ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 15 AUG 2025 8:28PM by PIB Hyderabad

నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతి పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేషన్ గారు ఇక మన మధ్య లేరని తెలిసి బాధ పడ్డాను. అంకిత భావం కలిగిన ఒక జాతీయ వాదిగా ఆయనను స్మరించుకుంటూ ఉంటాం. ఆయన తన జీవనాన్ని సేవకూ, దేశ నిర్మాణానికీ అంకితం చేశారు. తమిళనాడులో బీజేపీని విస్తరించడానికి ఆయన ఎంతో శ్రమించారు. తమిళ సంస్కృతి అంటే ఆయనకు ఎంతో మక్కువ. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను సానుభూతిని తెలియజేస్తున్నా. ఓం శాంతి.’’ 


(Release ID: 2157085)