలిపారు.

 

సైనిక శక్తికిసాంకేతిక పరాక్రమానికి చిహ్నంగా అంతరిక్ష రంగం ఉందనీ, మానవ నాగరికత సమష్టి ప్రయాణంలో ఒక కొత్త దశగా నిలిచే ఒక యుగంలోకి ప్రపంచం ప్రవేశించిందని రక్షణమంత్రి పేర్కొన్నారు. “భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి వసుధైక కుటుంబమనే సందేశాన్ని అందిస్తూనే ఉందిమన శాస్త్రవేత్తలువ్యోమగాములు అదే సందేశాన్ని నేడు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

 

విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తిచేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రశంసిస్తూ.. ఆయన దృఢ సంకల్పంధైర్యాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఈ యాత్ర భారత స్ఫూర్తిని ప్రతిబింబించింది. శుక్లాను జాతికి గర్వకారణంగా మార్చింది. “రెండున్నర సంవత్సరాల శిక్షణ రెండున్నర నెలల్లోనే పూర్తి చేయడం శుక్లా అంకితభావానికి నిదర్శనంఇది భారతీయుల పట్టుదలకు చిహ్నంఈ అసాధారణ ఘనత కేవలం సాంకేతిక సాధన మాత్రమే కాదు. ఇది విశ్వాసంఅంకితభావాల సందేశంఇది దేశానికి గర్వకారణం మాత్రమే కాదు. ఇది యావత్ మానవాళి పురోగతికి ఆధారం” అని ఆయన వ్యాఖ్యానించారు.

 

పౌర-సైనిక సేవల సమ్మిళిత చిహ్నంగా గ్రూప్ కెప్టెన్ శుక్లాను రక్షణమంత్రి అభివర్ణించారు. “అయన భారత వైమానిక దళ యూనిఫాం ధరించినప్పటికీఅంతరిక్షంలోకి ఆయన ప్రయాణం కేవలం సాయుధ దళాలు.. భారత్ తరపున మాత్రమే కాకుండా యావత్ మానవాళికి ప్రతినిధిగా సాగిందిఈ చారిత్రక లక్ష్యం ద్వారా పౌర సేవల రంగానికి ఆయన అందించిన సహకారం చరిత్రలో నిలిచిపోతుంది” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

 

వ్యోమగాములను శారీరకంగామానసికంగాభావోద్వేగపరంగాఆరోగ్యపరంగా సిద్ధం చేయవలసిన అవసరం ఎంతో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారుఈ శిక్షణలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ పోషించిన కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "ఆ సంస్థ విజయానికి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఒక గొప్ప నిదర్శనంఅని రక్షణమంత్రి వ్యాఖ్యానించారు.

 

గ్రూప్ కెప్టెన్ శుక్లా ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తన అసాధారణ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారుత్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

****


(रिलीज़ आईडी: 2160462) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam