ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని దౌసాలో ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధాని

Posted On: 13 AUG 2025 4:24PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని పీఎంఎన్‍ఆర్‌ఎఫ్ నుంచి అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ’’

 

***


(Release ID: 2156226)