ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని దౌసాలో ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధాని
Posted On:
13 AUG 2025 4:24PM by PIB Hyderabad
రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ’’
***
(Release ID: 2156226)
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam