ప్రధాన మంత్రి కార్యాలయం
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
15 AUG 2025 6:44AM by PIB Hyderabad
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వేర్వేరు సందేశాల్లో:
“దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం అందరి జీవితాల్లో నవ్యోత్సాహాన్ని, నవ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నాను. తద్వారా వికసిత భారత్ సాకారానికి సరికొత్త ఉత్తేజం లభిస్తుందని ఆశిస్తున్నాను... జైహింద్!”
“స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సమర యోధులు కలలను నెరవేర్చే దిశగా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించడానికి మరింత శ్రమిద్దాం. జైహింద్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2156728)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
Marathi
,
Malayalam
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada